ఎడతెగని కుండపోత
తీరప్రాంత జిల్లాలు, మల్నాడుతో పాటు కొడగు, హాసన జిల్లాల్లో శుక్రవారం వానదేవుడు విశ్వరూపం చూపాడు. మరో వారం పాటు ఈ జిల్లాలకు వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బెంగళూరు : గాలికి గొడుగు ఎగిరిపోకుండా పట్టుకుని వస్తున్న వ్యక్తి
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : తీరప్రాంత జిల్లాలు, మల్నాడుతో పాటు కొడగు, హాసన జిల్లాల్లో శుక్రవారం వానదేవుడు విశ్వరూపం చూపాడు. మరో వారం పాటు ఈ జిల్లాలకు వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల వంతెనల పైనుంచి నదీ ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కర్ణాటక జిల్లాల్లోని పాఠశాలలకు శనివారం నాడూ సెలవు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వివిధ జిల్లాల అధికారులు హెచ్చరించారు. చార్మాడిఘాట్, ఉత్తర కన్నడ జిల్లాల్లో పలు చోట్ల కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం నీరు జలపాతంలా కిందకు దుముకడాన్ని ప్రయాణికులు ఆస్వాదించారు. కొడగు జిల్లాలోని పలు ఆలయాల్లోకి నీరు చేరింది. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రయాణికులు, నివాసులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న జలాశయాల్లోకి ఇన్ఫ్లో భారీగా పెరిగింది. దక్షిణ కన్నడ జిల్లాకు సరిహద్దున ఉన్న కేరళలోని కాసరగోడులో వానల జోరు ప్రజలను హడలెత్తిస్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు మందగతిన సాగుతున్నాయి.
వృద్ధురాలి మృతి..
కార్వార: జోరువానల నేపథ్యంలో కార్వార సమీపంలోని ఆరవ గ్రామంలో ఇంటి గోడ కూలి రుక్మా గులాబి (79) అనే వృద్ధురాలు మరణించింది. గురువారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి ఇంటి పునాదుల్లోకి నీరు చేరుకుంది. మట్టిగోడతో పాటు పైకప్పు కూడా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాన్ని శుక్రవారం ఉదయం వెలికి తీశారు. కార్వార గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భాగమండల సమీపంలోని ఓ ఆలయంలోకి ప్రవేశించిన నీరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తిన చేరిన పంచాయితీ
[ 01-07-2024]
ముఖ్యమంత్రి మార్పు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్లో నేతల మధ్య వాగ్యుద్ధం తీవ్రమైంది. -
ఐదు నెలల నుంచి వేధింపులు
[ 01-07-2024]
నటి పవిత్రాగౌడకు రేణుకాస్వామి గత ఐదు నెలల నుంచి నిత్యం అశ్లీల సందేశాలు, చిత్రాలు, వీడియోలు పంపించాడని సిట్ అధికారులు గుర్తించారు. -
పరిశోధన కోసం పరుగు
[ 01-07-2024]
వైద్య రంగంలో క్లినికల్ పరిశోధనలు మరింత ఎక్కువగా సాగాలని, పరిశోధనలను ప్రోత్సహించే విధంగా ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ పరిశోధన సంస్థ సహకారంతో ఆదివారం ఇక్కడ హెచ్ఎస్ఆర్ లేఔట్లోని అటల్ బిహారీ వాజ్పేయీ మైదానంలో రన్ ఫర్ పరిశోధన మారథాన్ చేపట్టారు. -
కేంద్రానికి లేఖ రాశాం
[ 01-07-2024]
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి డాక్టర్ శరణు ప్రకాశ్ పాటిల్ వెల్లడించారు. -
సీఎన్ఆర్ రావుకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
[ 01-07-2024]
భారతరత్న డాక్టర్ సీఎన్ఆర్ రావు పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు శుభాకాంక్షల లేఖ పంపించారు. -
చందన చిత్రసీమకు అండగా నిలుస్తాం
[ 01-07-2024]
కన్నడ చలన చిత్రాల నిర్మాణానికి, ఇతర ప్రాంతాల్లోనూ వాటిని ప్రదర్శించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. -
చెన్నపట్టణ నుంచి అనసూయ పోటీ చేస్తారా?
[ 01-07-2024]
చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరంటూ స్థానికుల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. తాను అక్కడి నుంచి పోటీ చేయనని మాజీ ఎంపీ డీకే సురేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
త్వరితగతిన రైల్వేస్టేషన్ల ఉన్నతీకరణ
[ 01-07-2024]
యశ్వంతపుర, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి అవుతాయని కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ తెలిపారు. -
ఉక్కు పరిశ్రమ తనిఖీ
[ 01-07-2024]
భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఇనుము, ఉక్కు పరిశ్రమను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఆదివారం పరిశీలించారు.