కమలదండులోకి ఈశ్వరప్ప?
అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, లోక్సభ ఎన్నికల్లో కుమారుడు కాంతేశ్కు టికెట్ ఇవ్వలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప అలక పూనారు.
శివమొగ్గ, న్యూస్టుడే : అసెంబ్లీ ఎన్నికల్లో తనకు, లోక్సభ ఎన్నికల్లో కుమారుడు కాంతేశ్కు టికెట్ ఇవ్వలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప అలక పూనారు. ఆ క్రమంలోనే ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో భాజపా ఆయనపై ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. మళ్లీ పార్టీలోకి రావాలని తనకు కబురు అందిందని ఈశ్వరప్ప సోమవారం ఇక్కడ విలేకరులకు వెల్లడించారు. టికెట్ ఇవ్వకుండా కొందరు నాయకులు అడ్డుపడటంతోనే తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశానని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను పార్టీ పెద్దలే త్వరలో ప్రకటిస్తారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఈశ్వరప్ప అసహనం కట్టలు తెంచుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కీలక పదవులన్నీ మాజీ ముఖమంత్రి బి.ఎస్.యడియూరప్ప కుటుంబానికే భాజపా అధిష్ఠానం కట్టబెట్టడం సరికాదంటూ అప్పట్లో అభ్యంతరం ప్రకటించారు. అప్ప కుమారుడు రాఘవేంద్రను ఓడించడమే లక్ష్యంగా శివమొగ్గ లోక్సభ నియోజకవర్గంలో పోటీకి దిగి, నిరాశకు లోనుకావడం ప్రస్తావనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్య, వైద్యానికి పెద్దపీట
[ 05-07-2024]
ప్రజారోగ్యం, ఉన్నత విద్యను మెరుగుపరచే దిశగా నిధులతో పాటు వైద్య సిబ్బంది నియామకాలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఇదే సందర్భంగా ‘నమ్మ క్లినిక్’లలో ప్రయోగశాలల ఏర్పాటుకు తగిన నిధులు విడుదల చేసింది. -
తీరం.. కకావికలం
[ 05-07-2024]
తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. -
దర్శన్కు మళ్లీ న్యాయనిర్బంధం
[ 05-07-2024]
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్రా గౌడ, ఇతర పదిహేను మంది నిందితులకు మరో రెండు వారాలు న్యాయనిర్బంధాన్ని (జ్యుడీషియల్ కస్టడీ) విధిస్తూ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. -
సిద్ధు సర్కారుపై పోరాటం
[ 05-07-2024]
దేశంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వెనుక కార్యకర్తల కృషి, రాష్ట్రంలోని కార్యవర్గ బృందం సేవలు అనితర సాధ్యమని కమలదండు కొనియాడింది. -
శిరసి కళాకారిణి ఘనత భళా
[ 05-07-2024]
ప్రపంచ శాంతికి యక్షగానం పేరిట తొమ్మిది విధానాల్లో ప్రదర్శనలు ఇస్తున్న శిరసికి చెందిన కళాకారిణి తులసి హెగ్డే (16) పేరును లండన్కు చెందిన ప్రఖ్యాత ‘వరల్డ్ రికార్డు సంస్థ’ తన జాబితాలో చేర్చింది. -
వాయుసేన సంబరాల హోరు
[ 05-07-2024]
దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్ఫోర్స్ టెక్నికల్) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది. -
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రైతు దుర్మరణం
[ 05-07-2024]
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో కర్ణాటకకు చెందిన రైతు గాదిలింగప్ప(28) దుర్మరణం చెందారు.