చందన చిత్రసీమకు అండగా నిలుస్తాం
కన్నడ చలన చిత్రాల నిర్మాణానికి, ఇతర ప్రాంతాల్లోనూ వాటిని ప్రదర్శించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
జ్యోతి వెలిగిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే: కన్నడ చలన చిత్రాల నిర్మాణానికి, ఇతర ప్రాంతాల్లోనూ వాటిని ప్రదర్శించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కన్నడ చలనచిత్ర నిర్మాత సంఘం నూతన భవంతిని ఆదివారం ప్రారంభించి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు నిర్మాతల సంఘానికి సొంత భవంతి లేకపోవడంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా చిత్ర నిర్మాతలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయాన్ని ఆశించలేదన్నారు. కేరళ ప్రభుత్వం తరహాలోనే కర్ణాటకలోనూ ప్రత్యేక ఓటీటీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కన్నడ చిత్రాలన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ఓటీటీ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. మైసూరులో ఫిలింసిటీని ప్రైవేటు సంస్థలు, కంపెనీల సహకారంతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే వంద ఎకరాలకు పైగా భూమిని కేటాయించిందని గుర్తు చేశారు. ‘చిత్రనగరి’ నిర్మాణం డాక్టర్ రాజ్కుమార్ కల అని తెలిపారు. నటుడు శివరాజ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు జగ్గేశ్, సీనియరు నిర్మాత సా.రా.గోవిందు, మంత్రి భైరతి సురేశ్ పాల్గొన్నారు.
స్మరణిక అందజేస్తున్న సినీ ప్రముఖులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దడపుట్టిస్తున్న డెంగీ
[ 03-07-2024]
వానలు ప్రారంభమయ్యే జూన్, జులై నెలలు వచ్చాయంటే అంటు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. పూర్తిగా వర్షాలు పడక, అలాగని ఎండలూ లేని వాతావరణం దోమల సంతతి వృద్ధి చెందేందుకు ప్రధాన కారణం. -
శ్రీగంధం దొంగలపై కాల్పులు
[ 03-07-2024]
ముళబాగిలు తాలూకా కాశీపుర అటవీ విభాగంలో శ్రీగంధం చెట్లను నరికేందుకు వచ్చిన ఐదుగురు దుండగులపై అటవీశాఖ ఉద్యోగులు కాల్పులు జరిపారు. -
ఉద్యాననగరికి రైల్వే వలయమార్గం!
[ 03-07-2024]
నగర సంచార రద్దీ నియంత్రణకు నమ్మ మెట్రోతో పాటు ‘రింగ్ రైలు’ వ్యవస్థ తెరపైకి వచ్చింది. రూ.23 వేల కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. -
హద్దులు దాటిన అభిమానం
[ 03-07-2024]
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలతో పరప్పన అగ్రహార కారాగారం చేరిన నటుడు దర్శన్ అభిమానులు హద్దులు దాటుతున్నారు. -
వివాహవేదికపై మర్కటం చేష్టలు
[ 03-07-2024]
చెన్నరాయపట్టణ తాలూకా హిరిసావెలో మంగళవారం నిర్వహించిన ఓ వివాహ ఘట్టంలో ఒక మర్కటం హాజరైంది. పెళ్లికుమారుడి వెంట తిరిగింది. -
అర్థవంతంగా కాంతరాజు నివేదిక
[ 03-07-2024]
వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ అధ్యక్షుడు కాంతరాజు ఇచ్చిన సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధింత నివేదికను ప్రభుత్వం స్వీకరించిందని సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి స్పష్టం చేశారు. -
పాతికేళ్లకు దొరికిన దొంగ
[ 03-07-2024]
గంగావతి పట్టణంలో ఓ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు పాతికేళ్ల తరువాత బంధించారు. ముగ్గురు దొంగలు కలిసి ఈ చోరీ చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ మాళి తెలిపారు. -
రౌతు లేని బండి రాజధానిలో సందడి
[ 03-07-2024]
రాజధాని నగరంలో మెట్రో అభివృద్ధి పనుల జోరు వేగం పుంజుకుంది. చోదకుడి అవసరంలేని మెట్రో రైలు సంచార పరీక్షలను సంబంధిత విషయ నిపుణులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్