అడ్డగోలుగా నిధుల మళ్లింపు
వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేసే వరకు భాజపా ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ హెచ్చరించారు.
సర్కారుపై అశోక్ మండిపాటు
ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న అశోక్
కోలారు, న్యూస్టుడే : వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేసే వరకు భాజపా ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ హెచ్చరించారు. ఇంధనం, పాల ధరల పెంపు, ఆగిపోయిన అభివృద్ధి పనులు, వాల్మీకి అభివృద్ధి మండలిలో కుంభకోణం.. తదితరాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. దళ్ నేతలతో కలిసి కోలారులో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. జిల్లాధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వినతి పత్రాన్ని జిల్లాధికారికి అందించాక అశోక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి తన పదవిని డీకే శివకుమార్కు అప్పగించాలని బహిరంగ వేదికపైనే చంద్రశేఖరానందనాథ స్వామి చేసిన సూచనలను సిద్ధరామయ్య పరిగణనలోకి తీసుకుని తన మర్యాదను కాపాడుకోవాలని హితవు పలికారు. మండలికి చెందిన నగదులో 20 శాతం అప్పటి మంత్రి నాగేంద్రకు, 80 శాతం సిద్ధరామయ్యకు వెళ్లిందని ఆరోపించారు. అప్పుల బాధ, కరవుతో ఆత్మహత్యలాకు పాల్పడిన అన్నదాతలకు ఇప్పటి వరకు పరిహారాన్ని ఇవ్వలేదని విమర్శించారు. డెంగీ చికిత్సలకు ఖజానాలో నగదు లేదని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తిన చేరిన పంచాయితి
[ 01-07-2024]
ముఖ్యమంత్రి మార్పు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్లో నేతల మధ్య వాగ్యుద్ధం తీవ్రమైంది. -
పరిశోధన కోసం పరుగు
[ 01-07-2024]
వైద్య రంగంలో క్లినికల్ పరిశోధనలు మరింత ఎక్కువగా సాగాలని, పరిశోధనలను ప్రోత్సహించే విధంగా ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ పరిశోధన సంస్థ సహకారంతో ఆదివారం ఇక్కడ హెచ్ఎస్ఆర్ లేఔట్లోని అటల్ బిహారీ వాజ్పేయీ మైదానంలో రన్ ఫర్ పరిశోధన మారథాన్ చేపట్టారు. -
కేంద్రానికి లేఖ రాశాం
[ 01-07-2024]
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి డాక్టర్ శరణు ప్రకాశ్ పాటిల్ వెల్లడించారు. -
సీఎన్ఆర్ రావుకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
[ 01-07-2024]
భారతరత్న డాక్టర్ సీఎన్ఆర్ రావు పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు శుభాకాంక్షల లేఖ పంపించారు. -
చందన చిత్రసీమకు అండగా నిలుస్తాం
[ 01-07-2024]
కన్నడ చలన చిత్రాల నిర్మాణానికి, ఇతర ప్రాంతాల్లోనూ వాటిని ప్రదర్శించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. -
చెన్నపట్టణ నుంచి అనసూయ పోటీ చేస్తారా?
[ 01-07-2024]
చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరంటూ స్థానికుల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. తాను అక్కడి నుంచి పోటీ చేయనని మాజీ ఎంపీ డీకే సురేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
త్వరితగతిన రైల్వేస్టేషన్ల ఉన్నతీకరణ
[ 01-07-2024]
యశ్వంతపుర, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి అవుతాయని కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ తెలిపారు. -
ఉక్కు పరిశ్రమ తనిఖీ
[ 01-07-2024]
భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఇనుము, ఉక్కు పరిశ్రమను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఆదివారం పరిశీలించారు.