తనిఖీలు విస్తృతం.. అక్రమాలు యథాతథం
పెద్దపల్లికి చెందిన ఓ బయో ఫెర్టిలైజర్ కంపెనీ డీలర్ కొన్నేళ్ల కిందట జన్మదిన వేడుకలు నిర్వహించారు. విందు ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారిని ఆహ్వానించారు.
ఎరువుల వ్యాపారులతో అనుబంధాలు
వివాదాస్పదంగా వ్యవసాయాధికారుల తీరు
పెద్దపల్లిలోని ఎరువుల దుకాణంలో తనిఖీ చేస్తున్న డీఏవో ఆదిరెడ్డి(పాతచిత్రం)
పెద్దపల్లికి చెందిన ఓ బయో ఫెర్టిలైజర్ కంపెనీ డీలర్ కొన్నేళ్ల కిందట జన్మదిన వేడుకలు నిర్వహించారు. విందు ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారిని ఆహ్వానించారు. అప్పట్లో ఆ వ్యాపారికి అనుకూలంగా వ్యవహరించారని సదరు అధికారిపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు గత నెలలో జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ విచారణ జరిపారు.
ఇటీవల పెద్దపల్లిలోని ఎరువుల దుకాణానికి తనిఖీ కోసం ఒంటరిగా వెళ్లిన ముఖ్య వ్యవసాయ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. వ్యాపారి ఆయనపై తిరగబడటంతో చేష్టలుడిగిన ఆయన వ్యాపారుల సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
న్యూస్టుడే, పెద్దపల్లి : పై రెండు ఘటనలు అధికారులు, వ్యాపారుల మధ్య బంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మొదటి సందర్భంలోని అధికారి గతంలో తోటి ఉద్యోగులను వేధించడం, ఆత్మ నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మే 23న జిల్లా అధికారులు విచారణ నిర్వహించారు. వారి నివేదికపై ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండో ఘటనలో ప్రస్తుతం జిల్లా వ్యవసాయ శాఖలోని కీలక అధికారిపై కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎరువుల దుకాణాలకు సిబ్బందితో కాకుండా ఒంటరిగా వెళ్లడం.. గతంలో కేసులు నమోదై విచారణను ఎదుర్కొంటున్న వ్యాపారులతో అనుబంధం కొనసాగించడం.. వేడుకల కోసం నిధుల సమీకరణకు వ్యాపారులను వేధించడం వంటి ఆరోపణలున్నాయి. చివరకు ఓ వ్యాపారి తిరగబడితే అతడిపై చర్యలు తీసుకోకుండా రాజీ కోసం వ్యాపార సంఘం నాయకులతో యత్నించడం అనేక సందేహాలకు తావిస్తోంది.
మొక్కుబడి పరిశీలనలు
ఎరువులు, విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ శాఖతో పాటు టాస్క్ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరు తనిఖీ చేసినప్పటికీ వారి వెంట మండల వ్యవసాయాధికారి తప్పనిసరిగా ఉండాలి. తనిఖీల్లో అక్రమాలు వెల్లడైతే దుకాణం లేదా ఉత్పత్తులను సీజ్ చేయడం, కేసులు నమోదు చేసే అధికారం మండల వ్యవసాయాధికారికే ఉంటుంది. అలాగే దుకాణానికి సంబంధించిన ఎరువుల జాబితా, అనుమతి పొందిన కంపెనీల వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల వివరాలు ఏవో వద్దే ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో జిల్లాలో జరుగుతున్న తనిఖీల్లో ఎక్కడా మండల వ్యవసాయాధికారులు కనిపించడం లేదు. పెద్దపల్లి, పాలకుర్తి, మంథని ప్రాంతాల్లోనూ ఇటీవల జిల్లా వ్యవసాయాధికారి తనిఖీలు నిర్వహించిన సందర్భంలోనూ మండల అధికారులు వెళ్లలేదు.
అవినీతిపై చర్యలేవీ!
- జిల్లాలో వ్యవసాయ శాఖ జరిపే తనిఖీల్లో కొన్నేళ్లుగా అక్రమాలు బయట పడకపోగా పోలీసులు, టాస్క్ఫోర్స్, ఇంటెలిజెన్స్ విభాగాలు నిర్వహించే తనిఖీల్లో తరచూ వెల్లడవుతున్నాయి.
- గతంలో రాష్ట్రంలోనే నిషేధించిన ఫోరేట్ ప్యాకెట్లు, గ్లైకోసిల్, అమ్మోనియా తదితర మందులను విక్రయిస్తుండటంతో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అవి కోర్టుల్లో కొనసాగుతున్నాయి.
- తాజాగా వ్యవసాయ శాఖ హెచ్టీ (హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్) విత్తనాలను వినియోగించొద్దని గ్రామ స్థాయిలో ప్రచారం చేసింది. మరో వైపు అంతర్గాం మండలంలో రెండు, మూడేళ్లుగా రైతులు ఈ విత్తనాలను వాడుతున్నట్లు తెలిసినప్పటికీ విక్రయదారులను పట్టుకోలేకపోయారు.
- పెద్దపల్లిలోని అయిదుగురు పురుగు మందుల వ్యాపారులపై గతంలో కేసుల నమోదైనా ఇప్పటివరకు శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు.
- అందుబాటులో లేకుంటేనే ఒంటరిగా వెళ్తాం
- దుకాణాలను తనిఖీ చేసే సమయంలో అక్రమాలు బయట పడితే మండల అధికారిని పిలిచి కేసు నమోదుకు సిఫార్సు చేస్తా. తనిఖీలు జరిపే క్రమంలో ఏవో, ఇతర అధికారులు అందుబాటులో లేకుంటే ఒంటరిగా వెళ్తుంటాం. గతంలో వ్యాపారులపై నమోదైన కేసుల వివరాలేవీ తెలియవు. వారిపై చర్యలు తీసుకునే విషయంలో చట్ట ప్రకారం వ్యవహరిస్తాం. వ్యవసాయాధికారులకు వ్యాపారులతో ఆర్థిక లావాదేవీలుండవు. ఒకవేళ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలుంటే చర్యలు తీసుకుంటాం.
-ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదివారం వైద్యసేవలకు సుస్తీ
[ 08-07-2024]
అసలే వానాకాలం. ఈ సమయంలో దోమలు, ఈగలు వృద్ధి చెంది.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే పలువురు వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడ కుక్కలు, పాములు, కోతులు కరుస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. -
ప్రహసనంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ
[ 08-07-2024]
పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చెత్త విభజన నిల్వ కేంద్రాలు (సెగ్రిగేషన్ షెడ్లు) ఏర్పాటు చేసింది. ఇంటింటి నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వాటిని క్రమ పద్ధతిగా ఏరివేసి ఈ కేంద్రాలకు పంపించాలి. -
నీటి శుద్ధికి సాంకేతిక సమస్యలు
[ 08-07-2024]
నగర అవసరాలకు అనుకూలంగా తాగునీరు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జలాన్ని శుద్ధి చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తుండగా.. మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తున్నారు. -
పర్యవేక్షణ కొరవడి.. బోధన కుంటుపడి
[ 08-07-2024]
ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. మండల స్థాయిల్లో పర్యవేక్షించే విద్యాధికారుల రెగ్యులర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉండటం ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. -
సాంకేతిక విద్య.. వసతులు మిథ్య
[ 08-07-2024]
జేఎన్టీయూ ఇంజీనిరింగ్ కళాశాల.. దేశ, విదేశాల్లో ఎంతో మంది సాంకేతిక పట్టభద్రులు జీవితంలో స్థిరపడేలా చేసిన ఉన్నత విద్యాసంస్థ.. ఏటా ఇక్కడ చదివి ఉత్తీర్ణులైన వేలాది మంది టెకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి రుచుల విపత్తు
[ 08-07-2024]
ఆకట్టుకునే రంగులు.. పైపై హంగులతో కూడిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ కొందరు ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం సరకుల వాడకం, రసాయనాలు, రంగులు కలుపుతుండటంతో వ్యాధులు వెంటాడుతున్నాయి. మార్కెట్లో పెచ్చుమీరుతున్న కల్తీ ప్రాణాలను హరిస్తోంది. -
మానీరుపైనే ఆశలు నిండితేనే పంటల సాగు
[ 08-07-2024]
మానేరు జలాశయంలో నీరు లేక అన్నదాతలు పంటల సాగుకు వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నారు. కొందరు నారు మడులు వేసినా నీరు లేక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు ముదిరిపోతుంది. -
కలగా సాంకేతిక విద్య
[ 08-07-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లు సక్రమంగానే సాగినప్పటికీ తరవాత మూలకు చేరింది. బోధకులు లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
ఇప్పటికైనా మార్పు వచ్చేనా!
[ 08-07-2024]
రామగుండం కార్పొరేషన్పై జిల్లా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో నగరపాలిక నిర్వహణ మెరుగు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
[ 08-07-2024]
ఒకవైపు నాలుగు వరుసల రహదారి, మరోవైపు ఆర్వోబీకి వెళ్లే ఎత్తైన రహదారి రెండింటిని ఇరుకైన కూడలి కలిపేయడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు కూడలి విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. -
భవిష్యత్తు ప్రణాళికలు.. ప్రత్యామ్నాయ పనులు
[ 08-07-2024]
మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ప్రత్యామ్నాయ ఫీడర్ల అనుసంధానం, విద్యుత్తు ఉపకేంద్రాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నారు. -
వసతి గృహాలను పట్టించుకోరా?
[ 08-07-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బంగారు గనిలో ప్రమాదం.. 11 మంది మృతి
-
మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్ఔట్ నోటీసు
-
ఓటీటీలోకి విజయ్ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
ఆ స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: రష్యా పర్యటనకు బయల్దేరిన మోదీ
-
దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తొలగించినట్లవుతుంది: అయ్యన్నపాత్రుడు
-
టీమ్ఇండియాకు రూ. 125 కోట్ల నజరానా.. ఎవరికి ఎంతంటే?