కేంద్రానికి లేఖ రాశాం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి డాక్టర్ శరణు ప్రకాశ్ పాటిల్ వెల్లడించారు.
డాక్టర్ శరణు ప్రకాశ్ పాటిల్
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి డాక్టర్ శరణు ప్రకాశ్ పాటిల్ వెల్లడించారు. తమ కళాశాలల్లో 15 శాతం సీట్లను ప్రవాస భారతీయులకు కేటాయించుకునేందుకు అవకాశం ఇవ్వాలని జాతీయ వైద్య కమిషన్ అధ్యక్షునికి రాసిన లేఖలో కోరామని చెప్పారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఎన్ఆర్ఐలకు కేటాయించేందుకు 22 వైద్య కళాశాలల్లో 508 సూపర్ న్యూమెరరీ సీట్లను మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడం ద్వారా ఎన్ఆర్ఐ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. గత విద్యా సంవత్సరంలో 3450 మంది వైద్య విద్య కోర్సుల్లో చేరారని తెలిపారు. అందులో 85 శాతం (2929 సీట్లు) కర్ణాటక కోటా, 521 సీట్లను జాతీయ విద్యార్థులకు కేటాయించామని చెప్పారు. రాజస్థాన్, హరియాణ, పంజాబ్, హిమాచల ప్రదేశ్, పుదుచ్చేరి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 7-15 శాతం ఎన్ఆర్ఐకు కేటాయించారని గుర్తు చేశారు. ఈ విద్యార్థుల నుంచి తలా 75 వేల నుంచి లక్ష డాలర్ల ఫీజు ఆయా కళాశాలలకు వస్తుందని తెలిపారు. కర్ణాటకలో ఎన్ఆర్ఐ కోటాను ప్రైవేటు కళాశాలలు మాత్రమే కలిగి ఉన్నాయని చెప్పారు. ఒక్కో విద్యార్థి నుంచి ఏటా రూ.ఒక కోటి నుంచి రూ.2.5 కోట్ల ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న సీట్ల నుంచి ఎన్ఆర్ఐలకు కేటాయిస్తే, స్థానికులు, పేద విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతుందన్నారు. ప్రత్యేకంగా సీట్లను సృష్టించే అధికారం వైద్య మండలి, ప్రాధికారలకు మాత్రమే ఉందని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దడపుట్టిస్తున్న డెంగీ
[ 03-07-2024]
వానలు ప్రారంభమయ్యే జూన్, జులై నెలలు వచ్చాయంటే అంటు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. పూర్తిగా వర్షాలు పడక, అలాగని ఎండలూ లేని వాతావరణం దోమల సంతతి వృద్ధి చెందేందుకు ప్రధాన కారణం. -
శ్రీగంధం దొంగలపై కాల్పులు
[ 03-07-2024]
ముళబాగిలు తాలూకా కాశీపుర అటవీ విభాగంలో శ్రీగంధం చెట్లను నరికేందుకు వచ్చిన ఐదుగురు దుండగులపై అటవీశాఖ ఉద్యోగులు కాల్పులు జరిపారు. -
ఉద్యాననగరికి రైల్వే వలయమార్గం!
[ 03-07-2024]
నగర సంచార రద్దీ నియంత్రణకు నమ్మ మెట్రోతో పాటు ‘రింగ్ రైలు’ వ్యవస్థ తెరపైకి వచ్చింది. రూ.23 వేల కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. -
హద్దులు దాటిన అభిమానం
[ 03-07-2024]
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలతో పరప్పన అగ్రహార కారాగారం చేరిన నటుడు దర్శన్ అభిమానులు హద్దులు దాటుతున్నారు. -
వివాహవేదికపై మర్కటం చేష్టలు
[ 03-07-2024]
చెన్నరాయపట్టణ తాలూకా హిరిసావెలో మంగళవారం నిర్వహించిన ఓ వివాహ ఘట్టంలో ఒక మర్కటం హాజరైంది. పెళ్లికుమారుడి వెంట తిరిగింది. -
అర్థవంతంగా కాంతరాజు నివేదిక
[ 03-07-2024]
వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ అధ్యక్షుడు కాంతరాజు ఇచ్చిన సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధింత నివేదికను ప్రభుత్వం స్వీకరించిందని సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి స్పష్టం చేశారు. -
పాతికేళ్లకు దొరికిన దొంగ
[ 03-07-2024]
గంగావతి పట్టణంలో ఓ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు పాతికేళ్ల తరువాత బంధించారు. ముగ్గురు దొంగలు కలిసి ఈ చోరీ చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ మాళి తెలిపారు. -
రౌతు లేని బండి రాజధానిలో సందడి
[ 03-07-2024]
రాజధాని నగరంలో మెట్రో అభివృద్ధి పనుల జోరు వేగం పుంజుకుంది. చోదకుడి అవసరంలేని మెట్రో రైలు సంచార పరీక్షలను సంబంధిత విషయ నిపుణులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.