చెన్నపట్టణ నుంచి అనసూయ పోటీ చేస్తారా?
చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరంటూ స్థానికుల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. తాను అక్కడి నుంచి పోటీ చేయనని మాజీ ఎంపీ డీకే సురేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు.
రామనగర, న్యూస్టుడే: చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరంటూ స్థానికుల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. తాను అక్కడి నుంచి పోటీ చేయనని మాజీ ఎంపీ డీకే సురేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కుమార్తె పోటీ చేస్తుందని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని సురేశ్ ఖండించారు. దళ్ నుంచి నిఖిల్ గౌడ, భాజపా నుంచి మాజీ మంత్రి యోగీశ్వర్ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. దళ్-భాజపా పొత్తు అభ్యర్థిగా దేవేగౌడ కుమార్తె అనసూయను బరిలో దించాలని దళపతులు యోచిస్తున్నారు. బెంగళూరు గ్రామీణ లోక్సభ నుంచి భాజపా టికెట్పై ఆమె భర్త డాక్టర్ మంజునాథ్ ఇప్పటికే గెలుపొందారు. అభ్యర్థి ఎంపికపై ఇదే వారంలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
‘నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా’
మండ్య, న్యూస్టుడే: రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేదలకు ఇళ్లు కేటాయించలేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. సిద్ధరామయ్య 2017లో స్లంబోర్డు తరఫున లక్ష ఇళ్లు, రాజీవ్ గాంధీ పథకం కింద 53 వేల ఇళ్లను పేదలకు కేటాయించారని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా ఒక్క ఇంటినీ కొత్తగా కేటాయించలేదన్నారు. అంతకు మునుపు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల నిర్మాణాలనే పూర్తి చేసి, కొందరు లబ్ధిదారులకు ఇచ్చిందని గుర్తు చేశారు. భాజపా అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా ఇళ్లను కేటాయించిందని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దడపుట్టిస్తున్న డెంగీ
[ 03-07-2024]
వానలు ప్రారంభమయ్యే జూన్, జులై నెలలు వచ్చాయంటే అంటు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. పూర్తిగా వర్షాలు పడక, అలాగని ఎండలూ లేని వాతావరణం దోమల సంతతి వృద్ధి చెందేందుకు ప్రధాన కారణం. -
శ్రీగంధం దొంగలపై కాల్పులు
[ 03-07-2024]
ముళబాగిలు తాలూకా కాశీపుర అటవీ విభాగంలో శ్రీగంధం చెట్లను నరికేందుకు వచ్చిన ఐదుగురు దుండగులపై అటవీశాఖ ఉద్యోగులు కాల్పులు జరిపారు. -
ఉద్యాననగరికి రైల్వే వలయమార్గం!
[ 03-07-2024]
నగర సంచార రద్దీ నియంత్రణకు నమ్మ మెట్రోతో పాటు ‘రింగ్ రైలు’ వ్యవస్థ తెరపైకి వచ్చింది. రూ.23 వేల కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. -
హద్దులు దాటిన అభిమానం
[ 03-07-2024]
తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలతో పరప్పన అగ్రహార కారాగారం చేరిన నటుడు దర్శన్ అభిమానులు హద్దులు దాటుతున్నారు. -
వివాహవేదికపై మర్కటం చేష్టలు
[ 03-07-2024]
చెన్నరాయపట్టణ తాలూకా హిరిసావెలో మంగళవారం నిర్వహించిన ఓ వివాహ ఘట్టంలో ఒక మర్కటం హాజరైంది. పెళ్లికుమారుడి వెంట తిరిగింది. -
అర్థవంతంగా కాంతరాజు నివేదిక
[ 03-07-2024]
వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ అధ్యక్షుడు కాంతరాజు ఇచ్చిన సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధింత నివేదికను ప్రభుత్వం స్వీకరించిందని సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి స్పష్టం చేశారు. -
పాతికేళ్లకు దొరికిన దొంగ
[ 03-07-2024]
గంగావతి పట్టణంలో ఓ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు పాతికేళ్ల తరువాత బంధించారు. ముగ్గురు దొంగలు కలిసి ఈ చోరీ చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ మాళి తెలిపారు. -
రౌతు లేని బండి రాజధానిలో సందడి
[ 03-07-2024]
రాజధాని నగరంలో మెట్రో అభివృద్ధి పనుల జోరు వేగం పుంజుకుంది. చోదకుడి అవసరంలేని మెట్రో రైలు సంచార పరీక్షలను సంబంధిత విషయ నిపుణులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
-
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య