మేలైన వంగడాలు.. సమగ్ర యాజమాన్యం
వానాకాలం పైర్లసాగులో రైతులకు తోడుగా నిలిచేలా పొలాస ప్రాంతీయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలతో గురువారం ‘ఈనాడు’ ఫోన్ఇన్ కార్యక్రమాన్ని చేపట్టింది.
‘ఈనాడు’ ఫోన్ఇన్లో రైతులకు శాస్త్రవేత్తల సూచనలు
ఫోన్లో రైతులతో మాట్లాడుతున్న ఏడీఆర్, పాల్గొన్న శాస్త్రవేత్తలు
న్యూస్టుడే, జగిత్యాల వ్యవసాయం: వానాకాలం పైర్లసాగులో రైతులకు తోడుగా నిలిచేలా పొలాస ప్రాంతీయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలతో గురువారం ‘ఈనాడు’ ఫోన్ఇన్ కార్యక్రమాన్ని చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఫోన్కాల్, వీడియోకాల్ ద్వారా అడిగిన సందేహాలను ఏడీఆర్ డాక్టర్ జి.శ్రీనివాస్, శాస్త్రవేత్తలు డాక్టర్ డి.శ్రీలత, డాక్టర్ బి.శ్రీనివాస్, డాక్టర్ గోన్యానాయక్, డాక్టర్ ఇ.రజనీకాంత్, డాక్టర్ బలరాం, డాక్టర్ పి.రవి, డాక్టర్ డి.పద్మజ నివృత్తిచేశారు.
సమస్య: ఏయే రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, వరిని ఎప్పటివరకు సాగుచేయవచ్చు.?
- నవీన్రెడ్డి, రాజేందర్(గుల్లపేట), రాజమల్లయ్య(కండ్లపల్లి), మల్లేశం(ధర్మారం), లక్ష్మీనర్సయ్య(మేడిపల్లి)
సమాధానం: జేజీఎల్384, జేజీఎల్3828, జేజీఎల్3855, బతుకమ్మ బ్రీడర్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక రకాలతో ఈ నెలాఖరు వరకు నార్లుపోసుకోవచ్చు. తెలంగాణ సోన రకాన్ని ఈ నెల 10 తరువాత నార్లుపోసుకోవాలి. వ్యవసాయ వర్సిటీల ద్వారా విడుదలైన అన్ని సన్నరకాలను సాగు చేయవచ్చు. సుడిదోమల నివారణకు సమగ్ర యాజమాన్యం చేపట్టాలి.
పత్తిలో ఏయే చర్యలు చేపట్టాలి.? - రమణ(తక్కళ్లపల్లి), శివరాజం(పెరకపల్లె), శ్రీనివాస్(తిమ్మాపూర్), జీవన్(హన్మాజీపేట), తిరుపతి(లక్ష్మీపూర్), రాయలింగు(వీణవంక)
వర్షాభావంతో మొక్కలు మొలవనిచోట పోగుడ్డలు పెట్టవచ్చు. జులై 15 వరకు పత్తిని వర్షాధారంగా కేవలం నల్లరేగడి నేలల్లోనే సాగుచేయాలి. నీటివసతి ఉన్నపుడు ఎలాంటి నేలల్లోనైనా వేయవచ్చు. ఆరు వరుసల పత్తి, ఒక వరుస కంది విత్తవచ్చు. బీటీపత్తిలో చేనుచుట్టూ నాన్బీటీ విత్తనాలను లేదా కందిసాళ్లను విత్తాలి.
కందిలో అనువైన రకాలేమిటి.? - రాజనర్సు(పోతారం), విజయ్(తాటిపల్లి), కె.లక్ష్మారెడ్డి, పెద్దిరాజం(ఇబ్రహీంపట్నం)
నీటివసతితో డబ్ల్యూఆర్జి93, డబ్ల్యూఆర్జి121, వర్షాధారంగా డబ్ల్యూఆర్జి97 రకాలు అనువైనవి. స్వల్పకాలిక పీఆర్జి176 రకాన్ని కూడా వేయవచ్చు. విత్తనాలను వ్యవసాయశాఖ మినీకిట్్స ఇస్తుండగా ఆదిలాబాద్, వరంగల్ పరిశోధనస్థానం నుంచి కూడా విత్తనాలను తీసుకోవచ్చు. కందిని ఏకపంటగా లేదా పత్తి, పసుపుల్లో మిశ్రమ, అంతర పంటగానూ వేయవచ్చు.
మామిడిలో ప్రస్తుతం ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి.?
- జనార్దన్(రాయికల్), రాంకిషన్(వెల్దుర్తి), మహేందర్రెడ్డి(మోతె)
చెట్లపైనగల ఎండుపుల్లలు, తోటలో రాలిన కాయలను ఏరివేయాలి, చెట్లమధ్యన దుక్కిచేయాలి. కొమ్మల ఫ్రూనింగ్ చేసినచోట కాపర్ఆక్సీక్లోరైడ్ చల్లాలి. పదేళ్లు పైబడిన చెట్టుకు ఒక్కోదానికి 80-100 కిలోల పశువుల ఎరువులను, 1 కిలో చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను, 125 గ్రాముల జింకు, 50 గ్రాముల బోరాన్ వేయాలి. ఇప్పట్నుంచి మళ్లీ పూత వరకు రెండుమూడు సార్లు రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు వేయాలి.
మొక్కజొన్న, నువ్వులను ప్రస్తుతం సాగు చేయవచ్చా.?
- రవీందర్రెడ్డి(మల్లాపూర్), రాములు(వెంకట్రావుపేట), గంగారెడ్డి(మల్యాల), రాంరెడ్డి(సిరికొండ)
ఈ నెలాఖరు వరకు మక్కను సాగుచేయవచ్చు. ఎండుతెగులును తట్టుకునే రకాలను విత్తనశుద్ధిచేసి విత్తుకోవాలి. నీరు నిలవని నేలల్లో ఆగస్టు 15-30 వరకు నువ్వును సాగుచేయవచ్చు. ఆగస్టులో వేరుసెనగను విత్తుకోవచ్చు. ప్రతి మంగళవారం రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్సిటీ శాస్త్రవేత్తలు వెలువరించే సూచనలను రైతులు పాటించాలి.
ఎన్నిరోజుల వరినారును నాటువేయాలి, నారుమడిలో సస్యరక్షణ ఎలా.? - రెడ్డి తిరుపతి, అర్పపల్లి
25-30 రోజుల వయసున్న నారును నాటుకుంటే పిలకలు అధికంగా వస్తాయి. నారుతీతకు వారంముందుగా ఎకరా మడికి కిలో కార్భోఫ్యూరాన్ గుళికలను చల్లాలి.
కూరగాయల్లో కలుపు సమస్యను ఎలా నివారించాలి.?
- అత్తినేని శంకర్, గోపాల్రావుపేట్ల
విత్తనాలు నాటకముందు ఒకరకం, విత్తనాలు నాటి మొలకెత్తిన తరువాత ఆయా పంటల రకాలను బట్టి కలుపు నివారణ రసాయనాలున్నాయి. మొక్కలపై పడకుండా సాళ్లలో కలుపునివారణ రసాయనాన్ని పిచికారీ చేస్తే మంచి ఫలితముంటుంది.
వరిలో మొగిపురుగు సమస్య అత్యంత తీవ్రంగా ఉంటోంది, ఎలా నివారించాలి.
- కాలగిరి సత్యనారాయణరెడ్డి, సారంగాపూర్
నాటిన నెలరోజుల్లోపు గుళికలు చల్లాలి లేదా పిచికారీ చేయవచ్చు. పైరు పిలకదశలో మరోసారి మందుద్రావణాన్ని పిచికారీ చేసినట్లయితే తెల్లకంకి రాకుండా చూడవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదివారం వైద్యసేవలకు సుస్తీ
[ 08-07-2024]
అసలే వానాకాలం. ఈ సమయంలో దోమలు, ఈగలు వృద్ధి చెంది.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే పలువురు వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడ కుక్కలు, పాములు, కోతులు కరుస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. -
ప్రహసనంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ
[ 08-07-2024]
పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చెత్త విభజన నిల్వ కేంద్రాలు (సెగ్రిగేషన్ షెడ్లు) ఏర్పాటు చేసింది. ఇంటింటి నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వాటిని క్రమ పద్ధతిగా ఏరివేసి ఈ కేంద్రాలకు పంపించాలి. -
నీటి శుద్ధికి సాంకేతిక సమస్యలు
[ 08-07-2024]
నగర అవసరాలకు అనుకూలంగా తాగునీరు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జలాన్ని శుద్ధి చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తుండగా.. మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తున్నారు. -
పర్యవేక్షణ కొరవడి.. బోధన కుంటుపడి
[ 08-07-2024]
ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. మండల స్థాయిల్లో పర్యవేక్షించే విద్యాధికారుల రెగ్యులర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉండటం ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. -
సాంకేతిక విద్య.. వసతులు మిథ్య
[ 08-07-2024]
జేఎన్టీయూ ఇంజీనిరింగ్ కళాశాల.. దేశ, విదేశాల్లో ఎంతో మంది సాంకేతిక పట్టభద్రులు జీవితంలో స్థిరపడేలా చేసిన ఉన్నత విద్యాసంస్థ.. ఏటా ఇక్కడ చదివి ఉత్తీర్ణులైన వేలాది మంది టెకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి రుచుల విపత్తు
[ 08-07-2024]
ఆకట్టుకునే రంగులు.. పైపై హంగులతో కూడిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ కొందరు ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం సరకుల వాడకం, రసాయనాలు, రంగులు కలుపుతుండటంతో వ్యాధులు వెంటాడుతున్నాయి. మార్కెట్లో పెచ్చుమీరుతున్న కల్తీ ప్రాణాలను హరిస్తోంది. -
మానీరుపైనే ఆశలు నిండితేనే పంటల సాగు
[ 08-07-2024]
మానేరు జలాశయంలో నీరు లేక అన్నదాతలు పంటల సాగుకు వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నారు. కొందరు నారు మడులు వేసినా నీరు లేక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు ముదిరిపోతుంది. -
కలగా సాంకేతిక విద్య
[ 08-07-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లు సక్రమంగానే సాగినప్పటికీ తరవాత మూలకు చేరింది. బోధకులు లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
ఇప్పటికైనా మార్పు వచ్చేనా!
[ 08-07-2024]
రామగుండం కార్పొరేషన్పై జిల్లా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో నగరపాలిక నిర్వహణ మెరుగు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
[ 08-07-2024]
ఒకవైపు నాలుగు వరుసల రహదారి, మరోవైపు ఆర్వోబీకి వెళ్లే ఎత్తైన రహదారి రెండింటిని ఇరుకైన కూడలి కలిపేయడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు కూడలి విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. -
భవిష్యత్తు ప్రణాళికలు.. ప్రత్యామ్నాయ పనులు
[ 08-07-2024]
మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ప్రత్యామ్నాయ ఫీడర్ల అనుసంధానం, విద్యుత్తు ఉపకేంద్రాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నారు. -
వసతి గృహాలను పట్టించుకోరా?
[ 08-07-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెండో మ్యాచ్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?
-
బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం
-
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
-
బతికుండగానే కన్నకూతురిని సమాధి చేసిన తండ్రి
-
అలా చేయగల ఏకైక నటుడు కమల్హాసన్: బ్రహ్మానందం
-
6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు