గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
ధర్మపురిలో ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ పేర్కొన్నారు
వివరాలు వెల్లడిస్తున్న జగిత్యాల డీఎస్పీ రఘుచందర్
ధర్మపురి, న్యూస్టుడే: ధర్మపురిలో ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ పేర్కొన్నారు. ధర్మపురి పట్టణంలోని పోలీసుస్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామానికి చెందిన బత్తిని చందు(23), గొల్ల వెంకటేష్(25)లు గత రెండేళ్ల నుంచి గంజాయి తాగుతున్నారు. జల్సాలకు కావాల్సిన డబ్బులు దొరక్కపోవడంతో పథకం పన్నారు. తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయించేలా ప్రణాళిక వేసుకున్నారు. గత రెండేళ్ల నుంచి రాము అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. వీరిద్దరూ తాగడంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ద్విచక్ర వాహనం సీటు కింద కవర్లో గంజాయి పెట్టుకొని ధర్మపురికి వస్తుండగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.40 వేల విలువైన గంజాయి, రెండు చరవాణులు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రాము పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్, ఏఎస్సై సూర్య నారాయణరాజు, హెడ్కానిస్టేబుళ్లు ఎం శంకర్, డి.వెంకటయ్య, రామస్వామి తదితరులను ఎస్పీ అశోకుమార్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.
ఆన్లైన్ గేమ్స్తో అక్రమ సంపాదన
రూ.33 లక్షల నగదు స్వాధీనం.. ముగ్గురి అరెస్టు
సుల్తానాబాద్, న్యూస్టుడే: ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగులు పెడుతూ, గేమ్ యాప్ల లింక్లను సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరులకు పంపుతూ అక్రమంగా సంపాదిస్తున్న ముగ్గురిని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం గోదావరిఖనికి చెందిన ముల్కల రాజ్కుమార్, చిన్నపల్లి అభిలాష్, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకేంద్రానికి చెందిన నిమ్మ ధనుంజయ్లు బృందంగా ఏర్పడి హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగులు పెట్టి ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. అదే ఆన్లైన్ గేమ్ యాప్ లింక్లు ఇతరులకు పంపుతూ వచ్చే డబ్బుతో జల్సాలకు అలవాటు పడ్డారు. గురువారం సుల్తానాబాద్ ప్రయాణ ప్రాంగణం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.33 లక్షల నగదును బ్యాగ్లో పెట్టుకొని హైదరాబాద్ నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితుల నుంచి రూ.33 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
భర్త వేధింపులతో భార్య బలవన్మరణం
జమ్మికుంట, న్యూస్టుడే: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంటలోని మారుతినగర్లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. జమ్మికుంట సీఐ రవి కథనం ప్రకారం.. వీణవంక మండల వల్బాపూర్కు చెందిన కావ్య(26)కు అదే మండలం ఎల్బాకకు చెందిన జీడి రాజుతో వివాహం అయింది. వీరికి కుమారుడు, కూతురు సంతానం కాగా.. జమ్మికుంటలోని మారుతినగర్లో నివాసం ఉంటున్నారు. కావ్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానంతో రాజు గతంలో దుర్భాషలాడి కొట్టడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అనంతరం కావ్యను బాగా చూసుకుంటాని ఇంటికి తీసుకెళ్లిన రాజు మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీంతో కావ్య బుధవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. గురువారం మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
విద్యుత్తు చౌర్యం కేసులో జరిమానా
భగత్నగర్ : హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన కేశబోయిన తిరుపతికి విద్యుత్తు చౌర్యం కేసులో జిల్లా ఒకటో అదనపు సెషన్స్ జడ్జి డి.వెంకటేశ్ రూ.14,616 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని యాంటీ పవర్ థెప్ట్ స్క్వాడ్(ఏపీటీఎస్) సీఐ ఎండీ షాదుల్లాబాబా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదివారం వైద్యసేవలకు సుస్తీ
[ 08-07-2024]
అసలే వానాకాలం. ఈ సమయంలో దోమలు, ఈగలు వృద్ధి చెంది.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే పలువురు వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడ కుక్కలు, పాములు, కోతులు కరుస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. -
ప్రహసనంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ
[ 08-07-2024]
పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చెత్త విభజన నిల్వ కేంద్రాలు (సెగ్రిగేషన్ షెడ్లు) ఏర్పాటు చేసింది. ఇంటింటి నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వాటిని క్రమ పద్ధతిగా ఏరివేసి ఈ కేంద్రాలకు పంపించాలి. -
నీటి శుద్ధికి సాంకేతిక సమస్యలు
[ 08-07-2024]
నగర అవసరాలకు అనుకూలంగా తాగునీరు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జలాన్ని శుద్ధి చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తుండగా.. మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తున్నారు. -
పర్యవేక్షణ కొరవడి.. బోధన కుంటుపడి
[ 08-07-2024]
ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. మండల స్థాయిల్లో పర్యవేక్షించే విద్యాధికారుల రెగ్యులర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉండటం ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. -
సాంకేతిక విద్య.. వసతులు మిథ్య
[ 08-07-2024]
జేఎన్టీయూ ఇంజీనిరింగ్ కళాశాల.. దేశ, విదేశాల్లో ఎంతో మంది సాంకేతిక పట్టభద్రులు జీవితంలో స్థిరపడేలా చేసిన ఉన్నత విద్యాసంస్థ.. ఏటా ఇక్కడ చదివి ఉత్తీర్ణులైన వేలాది మంది టెకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి రుచుల విపత్తు
[ 08-07-2024]
ఆకట్టుకునే రంగులు.. పైపై హంగులతో కూడిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ కొందరు ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం సరకుల వాడకం, రసాయనాలు, రంగులు కలుపుతుండటంతో వ్యాధులు వెంటాడుతున్నాయి. మార్కెట్లో పెచ్చుమీరుతున్న కల్తీ ప్రాణాలను హరిస్తోంది. -
మానీరుపైనే ఆశలు నిండితేనే పంటల సాగు
[ 08-07-2024]
మానేరు జలాశయంలో నీరు లేక అన్నదాతలు పంటల సాగుకు వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నారు. కొందరు నారు మడులు వేసినా నీరు లేక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు ముదిరిపోతుంది. -
కలగా సాంకేతిక విద్య
[ 08-07-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లు సక్రమంగానే సాగినప్పటికీ తరవాత మూలకు చేరింది. బోధకులు లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
ఇప్పటికైనా మార్పు వచ్చేనా!
[ 08-07-2024]
రామగుండం కార్పొరేషన్పై జిల్లా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో నగరపాలిక నిర్వహణ మెరుగు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
[ 08-07-2024]
ఒకవైపు నాలుగు వరుసల రహదారి, మరోవైపు ఆర్వోబీకి వెళ్లే ఎత్తైన రహదారి రెండింటిని ఇరుకైన కూడలి కలిపేయడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు కూడలి విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. -
భవిష్యత్తు ప్రణాళికలు.. ప్రత్యామ్నాయ పనులు
[ 08-07-2024]
మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ప్రత్యామ్నాయ ఫీడర్ల అనుసంధానం, విద్యుత్తు ఉపకేంద్రాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నారు. -
వసతి గృహాలను పట్టించుకోరా?
[ 08-07-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
డీఎస్సీని వాయిదా వేయాలని ఆందోళన.. విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
కాలుష్యం పెరిగితే.. భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు: మంత్రి పొన్నం ప్రభాకర్
-
జెరోదాలో మళ్లీ సాంకేతిక సమస్య.. సోషల్ మీడియా వేదికగా యూజర్ల అసహనం!
-
బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్
-
స్కైడాన్స్ చేతికి హాలీవుడ్ ఐకాన్ పారామౌంట్ గ్లోబల్..!
-
ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయొద్దు: ఈసీకి ఏపీ హైకోర్టు ఆదేశం