కందులు అ‘ధర’హో
చొప్పదండి జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది కందులకు మంచి ధర పలుకుతోంది. పంట సీజన్ ముగిసినా ధర మాత్రం తగ్గడంలేదు.
ఎంఎస్పీ కంటే అధికం
చొప్పదండిలో కందులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
న్యూస్టుడే, చొప్పదండి: చొప్పదండి జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది కందులకు మంచి ధర పలుకుతోంది. పంట సీజన్ ముగిసినా ధర మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకు పెరుగుతోంది. పంట చేతికి వచ్చిన సమయంలో క్వింటాకు రూ.9 వేల వరకు ఉండగా, పెరుగుతూ వస్తోంది. ఈ సీజన్లో మార్కెట్లో అత్యధికంగా రూ.11,350 ధర పలికింది.
చొప్పదండి మార్కెట్కు ఈ సీజన్లో సుమారు 700 క్వింటాళ్లకు పైగా కంద]ులు విక్రయానికి వచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని ధర్మారం, వెల్గటూర్, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, జూలపల్లి, గంగాధర, రామడుగు తదితర మండలాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి కందులు అమ్ముకుంటున్నారు. దుకాణాల్లో కంది పప్పు ధర రూ.200 వరకు ఉండటంతో స్థానికులు సైతం కందులు కొనుగోలు చేసి పప్పుగా మార్చుకుంటున్నారు. ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో పంట సాగు కాకపోవడంతోపాటు తక్కువగా దిగుబడి రావడంతో కందులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. వ్యాపారులు పోటీపడి మరి కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా మార్కెట్లో ధర రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు దాచి అమ్ముతున్న వారికి మంచి లాభం వస్తోంది.
రైతుల సంతోషం
కందులకు ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.5800 కాగా, ఇటీవల దానిని రూ.6300కు పెంచింది. అయినా మార్కెట్లో మాత్రం ప్రభుత్వ మద్దతు ధర కంటే రెట్టింపు డబ్బులు ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట సీజన్ ప్రారంభంలో మొదటగా అమ్ముకున్న వారికి క్వింటాల్కు రూ.9 వేలు రాగా ప్రస్తుతం రూ.11 వేలకు చేరుకుంది. నిల్వ చేసి అమ్మడం ద్వారా పెట్టుబడులు పోను లాభాలు పొందుతున్నామని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
గరిష్ఠ ధర పొందండి
గతేడాది కంటే ఈ ఏడాది కందులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. రైతులు నాణ్యమైన కందులను తీసుకొచ్చి గరిష్ఠ మద్దతు ధర పొందాలి.
- మల్లేశం, మార్కెట్ కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదివారం వైద్యసేవలకు సుస్తీ
[ 08-07-2024]
అసలే వానాకాలం. ఈ సమయంలో దోమలు, ఈగలు వృద్ధి చెంది.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే పలువురు వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడ కుక్కలు, పాములు, కోతులు కరుస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. -
ప్రహసనంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ
[ 08-07-2024]
పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చెత్త విభజన నిల్వ కేంద్రాలు (సెగ్రిగేషన్ షెడ్లు) ఏర్పాటు చేసింది. ఇంటింటి నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వాటిని క్రమ పద్ధతిగా ఏరివేసి ఈ కేంద్రాలకు పంపించాలి. -
నీటి శుద్ధికి సాంకేతిక సమస్యలు
[ 08-07-2024]
నగర అవసరాలకు అనుకూలంగా తాగునీరు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జలాన్ని శుద్ధి చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తుండగా.. మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తున్నారు. -
పర్యవేక్షణ కొరవడి.. బోధన కుంటుపడి
[ 08-07-2024]
ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. మండల స్థాయిల్లో పర్యవేక్షించే విద్యాధికారుల రెగ్యులర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉండటం ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. -
సాంకేతిక విద్య.. వసతులు మిథ్య
[ 08-07-2024]
జేఎన్టీయూ ఇంజీనిరింగ్ కళాశాల.. దేశ, విదేశాల్లో ఎంతో మంది సాంకేతిక పట్టభద్రులు జీవితంలో స్థిరపడేలా చేసిన ఉన్నత విద్యాసంస్థ.. ఏటా ఇక్కడ చదివి ఉత్తీర్ణులైన వేలాది మంది టెకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి రుచుల విపత్తు
[ 08-07-2024]
ఆకట్టుకునే రంగులు.. పైపై హంగులతో కూడిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ కొందరు ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం సరకుల వాడకం, రసాయనాలు, రంగులు కలుపుతుండటంతో వ్యాధులు వెంటాడుతున్నాయి. మార్కెట్లో పెచ్చుమీరుతున్న కల్తీ ప్రాణాలను హరిస్తోంది. -
మానీరుపైనే ఆశలు నిండితేనే పంటల సాగు
[ 08-07-2024]
మానేరు జలాశయంలో నీరు లేక అన్నదాతలు పంటల సాగుకు వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నారు. కొందరు నారు మడులు వేసినా నీరు లేక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు ముదిరిపోతుంది. -
కలగా సాంకేతిక విద్య
[ 08-07-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లు సక్రమంగానే సాగినప్పటికీ తరవాత మూలకు చేరింది. బోధకులు లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
ఇప్పటికైనా మార్పు వచ్చేనా!
[ 08-07-2024]
రామగుండం కార్పొరేషన్పై జిల్లా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో నగరపాలిక నిర్వహణ మెరుగు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
[ 08-07-2024]
ఒకవైపు నాలుగు వరుసల రహదారి, మరోవైపు ఆర్వోబీకి వెళ్లే ఎత్తైన రహదారి రెండింటిని ఇరుకైన కూడలి కలిపేయడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు కూడలి విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. -
భవిష్యత్తు ప్రణాళికలు.. ప్రత్యామ్నాయ పనులు
[ 08-07-2024]
మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ప్రత్యామ్నాయ ఫీడర్ల అనుసంధానం, విద్యుత్తు ఉపకేంద్రాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నారు. -
వసతి గృహాలను పట్టించుకోరా?
[ 08-07-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియాతో టీ20, వన్డే సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్గా జయసూర్య
-
మంచు విష్ణుని కలిసిన హేమ.. నిర్దోషినంటూ లేఖ
-
భారీ వర్షాల ఎఫెక్ట్.. 27 విమానాల దారి మళ్లింపు..!
-
కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం: సీఎం రేవంత్రెడ్డి
-
‘బడ్జెట్’లో సొంతిల్లు.. ప్రభుత్వ సహకారం అందేనా?
-
తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం