ఉచిత వైద్యం.. సేవే ప్రధానం
రోగమేదైనా..పేదలైనా.. మధ్యతరగతైనా డబ్బులు లేకుండానే అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యాన్ని సాయి స్వాస్థ్య వెల్నెస్ కేంద్రం నిర్వహిస్తోంది.
ప్రజలకు బాసటగా సాయి స్వాస్థ్య వెల్నెస్ కేంద్రం
వెల్నెస్ కేంద్రంలో వైద్య శిబిరానికి వచ్చిన రోగులు
న్యూస్టుడే, జగిత్యాల పట్టణం: రోగమేదైనా..పేదలైనా.. మధ్యతరగతైనా డబ్బులు లేకుండానే అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యాన్ని సాయి స్వాస్థ్య వెల్నెస్ కేంద్రం నిర్వహిస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తీన్ఖని సమీపంలో 2023 డిసెంబరులో కేంద్రం ఏర్పాటైంది. సత్యసాయి సుజల స్రవంతి ట్రస్టు, సాయి స్వాస్థ్య వెల్నెస్ ఆధ్వర్యంలో అందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఓ అద్దె భవనంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. రోగులకు వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య సలహాలతోపాటు మందులు ఉచితంగా అందజేస్తున్నారు. ఏడు నెలల్లో 1400 మంది ఈ కేంద్రంలో సేవలు పొందారు.
వారానికి మూడు రోజులు..
కేంద్రంలో వారానికి మూడు రోజులపాటు ఉచితంగా శిబిరం నిర్వహిస్తారు. ప్రతి బుధ, గురు, ఆదివారాల్లో రోగులకు సేవలందిస్తున్నారు. జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, పిడియాట్రిషన్, ఆర్థో, న్యూరో తదితర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో శిబిరంలో 60 మంది రోగులకు సేవలు అందుతున్నాయి. ఆయా విభాగాలకు చెందిన వైద్యుల్లో నిస్వార్థంగా సేవలందించాలనే వారికి సంస్థ అవకాశం కల్పిస్తోంది. పట్టణంలోని పలువురు ప్రైవేటు వైద్యులు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. వారంలో ఒకరోజు తమ సమయాన్ని శిబిరానికి కేటాయిస్తున్నారు. అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు అవసరమైనవారికి దేశంలోని సత్యసాయి ట్రస్టు అధునాతన ఆసుపత్రులకు పంపి భరోసా కల్పిస్తున్నారు.
ముగ్గురికి గుండె శస్త్రచికిత్సలు..
జగిత్యాల వెల్నెస్ కేంద్రం నుంచి ముగ్గురు చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేయించారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లెకు చెందిన వేదశ్రీ(16 నెలల) చిన్నారికి ఛత్తీస్గడ్ రాయపూర్ ఆసుపత్రిలో, మంచిర్యాల జిల్లా లక్షెటిపేటకు చెందిన ఉషిక(8) చిన్నారికి బెంగళూరు ముద్దెనహళ్లి ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. జగిత్యాల పట్టణానికి చెందిన లలిత(10 సంవత్సరాల) చిన్నారికి రాయపూర్లో శస్త్రచికిత్స చేయించారు. వీరంతా నిరుపేద కార్మికుల పిల్లలు. ఒక్కో శస్త్రచికిత్సకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. వెల్నెస్ సంస్థ సహకారంతో పూర్తి ఉచితంగా చిన్నారులకు సేవలందాయి.
వంద కేంద్రాలు లక్ష్యంగా...
సత్యసాయి సుజల స్రవంతి ట్రస్టు ఆధ్వర్యంలో ఈ తరహా వెల్నెస్ కేంద్రాలు దేశంలో 100 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని కాగజ్నగర్, జగిత్యాలలో ఒక్కో కేంద్రం స్థాపించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సేవానిరతి కలిగిన వైద్యులు, సిబ్బందినే ఈ కేంద్రాలకు వినియోగిస్తున్నారు. జగిత్యాల కేంద్రంలో ఒక సమన్వయకర్తతోపాటు మరో ముగ్గురు సిబ్బంది పనిచేస్తారు. వీరందరికీ వేతనాలు ట్రస్టు ద్వారా చెల్లిస్తున్నారు. ట్రస్టు ద్వారా మందులు కొన్ని సరఫరా చేస్తుండగా స్థానికంగా అవసరమైన మందులను లాభాపేక్ష లేని ఏజెన్సీల నుంచి సమకూర్చుకుంటున్నారు.
రోగ నిర్ధారణే ముఖ్యం
చాలామంది రోగ నిర్ధారణ పరీక్షలు లేకుండానే అనేక వ్యాధులకు గురై మరణిస్తున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ చేసి అవసరమైన వేరకు వైద్య సలహాలు, చికిత్స అందించాలనే సంకల్పంతో సత్యసాయి ట్రస్టు ఈ కేంద్రాలను నెలకొల్పుతోంది. ప్రైవేటు వైద్యం ఖరీదు కావడంతో అదే తరహా వైద్యాన్ని రోగులకు అందించాలనేది కేంద్రం ఉద్దేశం. నిరుపేదలు, మధ్యతరగతి అనే భేదం లేకుండా అందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.
- ఊటూరి శ్రీకాంత్, వెల్నెస్ ప్రాంతీయ సమన్వయ కర్త
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదివారం వైద్యసేవలకు సుస్తీ
[ 08-07-2024]
అసలే వానాకాలం. ఈ సమయంలో దోమలు, ఈగలు వృద్ధి చెంది.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే పలువురు వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడ కుక్కలు, పాములు, కోతులు కరుస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. -
ప్రహసనంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ
[ 08-07-2024]
పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చెత్త విభజన నిల్వ కేంద్రాలు (సెగ్రిగేషన్ షెడ్లు) ఏర్పాటు చేసింది. ఇంటింటి నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వాటిని క్రమ పద్ధతిగా ఏరివేసి ఈ కేంద్రాలకు పంపించాలి. -
నీటి శుద్ధికి సాంకేతిక సమస్యలు
[ 08-07-2024]
నగర అవసరాలకు అనుకూలంగా తాగునీరు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జలాన్ని శుద్ధి చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తుండగా.. మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తున్నారు. -
పర్యవేక్షణ కొరవడి.. బోధన కుంటుపడి
[ 08-07-2024]
ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. మండల స్థాయిల్లో పర్యవేక్షించే విద్యాధికారుల రెగ్యులర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉండటం ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. -
సాంకేతిక విద్య.. వసతులు మిథ్య
[ 08-07-2024]
జేఎన్టీయూ ఇంజీనిరింగ్ కళాశాల.. దేశ, విదేశాల్లో ఎంతో మంది సాంకేతిక పట్టభద్రులు జీవితంలో స్థిరపడేలా చేసిన ఉన్నత విద్యాసంస్థ.. ఏటా ఇక్కడ చదివి ఉత్తీర్ణులైన వేలాది మంది టెకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి రుచుల విపత్తు
[ 08-07-2024]
ఆకట్టుకునే రంగులు.. పైపై హంగులతో కూడిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ కొందరు ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం సరకుల వాడకం, రసాయనాలు, రంగులు కలుపుతుండటంతో వ్యాధులు వెంటాడుతున్నాయి. మార్కెట్లో పెచ్చుమీరుతున్న కల్తీ ప్రాణాలను హరిస్తోంది. -
మానీరుపైనే ఆశలు నిండితేనే పంటల సాగు
[ 08-07-2024]
మానేరు జలాశయంలో నీరు లేక అన్నదాతలు పంటల సాగుకు వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నారు. కొందరు నారు మడులు వేసినా నీరు లేక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు ముదిరిపోతుంది. -
కలగా సాంకేతిక విద్య
[ 08-07-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లు సక్రమంగానే సాగినప్పటికీ తరవాత మూలకు చేరింది. బోధకులు లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
ఇప్పటికైనా మార్పు వచ్చేనా!
[ 08-07-2024]
రామగుండం కార్పొరేషన్పై జిల్లా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో నగరపాలిక నిర్వహణ మెరుగు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
[ 08-07-2024]
ఒకవైపు నాలుగు వరుసల రహదారి, మరోవైపు ఆర్వోబీకి వెళ్లే ఎత్తైన రహదారి రెండింటిని ఇరుకైన కూడలి కలిపేయడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు కూడలి విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. -
భవిష్యత్తు ప్రణాళికలు.. ప్రత్యామ్నాయ పనులు
[ 08-07-2024]
మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ప్రత్యామ్నాయ ఫీడర్ల అనుసంధానం, విద్యుత్తు ఉపకేంద్రాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నారు. -
వసతి గృహాలను పట్టించుకోరా?
[ 08-07-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్కు ప్రజలు ఓటు వేశారు: పురందేశ్వరి
-
737 మ్యాక్స్ విమాన ప్రమాదాలు.. బోయింగ్ నేరాంగీకారం
-
నెలసరి సెలవులు మంచిదే కానీ..: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ‘కల్కి 2898 ఏడీ’
-
డీఎస్సీని వాయిదా వేయాలని ఆందోళన.. విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
కాలుష్యం పెరిగితే.. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు: మంత్రి పొన్నం ప్రభాకర్