రౌతు లేని బండి రాజధానిలో సందడి
రాజధాని నగరంలో మెట్రో అభివృద్ధి పనుల జోరు వేగం పుంజుకుంది. చోదకుడి అవసరంలేని మెట్రో రైలు సంచార పరీక్షలను సంబంధిత విషయ నిపుణులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
నాజూకు మెట్రోకు పరీక్షలు
చోదకుడి అవసరంలేని మెట్రో.. పట్టాలపై పరుగులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : రాజధాని నగరంలో మెట్రో అభివృద్ధి పనుల జోరు వేగం పుంజుకుంది. చోదకుడి అవసరంలేని మెట్రో రైలు సంచార పరీక్షలను సంబంధిత విషయ నిపుణులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆ రైలు నిర్వహణకు సంబంధించి బీఎంఆర్సీఎల్ ఇంజినీరింగ్ నిపుణులకు చైనా నిపుణులు శిక్షణ ఇస్తున్నారు. నగరంలోని ఆర్.వి.రోడ్డు- బొమ్మనహళ్లి మధ్య 18.6 కిలోమీటర్ల పొడవునా ఈ నాజూకు వాహనం పరుగులు తీయనుంది. వీటిని చైనా మెట్రో రైలు కార్పొరేషన్ అందజేసిన విషయం తెలిసిందే. నెల రోజులుగా దాని పనితీరు గమనిస్తూనే ఉన్నారు. రైలు గరిష్ఠ వేగం, కుదుపుల అంశం, అత్యవసరంగా ఆగడానికి ఉపకరించే సాంకేతికత, సిగ్నల్ వ్యవస్థకు స్పందించే సెన్సర్లు, విద్యుత్తు సరఫరా తదితరాలను పరిశీలిస్తున్నామని బీఎంఆర్సీఎల్ అధికారులు తెలిపారు. ఇప్పటికే 25 రోజులుగా ఇది పట్టాలపై పరుగులు తీస్తోంది. మరో 40 రోజులు పాటు పరీక్షలు కొనసాగుతాయి. ఈ యేడాది ఆఖరులోగానే ప్రజల సేవకు సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు. చైనా నుంచి మరో ఆరు రైళ్లు దిగుమతి చేసుకుంటారు. అవి వచ్చాక ఏకకాలంలో పనితీరు సరిచూస్తారు. ఆర్.వి.రోడ్డు- బొమ్మనహళ్లి మధ్య మెట్రోరైలు ప్రారంభిస్తే ఐటీ ఉద్యోగులతో పాటు హోసూరు ప్రాంతం వారికి ఉపకరించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్య, వైద్యానికి పెద్దపీట
[ 05-07-2024]
ప్రజారోగ్యం, ఉన్నత విద్యను మెరుగుపరచే దిశగా నిధులతో పాటు వైద్య సిబ్బంది నియామకాలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఇదే సందర్భంగా ‘నమ్మ క్లినిక్’లలో ప్రయోగశాలల ఏర్పాటుకు తగిన నిధులు విడుదల చేసింది. -
తీరం.. కకావికలం
[ 05-07-2024]
తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. -
దర్శన్కు మళ్లీ న్యాయనిర్బంధం
[ 05-07-2024]
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్రా గౌడ, ఇతర పదిహేను మంది నిందితులకు మరో రెండు వారాలు న్యాయనిర్బంధాన్ని (జ్యుడీషియల్ కస్టడీ) విధిస్తూ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. -
సిద్ధు సర్కారుపై పోరాటం
[ 05-07-2024]
దేశంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వెనుక కార్యకర్తల కృషి, రాష్ట్రంలోని కార్యవర్గ బృందం సేవలు అనితర సాధ్యమని కమలదండు కొనియాడింది. -
శిరసి కళాకారిణి ఘనత భళా
[ 05-07-2024]
ప్రపంచ శాంతికి యక్షగానం పేరిట తొమ్మిది విధానాల్లో ప్రదర్శనలు ఇస్తున్న శిరసికి చెందిన కళాకారిణి తులసి హెగ్డే (16) పేరును లండన్కు చెందిన ప్రఖ్యాత ‘వరల్డ్ రికార్డు సంస్థ’ తన జాబితాలో చేర్చింది. -
వాయుసేన సంబరాల హోరు
[ 05-07-2024]
దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్ఫోర్స్ టెక్నికల్) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది. -
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రైతు దుర్మరణం
[ 05-07-2024]
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో కర్ణాటకకు చెందిన రైతు గాదిలింగప్ప(28) దుర్మరణం చెందారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
-
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
-
‘అంతా మీరే చేశారు’.. కాదు మీ వల్లే జిల్లాలో పార్టీ నాశనమైంది
-
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
-
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
-
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ