logo

ఉక్కు పరిశ్రమ తనిఖీ

భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఇనుము, ఉక్కు పరిశ్రమను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం పరిశీలించారు.

Published : 01 Jul 2024 02:12 IST

యంత్రం పనితీరును తెలుసుకుంటున్న కుమారస్వామి, రాఘవేంద్ర

శివమొగ్గ, న్యూస్‌టుడే: భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఇనుము, ఉక్కు పరిశ్రమను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం పరిశీలించారు. కేంద్ర ఉక్కు శాఖ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమల పనితీరు, ముడి ఖనిజం సరఫరా తదితర వివరాలతో పాటు కార్మికుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. భారతీయ ఉక్కు ప్రాధికార అధ్యక్షుడు అమరేందు ప్రకాశ్, లోక్‌సభ సభ్యుడు బీవై రాఘవేంద్ర, ఎమ్మెల్యేలు బీకే సంగమేశ్, శారదా పూర్య నాయక్‌ తదితరులతో కలిసి పరిశ్రమలోని వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. పరిశ్రమ తాజా పరిస్థితిపై అక్కడి అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని