కొత్త జీవితం ప్రారంభిస్తాం
గెట్ల పంచాయతీ తోపులాటలో బంధువు చనిపోయిన కేసుతో తండ్రి, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. 2010 నుంచి 2024 వరకు గడిపిన జైలు జీవితం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని వారు అంటున్నారు
తండ్రి గంగయ్యతో ఆశయ్య
న్యూస్టుడే, కరీంనగర్ నేరవార్తలు : గెట్ల పంచాయతీ తోపులాటలో బంధువు చనిపోయిన కేసుతో తండ్రి, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. 2010 నుంచి 2024 వరకు గడిపిన జైలు జీవితం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని వారు అంటున్నారు.. నిద్ర లేని రాత్రులు గడిపామని.. ఇక కొత్త జీవితం ప్రారంభిస్తామన్నారు.. బుధవారం 213 మంది ఖైదీలను విడుదల చేయగా.. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన గంగయ్య, ఆయన కుమారుడు ఆశయ్య, మధు ఉన్నారు. ఆశయ్య ‘న్యూస్టుడే’తో మాట్లాడారు.
మాకు రెండు ఎకరాల భూమి ఉంది. పక్కన పొలం ఉన్న బంధువుతో గెట్ల పంచాయితీ ఉండేది. 2008లో పొలం వద్ద జరిగిన తోపులాటలో బంధువు కింద పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మా తండ్రి గంగయ్యతోపాటు నాపై, తమ్ముడు మధుపై కేసు నమోదైంది. 2010లో మా ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించగా వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. 2010 నుంచి 2016 వరకు జైలు ఆవరణలో వివిధ పనులు చేసుకుంటూ ఉన్నాం. వరంగల్ జైలు కూల్చివేయడంతో 2020లో కరీంనగర్ జిల్లా జైలుకు పంపించారు. తండ్రి గంగయ్య నర్సరీ, తమ్ముడు, నేను ఇక్కడ ఉన్న పెట్రోలు బంక్లో ఓపెన్ ఖైదీలుగా పని చేస్తూ వచ్చాం. అమ్మ, ఊరు, అక్కడి మనుషులు గుర్తుకు వస్తే రాత్రుళ్లు నిద్ర పట్టేది. కాదు. ఓపెన్ ఖైదీలుగా ఉండటంతో సమాజంపై కొంత అవగాహన పెరిగింది. జైలుకు వచ్చే సమయంలో నాకు 21, తమ్ముడికి 16 సంవత్సరాలు. జైలు అధికారుల ప్రోత్సాహంతో తమ్ముడు, నేను ఓపెన్ డిగ్రీ పూర్తి చేశాం. క్షమాభిక్షకు తమ ముగ్గురి పేర్లు ప్రతిపాదించినట్లు తెలియడంతో జీవితంపై కొత్త ఆశ కలిగింది. ఆరు నెలలుగా విడుదలకు వేచి చూశాం. బుధవారం విడుదలైన వెంటనే నేరుగా గ్రామానికి వెళ్లగా పుట్టిన ఊరు, స్నేహితులు, బంధువులను చూసి కన్నీళ్లు ఆగలేదు. జైలు అధికారులు కరీంనగర్ పెట్రోల్ బంకులో ఉద్యోగిగా పని చేసే అవకాశం కల్పించారు. ఇప్పటి నుంచి మాకు కొత్త జీవితం ప్రారంభం అయినట్లే. - ఆశయ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదివారం వైద్యసేవలకు సుస్తీ
[ 08-07-2024]
అసలే వానాకాలం. ఈ సమయంలో దోమలు, ఈగలు వృద్ధి చెంది.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే పలువురు వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడ కుక్కలు, పాములు, కోతులు కరుస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. -
ప్రహసనంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ
[ 08-07-2024]
పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చెత్త విభజన నిల్వ కేంద్రాలు (సెగ్రిగేషన్ షెడ్లు) ఏర్పాటు చేసింది. ఇంటింటి నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వాటిని క్రమ పద్ధతిగా ఏరివేసి ఈ కేంద్రాలకు పంపించాలి. -
నీటి శుద్ధికి సాంకేతిక సమస్యలు
[ 08-07-2024]
నగర అవసరాలకు అనుకూలంగా తాగునీరు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జలాన్ని శుద్ధి చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తుండగా.. మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తున్నారు. -
పర్యవేక్షణ కొరవడి.. బోధన కుంటుపడి
[ 08-07-2024]
ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. మండల స్థాయిల్లో పర్యవేక్షించే విద్యాధికారుల రెగ్యులర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉండటం ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. -
సాంకేతిక విద్య.. వసతులు మిథ్య
[ 08-07-2024]
జేఎన్టీయూ ఇంజీనిరింగ్ కళాశాల.. దేశ, విదేశాల్లో ఎంతో మంది సాంకేతిక పట్టభద్రులు జీవితంలో స్థిరపడేలా చేసిన ఉన్నత విద్యాసంస్థ.. ఏటా ఇక్కడ చదివి ఉత్తీర్ణులైన వేలాది మంది టెకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి రుచుల విపత్తు
[ 08-07-2024]
ఆకట్టుకునే రంగులు.. పైపై హంగులతో కూడిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ కొందరు ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం సరకుల వాడకం, రసాయనాలు, రంగులు కలుపుతుండటంతో వ్యాధులు వెంటాడుతున్నాయి. మార్కెట్లో పెచ్చుమీరుతున్న కల్తీ ప్రాణాలను హరిస్తోంది. -
మానీరుపైనే ఆశలు నిండితేనే పంటల సాగు
[ 08-07-2024]
మానేరు జలాశయంలో నీరు లేక అన్నదాతలు పంటల సాగుకు వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నారు. కొందరు నారు మడులు వేసినా నీరు లేక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు ముదిరిపోతుంది. -
కలగా సాంకేతిక విద్య
[ 08-07-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లు సక్రమంగానే సాగినప్పటికీ తరవాత మూలకు చేరింది. బోధకులు లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
ఇప్పటికైనా మార్పు వచ్చేనా!
[ 08-07-2024]
రామగుండం కార్పొరేషన్పై జిల్లా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో నగరపాలిక నిర్వహణ మెరుగు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
[ 08-07-2024]
ఒకవైపు నాలుగు వరుసల రహదారి, మరోవైపు ఆర్వోబీకి వెళ్లే ఎత్తైన రహదారి రెండింటిని ఇరుకైన కూడలి కలిపేయడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు కూడలి విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. -
భవిష్యత్తు ప్రణాళికలు.. ప్రత్యామ్నాయ పనులు
[ 08-07-2024]
మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ప్రత్యామ్నాయ ఫీడర్ల అనుసంధానం, విద్యుత్తు ఉపకేంద్రాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నారు. -
వసతి గృహాలను పట్టించుకోరా?
[ 08-07-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
తాజా వార్తలు (Latest News)
-
షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ డీఎస్సీ.. ఎలాంటి మార్పు లేదు
-
మాల్దీవుల్లో సంబరాలు చేసుకోండి.. భారత క్రికెట్ జట్టుకు ఆహ్వానం
-
అధిక వడ్డీ ఆశ జూపి భారీ మోసం.. రూ.514 కోట్ల డిపాజిట్లు సేకరణ
-
ఓటీటీలోకి ‘హరోం హర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా!
-
తితిదే మాజీ ఈవో, ఛైర్మన్పై తెదేపా నేతల ఫిర్యాదు