logo

వివాహవేదికపై మర్కటం చేష్టలు

చెన్నరాయపట్టణ తాలూకా హిరిసావెలో మంగళవారం నిర్వహించిన ఓ వివాహ ఘట్టంలో ఒక మర్కటం హాజరైంది. పెళ్లికుమారుడి వెంట తిరిగింది.

Published : 03 Jul 2024 03:22 IST

కల్యాణమండపంలో తిరిగి.. విందు ఆరగిస్తున్న వానరం

హాసన, న్యూస్‌టుడే : చెన్నరాయపట్టణ తాలూకా హిరిసావెలో మంగళవారం నిర్వహించిన ఓ వివాహ ఘట్టంలో ఒక మర్కటం హాజరైంది. పెళ్లికుమారుడి వెంట తిరిగింది. భోజనాల బంతికి వెళ్లి, విస్తర్లలో ఉన్న ఆహారం నుంచి తనకు ఇష్టమైన పదార్థాలను తీసుకుని ఆరగించింది. సోమ, మంగళవారాల్లో పెళ్లి కార్యక్రమాలు కొనసాగగా.. దాని అల్లరి భరించలేక ఒక అరటి గెలను ఉంచగా, కొన్ని పండ్లు తిని మిన్నకుంది. వధూవరులను తీసుకువెళ్లిన ఇంటి వరకు వెళ్లింది. దాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మందిని కొరికి గాయపరచింది. గాయపడిన సుశీలమ్మ, లీలావతి, నింగేగౌడ, గౌరమ్మ, గిరిజమ్మ, తిమ్మేగౌడ, గిరిగౌడ, కుమార్‌లను చికిత్స కోసం స్థానిక సముదాయ ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని