అర్థవంతంగా కాంతరాజు నివేదిక
వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ అధ్యక్షుడు కాంతరాజు ఇచ్చిన సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధింత నివేదికను ప్రభుత్వం స్వీకరించిందని సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి స్పష్టం చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న శివరాజ్ తంగడగి
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ అధ్యక్షుడు కాంతరాజు ఇచ్చిన సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధింత నివేదికను ప్రభుత్వం స్వీకరించిందని సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి స్పష్టం చేశారు. నివేదికలోని అంశాలకు నిబద్ధత ఉండడంతో దాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారని వివరించారు. మంత్రి మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఏ సముదాయానికీ నష్టం వాటిల్లకుండా అందులోని సిఫార్సులను అమలు చేస్తామని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఈ నివేదికను ఉద్దేశపూర్వకంగా స్వీకరించలేదని తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగిన సమయంలో అందుకున్న నివేదికపై సమగ్రంగా చర్చించడం సాధ్యం కాలేదన్నారు. మంత్రి పదవిపై తనకు సంతృప్తి ఉందన్నారు. పార్టీపై నిష్ఠను గుర్తించి రెండుసార్లు పదవి ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాలని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని హోం మంత్రి డాక్టర్ పరమేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్య, వైద్యానికి పెద్దపీట
[ 05-07-2024]
ప్రజారోగ్యం, ఉన్నత విద్యను మెరుగుపరచే దిశగా నిధులతో పాటు వైద్య సిబ్బంది నియామకాలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఇదే సందర్భంగా ‘నమ్మ క్లినిక్’లలో ప్రయోగశాలల ఏర్పాటుకు తగిన నిధులు విడుదల చేసింది. -
తీరం.. కకావికలం
[ 05-07-2024]
తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. -
దర్శన్కు మళ్లీ న్యాయనిర్బంధం
[ 05-07-2024]
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్రా గౌడ, ఇతర పదిహేను మంది నిందితులకు మరో రెండు వారాలు న్యాయనిర్బంధాన్ని (జ్యుడీషియల్ కస్టడీ) విధిస్తూ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. -
సిద్ధు సర్కారుపై పోరాటం
[ 05-07-2024]
దేశంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వెనుక కార్యకర్తల కృషి, రాష్ట్రంలోని కార్యవర్గ బృందం సేవలు అనితర సాధ్యమని కమలదండు కొనియాడింది. -
శిరసి కళాకారిణి ఘనత భళా
[ 05-07-2024]
ప్రపంచ శాంతికి యక్షగానం పేరిట తొమ్మిది విధానాల్లో ప్రదర్శనలు ఇస్తున్న శిరసికి చెందిన కళాకారిణి తులసి హెగ్డే (16) పేరును లండన్కు చెందిన ప్రఖ్యాత ‘వరల్డ్ రికార్డు సంస్థ’ తన జాబితాలో చేర్చింది. -
వాయుసేన సంబరాల హోరు
[ 05-07-2024]
దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్ఫోర్స్ టెక్నికల్) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది. -
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రైతు దుర్మరణం
[ 05-07-2024]
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో కర్ణాటకకు చెందిన రైతు గాదిలింగప్ప(28) దుర్మరణం చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు