దర్శన్ విచారణ కొలిక్కి
చిత్రదుర్గ నివాసి రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మందిని అరెస్టు చేశామని పోలీస్ అధికారులు ప్రకటించారు.
అభియోగపత్రం దాఖలే తరువాయి
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : చిత్రదుర్గ నివాసి రేణుకా స్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్ర గౌడతో పాటు మొత్తం 17 మందిని అరెస్టు చేశామని పోలీస్ అధికారులు ప్రకటించారు. వీరిపై త్వరలో అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పోలీసులు చర్యలు చేపట్టారు. హత్యకు సంబంధించి ఆధారాలు ఉండడం, నిందితులూ ఆ నేరాన్ని అంగీకరించడంతో అభియోగపత్రాన్ని తయారు చేసేందుకు న్యాయ కోవిదుల సలహా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రేణుకాస్వామి సెల్ఫోన్ పోలీసులకు లభించలేదు. ఇతర నిందితుల సెల్ఫోన్ల నుంచి డేటా రాబట్టేందుకు ఫోరెన్సిక్ ప్రయోగశాల నిపుణులు శ్రమిస్తున్నారు. త్వరలో జన్యు పరీక్షల నివేదిక తమకు లభిస్తుందని పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి 62 సీసీ కెమెరాల ఫుటేజ్ను సేకరించగా, అందులో హత్య అనంతరం పట్టణగెరె షెడ్డు నుంచి సుమనహళ్లి రాజకాలువ వరకు ఉన్న 36 సీసీ కెమెరాల ఫుటేజ్ పోలీసుల వద్ద ఉంది. అభియోగపత్రాన్ని దాఖలు చేయడంలో ఆలస్యం జరిగితే, నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తారని పోలీసులు భావిస్తున్నారు.
దర్శన్ను కించపరుస్తూ, ఆయన అభిమానులను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిని బెదిరిస్తున్న చేతన్ (36) అనే వ్యక్తిని బసవేశ్వరనగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. నిర్మాత ఉమాపతికి ప్రాణహాని తలపెడతానని అతను బెదిరించాడని ఫిర్యాదుల వచ్చాయి. దర్శన్ తీరును తూర్పారబడుతూ పోస్టులు పెట్టే వారందరికీ అతను వ్యాఖ్యల ద్వారా హెచ్చరికలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం కమలానగరకు చెందిన నిందితుడిని స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు.
టైటిల్కు నిరాకరణ: దర్శన్ను ఆయన అభిమానులు ‘డి’ బాస్ అని అభిమానంతో పిల్చుకుంటారు. దర్శన్ కారాగారానికి వెళ్లిన అనంతరం ‘డి గ్యాంగ్’ పేరిట సినిమా తీసేందుకు కొందరు యువ నిర్మాతలు ముందుకు వచ్చారు. ‘డి గ్యాంగ్’ శీర్షికను తన సినిమాకు పెట్టుకునేందుకు ఇవ్వాలని పీఎం ఫిలింస్ నిర్మాణ సంస్థకు చెందిన మంజు ఎన్.నాయక్ కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ టైటిల్ ఇవ్వడం సాధ్యం కాదని మండలి అధ్యక్షుడు ఎన్ఎం సురేశ్ స్పష్టం చేశారు. ఇంతకు మునుపూ ఈ టైటిల్ కోసం కొందరు మండలిని సంప్రదించారని, వారికీ అందుకు అవకాశం ఇవ్వలేదని ఆయన చెప్పారు.
అవకాశం నాస్తి: దర్శన్ను చూసేందుకు కారాగారం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. ములాఖత్లో ఆయనను భేటీ అవుతామని వస్తున్న వారిని కారాగార సిబ్బంది వెనక్కు తిప్పిపంపిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి వస్తున్న అభిమానులను వెనక్కు తిరిగి వెళ్లాలని సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు అక్కడే వేచి చూస్తూ, తమకు అవకాశం లభిస్తుందని ఆశగా వేచి చూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
[ 01-07-2024]
ముఖ్యమంత్రి మార్పు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి కర్ణాటక కాంగ్రెస్లో నేతల మధ్య వాగ్యుద్ధం తీవ్రమైంది. -
ఐదు నెలల నుంచి వేధింపులు
[ 01-07-2024]
నటి పవిత్రాగౌడకు రేణుకాస్వామి గత ఐదు నెలల నుంచి నిత్యం అశ్లీల సందేశాలు, చిత్రాలు, వీడియోలు పంపించాడని సిట్ అధికారులు గుర్తించారు. -
పరిశోధన కోసం పరుగు
[ 01-07-2024]
వైద్య రంగంలో క్లినికల్ పరిశోధనలు మరింత ఎక్కువగా సాగాలని, పరిశోధనలను ప్రోత్సహించే విధంగా ఇండియన్ సొసైటీ ఫర్ క్లినికల్ పరిశోధన సంస్థ సహకారంతో ఆదివారం ఇక్కడ హెచ్ఎస్ఆర్ లేఔట్లోని అటల్ బిహారీ వాజ్పేయీ మైదానంలో రన్ ఫర్ పరిశోధన మారథాన్ చేపట్టారు. -
కేంద్రానికి లేఖ రాశాం
[ 01-07-2024]
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటాను కేటాయించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మంత్రి డాక్టర్ శరణు ప్రకాశ్ పాటిల్ వెల్లడించారు. -
సీఎన్ఆర్ రావుకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
[ 01-07-2024]
భారతరత్న డాక్టర్ సీఎన్ఆర్ రావు పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు శుభాకాంక్షల లేఖ పంపించారు. -
చందన చిత్రసీమకు అండగా నిలుస్తాం
[ 01-07-2024]
కన్నడ చలన చిత్రాల నిర్మాణానికి, ఇతర ప్రాంతాల్లోనూ వాటిని ప్రదర్శించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. -
చెన్నపట్టణ నుంచి అనసూయ పోటీ చేస్తారా?
[ 01-07-2024]
చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరంటూ స్థానికుల మధ్య చర్చలు ఊపందుకున్నాయి. తాను అక్కడి నుంచి పోటీ చేయనని మాజీ ఎంపీ డీకే సురేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు. -
త్వరితగతిన రైల్వేస్టేషన్ల ఉన్నతీకరణ
[ 01-07-2024]
యశ్వంతపుర, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి అవుతాయని కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణ తెలిపారు. -
ఉక్కు పరిశ్రమ తనిఖీ
[ 01-07-2024]
భద్రావతిలోని విశ్వేశ్వరయ్య ఇనుము, ఉక్కు పరిశ్రమను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఆదివారం పరిశీలించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రొద్దుటూరులో పింఛను డబ్బు మాయం.. ఘటనపై పోలీసుల అనుమానం!
-
విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మహిళా టీచర్..!
-
భీకర హరికేన్.. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమ్ఇండియా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
‘90% కాపీ పేస్ట్.. ఎంపీలను సస్పెండ్ చేసి తీసుకొచ్చారు’: కొత్త న్యాయ చట్టాలపై ప్రతిపక్షాలు
-
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్..!