పసుపు.. ఎరుపు హెచ్చరిక కార్డులు
గని ప్రమాదాలపై సింగరేణి యాజమాన్యం కార్మికులకు పసుపు.. ఎరుపు కార్డులను(ఎల్లో, రెడ్) ప్రవేశపెట్టింది. రెండు నెలల క్రితమే ఈ ఆదేశాలు విడుదల చేసినా ఎన్నికల కోడ్ కారణంగా బయటకు రాలేదు
సింగరేణిలో ఉద్యోగులపై చర్యలకు కొత్త విధానం
నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు
న్యూస్టుడే, గోదావరిఖని: గని ప్రమాదాలపై సింగరేణి యాజమాన్యం కార్మికులకు పసుపు.. ఎరుపు కార్డులను(ఎల్లో, రెడ్) ప్రవేశపెట్టింది. రెండు నెలల క్రితమే ఈ ఆదేశాలు విడుదల చేసినా ఎన్నికల కోడ్ కారణంగా బయటకు రాలేదు. ఎన్నికల కోడ్ ముగియడంతో యాజమాన్యం రెండు రోజుల క్రితం తాజాగా అన్ని ఏరియాలకు ఆదేశాలు జారీ చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుడు తప్పు చేస్తే ముందుగా పసుపు కార్డు, వరుసగా మూడు సార్లు తప్పు చేస్తే రెడ్కార్డు జారీచేసి ఆ తర్వాత చర్యలు తీసుకునే విధానాన్ని కొత్తగా అమలు చేసేందుకు నిర్ణయించారు. దీనిని వెంటనే విరమించుకోవాలని కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గని ప్రమాదాలకు కార్మికులను బలి చేస్తున్న యాజమాన్యం పసుపు, ఎరుపు కార్డుల విధానంతో పూర్తిగా ఉద్యోగులే బాధ్యులన్న సంకేతాలను ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలకు అక్కడున్న రక్షణ చర్యలు.. పని స్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు చేపట్టాల్సి ఉంటుంది. కాగా పని స్థలంలో ఏ తప్పు చేసినా ముందుగా పసుపు కార్డు జారీ చేయనున్నారు. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా నేరుగా చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చే విధంగా యాజమాన్యం ఈ విధానాన్ని రూపొందించింది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సింగరేణిలో ఇలాంటి విధానం ఇప్పటి వరకు తీసుకోలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఎలాంటి చర్చలేకుండా ఆదేశాలు?
సింగరేణిలో కొత్తగా జారీ చేసిన ఆదేశాలను రహస్యంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి చర్చ లేకుండానే రక్షణ విభాగం నుంచి ఈ ఆదేశాలు విడుదల చేసినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా భూగర్భ గని కార్మికులను ఉద్దేశించి పుసుపు, ఎరుపు కార్డుల విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో కనీసం చర్చించకుండా జారీ చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
సర్వీసుపై ప్రభావం...
సింగరేణిలో పనిచేసే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి యాజమాన్యం కొత్తగా ప్రవేశపెట్టిన పసుపు, ఎరుపు కార్డుల విధానంద్వారా భవిష్యత్తులో ఉద్యోగుల సర్వీసుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కార్మికులు, ఉద్యోగులు విధులు నిర్వహించే సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా వెంటనే పసుపు కార్డు జారీ చేస్తారు. ఇది కార్మికుడి ఖాతాలో జమ అవుతుంది. సంక్షిప్త సందేశం ద్వారా కార్మికుడి చరవాణికి పసుపు కార్డు జారీ చేసినట్లు సమాచారం వస్తుంది. మూడు సార్లు పసుపు కార్డు సందేశం వచ్చిన తదుపరి రెడ్ కార్డు జారీ చేస్తారు. రెడ్ కార్డు తర్వాత ఛార్జిషీటు జారీ చేస్తారు. ఆ తర్వాత విచారణ చేపట్టి సస్పెండ్ చేసే అధికారం యాజమాన్యానికి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు. విధుల్లో చేసే చిన్న పొరపాట్లను సైతం యాజమాన్యం పరిగణలోకి తీసుకుని వాటిపై చర్యలు తీసుకోనుంది. ఈ విధానం ఇబ్బందికరంగా మారనుందని.. వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే రద్దు చేయాలి
యాజమాన్యం జారీ చేసిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలి. లేదంటే సమ్మె నోటీసు జారీ చేస్తాం. కార్మికులను బాధ్యులను చేయడానికే యాజమాన్యం ఈ ఆదేశాలను జారీ చేసింది. యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే సింగరేణిలో ఆందోళనలు తప్పవు. ఇది పూర్తిగా కార్మికులకు విరుద్ధంగా ఉంది.
-వి.సీతారామయ్య, ఏఐటీయూసీ నాయకులు
రక్షణ త్రైపాక్షిక సమావేశంలో చర్చిస్తాం
ఈనెల 19న హైదరాబాద్లో నిర్వహించనున్న రక్షణ త్రైపాక్షిక సమావేశంలో చర్చిస్తాం. ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా జారీ చేసిన ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది కార్మికులకు నష్టం జరిగే విధంగా ఉంది. వెంటనే దీనిని రద్దు చేయాలి. లేదంటే ఆందోళనలు తప్పవు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసే ఆదేశాలను ఎప్పుడూ సమర్థించేది లేదు.
-బి.జనక్ప్రసాద్, ఐఎన్టీయూసీ నాయకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదివారం వైద్యసేవలకు సుస్తీ
[ 08-07-2024]
అసలే వానాకాలం. ఈ సమయంలో దోమలు, ఈగలు వృద్ధి చెంది.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే పలువురు వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడ కుక్కలు, పాములు, కోతులు కరుస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. -
ప్రహసనంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ
[ 08-07-2024]
పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చెత్త విభజన నిల్వ కేంద్రాలు (సెగ్రిగేషన్ షెడ్లు) ఏర్పాటు చేసింది. ఇంటింటి నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వాటిని క్రమ పద్ధతిగా ఏరివేసి ఈ కేంద్రాలకు పంపించాలి. -
నీటి శుద్ధికి సాంకేతిక సమస్యలు
[ 08-07-2024]
నగర అవసరాలకు అనుకూలంగా తాగునీరు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జలాన్ని శుద్ధి చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తుండగా.. మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తున్నారు. -
పర్యవేక్షణ కొరవడి.. బోధన కుంటుపడి
[ 08-07-2024]
ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. మండల స్థాయిల్లో పర్యవేక్షించే విద్యాధికారుల రెగ్యులర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉండటం ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. -
సాంకేతిక విద్య.. వసతులు మిథ్య
[ 08-07-2024]
జేఎన్టీయూ ఇంజీనిరింగ్ కళాశాల.. దేశ, విదేశాల్లో ఎంతో మంది సాంకేతిక పట్టభద్రులు జీవితంలో స్థిరపడేలా చేసిన ఉన్నత విద్యాసంస్థ.. ఏటా ఇక్కడ చదివి ఉత్తీర్ణులైన వేలాది మంది టెకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి రుచుల విపత్తు
[ 08-07-2024]
ఆకట్టుకునే రంగులు.. పైపై హంగులతో కూడిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ కొందరు ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం సరకుల వాడకం, రసాయనాలు, రంగులు కలుపుతుండటంతో వ్యాధులు వెంటాడుతున్నాయి. మార్కెట్లో పెచ్చుమీరుతున్న కల్తీ ప్రాణాలను హరిస్తోంది. -
మానీరుపైనే ఆశలు నిండితేనే పంటల సాగు
[ 08-07-2024]
మానేరు జలాశయంలో నీరు లేక అన్నదాతలు పంటల సాగుకు వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నారు. కొందరు నారు మడులు వేసినా నీరు లేక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు ముదిరిపోతుంది. -
కలగా సాంకేతిక విద్య
[ 08-07-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లు సక్రమంగానే సాగినప్పటికీ తరవాత మూలకు చేరింది. బోధకులు లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
ఇప్పటికైనా మార్పు వచ్చేనా!
[ 08-07-2024]
రామగుండం కార్పొరేషన్పై జిల్లా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో నగరపాలిక నిర్వహణ మెరుగు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
[ 08-07-2024]
ఒకవైపు నాలుగు వరుసల రహదారి, మరోవైపు ఆర్వోబీకి వెళ్లే ఎత్తైన రహదారి రెండింటిని ఇరుకైన కూడలి కలిపేయడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు కూడలి విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. -
భవిష్యత్తు ప్రణాళికలు.. ప్రత్యామ్నాయ పనులు
[ 08-07-2024]
మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ప్రత్యామ్నాయ ఫీడర్ల అనుసంధానం, విద్యుత్తు ఉపకేంద్రాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నారు. -
వసతి గృహాలను పట్టించుకోరా?
[ 08-07-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.