డిజిటల్ దాఖలాలూ సాక్ష్యాలే
నేర నియంత్రణకు, కొత్త నేరాలను అడ్డుకునేందుకు అమలులోకి వచ్చిన చట్టాలపై అన్ని ఠాణాల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇచ్చామని హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు.
కొత్త చట్టమే ఇక చుట్టం: పరమేశ్వర్
పరమేశ్వర్
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : నేర నియంత్రణకు, కొత్త నేరాలను అడ్డుకునేందుకు అమలులోకి వచ్చిన చట్టాలపై అన్ని ఠాణాల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇచ్చామని హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ డిజిటల్ దాఖలాలను ఇకపై సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. కొత్త చట్టాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేందుకు యాప్ను సిద్ధం చేశామన్నారు. ఈ చట్టాలను అమలు చేసిన అనంతరం ఎటువంటి ఫలితాలు వస్తాయో వేచి చూడడం తప్పనిసరి అన్నారు. ఇప్పటి నుంచి నమోదయ్యే అన్ని కేసులను కొత్త చట్టాలకు అనుగుణంగానే దాఖలా చేస్తారని తెలిపారు. త్వరలో కర్ణాటక విధానసభ ఎన్నికలు జరుగుతాయని మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ బసవరాజ బొమ్మై చేసిన వ్యాఖ్యలను పరమేశ్వర్ ఖండించారు. సీటీ రవి మరో రకంగా మాట్లాడుతున్నారని, భాజపాలోనే నేతల మధ్య అవగాహన లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ పాలన కన్నా కాంగ్రెస్ హయాంలోనే ప్రజలకు ఎక్కువ ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. వాల్మీకి అభివృద్ధి మండలి కేసును సీబీఐ, ఈడీ, సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నేరం చేస్తే నాయకులైనా, అధికారులైనా శిక్ష అనుభవించవలసి ఉంటుందని అన్నారు.
రెండు కేసులు నమోదు..
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : దేశంలో నూతన భారతీయ నాగరిక సురక్షా చట్టం (బీఎన్ఎస్ఎస్) సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. కన్నడనాట దీని పరిధిలో తొలిసారిగా రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. ఆడుగూడి, హెచ్.ఎస్.ఆర్. లేఔట్ పోలీసుఠాణాల పరిధిలో దొంగతనాలకు సంబంధించి ఆ చట్టం 194వ నిబంధన కింద ఫిర్యాదులు నమోదు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్య, వైద్యానికి పెద్దపీట
[ 05-07-2024]
ప్రజారోగ్యం, ఉన్నత విద్యను మెరుగుపరచే దిశగా నిధులతో పాటు వైద్య సిబ్బంది నియామకాలకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఇదే సందర్భంగా ‘నమ్మ క్లినిక్’లలో ప్రయోగశాలల ఏర్పాటుకు తగిన నిధులు విడుదల చేసింది. -
తీరం.. కకావికలం
[ 05-07-2024]
తీరప్రాంత జిల్లాలతో పాటు కొడగు, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాలను వానదేవుడు చుట్టుముట్టాడు. వారం రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింప చేస్తున్నాయి. -
దర్శన్కు మళ్లీ న్యాయనిర్బంధం
[ 05-07-2024]
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్రా గౌడ, ఇతర పదిహేను మంది నిందితులకు మరో రెండు వారాలు న్యాయనిర్బంధాన్ని (జ్యుడీషియల్ కస్టడీ) విధిస్తూ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. -
సిద్ధు సర్కారుపై పోరాటం
[ 05-07-2024]
దేశంలో ఎన్డీఏ కూటమి వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వెనుక కార్యకర్తల కృషి, రాష్ట్రంలోని కార్యవర్గ బృందం సేవలు అనితర సాధ్యమని కమలదండు కొనియాడింది. -
శిరసి కళాకారిణి ఘనత భళా
[ 05-07-2024]
ప్రపంచ శాంతికి యక్షగానం పేరిట తొమ్మిది విధానాల్లో ప్రదర్శనలు ఇస్తున్న శిరసికి చెందిన కళాకారిణి తులసి హెగ్డే (16) పేరును లండన్కు చెందిన ప్రఖ్యాత ‘వరల్డ్ రికార్డు సంస్థ’ తన జాబితాలో చేర్చింది. -
వాయుసేన సంబరాల హోరు
[ 05-07-2024]
దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్ఫోర్స్ టెక్నికల్) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది. -
రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రైతు దుర్మరణం
[ 05-07-2024]
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద గురువారం ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో కర్ణాటకకు చెందిన రైతు గాదిలింగప్ప(28) దుర్మరణం చెందారు.