Telangana News: పల్లె నుంచి జడ్పీ దాకా ప్రత్యేకాధికారుల పాలన
గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు.. ఇలా స్థానిక సంస్థల్లో కీలకమైన పరిపాలన పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి.
ఈనాడు, కరీంనగర్: గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు.. ఇలా స్థానిక సంస్థల్లో కీలకమైన పరిపాలన పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి. 4వ తేదీ జిల్లా, మండల పరిషత్తుల పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో మండలాల్లో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ ప్రారంభమవనుంది.. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో మరుసటి రోజు నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులుగా తహసీల్దార్లు, ఎంపీడీవోలు సహా ఇతర గెజిటెడ్ హోదా కలిగిన వారిని నియమించారు. తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల గడువు ముగియడంతో జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులకు మండల పరిషత్తు అధ్యక్షుడి స్థానంలో ప్రత్యేకాధికారి బాధ్యతలు అప్పగించారు.
నిధుల లేమితో ఆటంకమే..
ఒకప్పుడు జడ్పీలో నిధుల గలగలలు దండిగా ఉండేవి. 2017లో జిల్లాల విభజన జరగ్గా 2019 నుంచి కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పడ్డాయి. అప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగానే వ్యవస్థ కొనసాగింది. 2014కు ముందు భారీగా నిధులు రాగా.. 2014-15 తరువాత నిధులు, విధుల పరంగా అవరోధాలు ఎదురవుతూ వచ్చాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.27 కోట్లు, బీఆర్జీఎఫ్ ద్వారా రూ.23 కోట్లు ఇతర మార్గాల ద్వారా రూ.10 కోట్లు సమకూరాయి. రూ.60 కోట్లతో జడ్పీ ఖజానా ఉమ్మడి జిల్లాలో కళకళలాడింది. ఇక 2015-16 ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అందించే బీఆర్జీఎఫ్ నిధులు, ఆర్థిక సంఘం నిధులు రద్దయ్యాయి. దీంతో ఒక్క ఏడాది వ్యవధిలోనే 80 శాతం నిధులకు కోత పడింది. ఇక అప్పటి నుంచి కేవలం జిల్లాల్లోని ఇసుక క్వారీలు, రిజిస్ట్రేషన్, అద్దెలు, సీనరేజీ, తలసరి ఆదాయం వంటి నిధులు రూ.10 కోట్ల వరకే అందాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లా పరిషత్తులు వేర్వేరుగా పరిపాలన పరంగా మంచి మార్పును చూపించినప్పటికీ నిధులు, విధుల పరంగా సభ్యులు చాలా అవస్థలు ఎదుర్కొన్నారు. నిరసనలు, ఆందోళనలతో సర్వసభ్య సమావేశాల్లో వారి గోడు వెలిబుచ్చుకున్నారు. గడిచిన అయిదేళ్లలో ప్రతి జిల్లాకు కనీసం రూ.15 నుంచి 20 కోట్లు అందని పరిస్థితి నెలకొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక విడత, 2024-25కి సంబంధించి రెండు విడతల నిధులు నాలుగు జిల్లాలకు రాలేదు. ఇక సీనరేజీ ద్వారా రావాల్సిన మొత్తాన్ని కూడా ప్రభుత్వమే తీసుకోవడంతో గ్రామాలకు 25 శాతం, మండలాలకు 50 శాతం, జడ్పీకి 25శాతం వాటా నిధులు రాకుండా పోయాయి.
పెండింగ్ పనులు : జడ్పీ ప్రత్యేక గ్రాంట్, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్, సాధారణ నిధులతో పలు గ్రామాల్లో చేపట్టాల్సిన సీసీ రోడ్లు, అంగన్వాడీల్లో మౌలిక వసతులు, బడుల్లో చిన్నపాటి నిర్మాణాలు, మురుగు కాల్వల నిర్మాణపు పనులు చాలాచోట్ల ఇంకా కొనసాగాల్సి ఉంది. వీటిపై మండలాల ప్రత్యేకాధికారితోపాటు ఎంపీడీవోలు సంయుక్తంగా దృష్టి పెట్టి వాటిని త్వరితగతిన పూర్తిచేయించాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 120 వరకు ఇలాంటి పనులున్నట్లు అంచనా.!
సమావేశాలు మమ : కరోనా విపత్తు సహా ఇతర సమయాల్లో అనుకున్న విధంగా సర్వసభ్య సమావేశాలు జరగలేదు. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోమారు సమగ్రంగా చర్చ జరిగి గ్రామాల్లో ఉన్న సమస్యల్ని తీర్చే వాతావరణం ఉండాలి. ఈ లెక్కన అయి దేళ్లల్లో 20 జరగాలి. కానీ వాయిదాలు పడినవే ఎక్కువున్నాయి. 42 అంశాలపై సభ్యులు, అధికారుల మధ్య లోతైన చర్చ జరగాలి. కానీ ఎక్కడా ఏడెనిమిది అంశాలకు మించి చర్చను కొనసాగించలేదు.
‘ప్రత్యేక’ హాజరు తక్కువే : జడ్పీ సమావేశాలకు చట్టసభల్లోని ప్రజాప్రతినిధులు ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రత్యేకాహ్వానితులుగా, సభ్యులుగా రావాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో వీరు గైర్హాజరవడంతో ప్రాధాన్య అంశాలు చర్చకు రాలేదు.
వేతనాలకు ఎదురుచూపులు : గౌరవ వేతనాల కోసం సభ్యులు గడిచిన ఆరు నెలలుగా నిరీక్షిస్తున్నారు. నెలకు జడ్పీ ఛైర్పర్సన్కు రూ.లక్ష, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13 వేలు, ఎంపీటీసీలకు రూ.6500 ఇవ్వాలి. ఇలా నాలుగు జిల్లాల్లో నెలకు రూ.57.75 లక్షల చొప్పున ఆర్నెల్లకు సంబంధించి రూ.3.46 కోట్లు చెల్లించాల్సి ఉంది.
సేవతో పదవికి న్యాయం చేశా
కరీంనగర్ జడ్పీ ఛైర్పర్సన్గా నా పదవి కాలంలో ప్రజలకు సేవ చేస్తూ వారికి న్యాయం చేశాననే భావన ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ చూపించా. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో కరీంనగర్ జడ్పీకి ప్రత్యేక గుర్తింపు రావడం మరిచిపోలేని అనుభూతి. అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. సమష్టి కృషితో ప్రాధాన్య క్రమంగా అన్ని రకాల నిధులను ఆయా పనులకు వినియోగించగలిగాం. ఇంకా ఎక్కువ నిధులు వస్తే బాగుండనే ఆశ ఇంకా అలాగే మిగిలిపోయింది. జడ్పీటీసీ సభ్యులు, అధికారులందరి సహకారం మరిచిపోలేను.
- కనుమల్ల విజయ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదివారం వైద్యసేవలకు సుస్తీ
[ 08-07-2024]
అసలే వానాకాలం. ఈ సమయంలో దోమలు, ఈగలు వృద్ధి చెంది.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే పలువురు వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడ కుక్కలు, పాములు, కోతులు కరుస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. -
ప్రహసనంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ
[ 08-07-2024]
పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చెత్త విభజన నిల్వ కేంద్రాలు (సెగ్రిగేషన్ షెడ్లు) ఏర్పాటు చేసింది. ఇంటింటి నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వాటిని క్రమ పద్ధతిగా ఏరివేసి ఈ కేంద్రాలకు పంపించాలి. -
నీటి శుద్ధికి సాంకేతిక సమస్యలు
[ 08-07-2024]
నగర అవసరాలకు అనుకూలంగా తాగునీరు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జలాన్ని శుద్ధి చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తుండగా.. మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తున్నారు. -
పర్యవేక్షణ కొరవడి.. బోధన కుంటుపడి
[ 08-07-2024]
ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. మండల స్థాయిల్లో పర్యవేక్షించే విద్యాధికారుల రెగ్యులర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉండటం ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. -
సాంకేతిక విద్య.. వసతులు మిథ్య
[ 08-07-2024]
జేఎన్టీయూ ఇంజీనిరింగ్ కళాశాల.. దేశ, విదేశాల్లో ఎంతో మంది సాంకేతిక పట్టభద్రులు జీవితంలో స్థిరపడేలా చేసిన ఉన్నత విద్యాసంస్థ.. ఏటా ఇక్కడ చదివి ఉత్తీర్ణులైన వేలాది మంది టెకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి రుచుల విపత్తు
[ 08-07-2024]
ఆకట్టుకునే రంగులు.. పైపై హంగులతో కూడిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ కొందరు ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం సరకుల వాడకం, రసాయనాలు, రంగులు కలుపుతుండటంతో వ్యాధులు వెంటాడుతున్నాయి. మార్కెట్లో పెచ్చుమీరుతున్న కల్తీ ప్రాణాలను హరిస్తోంది. -
మానీరుపైనే ఆశలు నిండితేనే పంటల సాగు
[ 08-07-2024]
మానేరు జలాశయంలో నీరు లేక అన్నదాతలు పంటల సాగుకు వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నారు. కొందరు నారు మడులు వేసినా నీరు లేక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు ముదిరిపోతుంది. -
కలగా సాంకేతిక విద్య
[ 08-07-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లు సక్రమంగానే సాగినప్పటికీ తరవాత మూలకు చేరింది. బోధకులు లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
ఇప్పటికైనా మార్పు వచ్చేనా!
[ 08-07-2024]
రామగుండం కార్పొరేషన్పై జిల్లా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో నగరపాలిక నిర్వహణ మెరుగు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
[ 08-07-2024]
ఒకవైపు నాలుగు వరుసల రహదారి, మరోవైపు ఆర్వోబీకి వెళ్లే ఎత్తైన రహదారి రెండింటిని ఇరుకైన కూడలి కలిపేయడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు కూడలి విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. -
భవిష్యత్తు ప్రణాళికలు.. ప్రత్యామ్నాయ పనులు
[ 08-07-2024]
మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ప్రత్యామ్నాయ ఫీడర్ల అనుసంధానం, విద్యుత్తు ఉపకేంద్రాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నారు. -
వసతి గృహాలను పట్టించుకోరా?
[ 08-07-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెండో మ్యాచ్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?
-
బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం
-
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
-
బతికుండగానే కన్నకూతురిని సమాధి చేసిన తండ్రి
-
అలా చేయగల ఏకైక నటుడు కమల్హాసన్: బ్రహ్మానందం
-
6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు