వామ్మో.. గుంతలు
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అసంపూర్తిగా రహదారులు, మురుగుకాలువలు
రాకపోకలకు తీవ్ర అవస్థలు
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
లక్ష్మీనగర్, రాఘవేంద్రనగర్ల మధ్య శిథిలమైన సీసీ రోడ్డు
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్మార్ట్సిటీ పరిధిలో లేని డివిజన్లలో అంతర్గత, విలీన కాలనీల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వర్షానికి నీరు నిండి గుంతల లోతు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఉండగా కనీసం మరమ్మతుకు నోచుకోవడం లేదనే అభిప్రాయముంది.
కట్టరాంపూర్ మీదుగా గిద్దెపెరుమాండ్లనగర్ వెళ్లే రహదారి పరిస్థితి..
తవ్వారు.. వదిలేశారు
నగర పరిధిలోని 60 డివిజన్లలో సుమారు 60 ప్రాంతాల్లో రహదారులు, మురుగుకాలువలు తవ్వి వదిలేశారు. ముఖ్యమంత్రి హామీ (సీఎంఏ) నిధులతో ప్రారంభించి.. ఏడు నెలలుగా ఆ పనులు పెండింగ్లో పెట్టారు. కంకర పోసి వదిలేయడంతో నడిచి వెళ్లే వాకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో ఇంటి ముందు ర్యాంపులు కట్టుకోకుండా వదిలేశారు. మరికొన్ని చోట్ల డ్రైనేజీలు నిర్మించి అనుసంధానం చేయకుండా వదిలేశారు. మురుగు, వరద నిలిచి రోడ్లపై ప్రవహిస్తోంది. పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పనులు పూర్తి చేసినట్లేయితే కనీసం ఈ వర్షాకాలంలో ఈ ప్రాంతాల్లో సమస్యలు దూరమయ్యేవి.
అశోక్నగర్లో రోడ్డుపై నిలిచిన నీరు
వీధులు బురదమయం..
శివారు కాలనీల్లో వర్షానికి మట్టి రహదారులు బురదమయంగా మారాయి. బీటీ, సీసీ రోడ్లు పలు కారణాలతో తవ్వడంతో అవి గుంతలు పడి నీరు నిలిచి ఉంటుంది. కట్టరాంపూర్, జీపీనగర్, అయోధ్యనగర్, రేకుర్తి, తీగలగుట్టపల్లి, అశోక్నగర్, సీతారాంపూర్, బాలాజీనగర్, హుస్సేనీపుర, లక్ష్మీనగర్, గాయత్రీనగర్, రాఘవేంద్రనగర్, కోతిరాంపూర్, సుభాష్నగర్, బోయవాడ, తిరుమల్నగర్, హనుమాన్నగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి.
రెడ్హిల్స్, అయోధ్యకాలనీలో అసంపూర్తిగా మురుగుకాలువల నిర్మాణం
వారంలో పనులు ప్రారంభం
నగర వ్యాప్తంగా తవ్వి వదిలేసిన రోడ్లు, డ్రైనేజీల పనులు పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారును ఆదేశించడం జరిగింది. వారం, పది రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయి. తద్వారా అత్యధిక ప్రాంతాల్లో కొంతమేర సమస్యలు దూరమవుతాయి.
వై.సునీల్రావు, మేయర్, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి కరుణ కొంతే!
[ 07-07-2024]
ఉమ్మడి జిల్లాను మేఘాలు ఊరిస్తున్నాయి. భారీ జల్లులు ఖాయమనే విధంగా ప్రతి రోజు ఆకాశం మురిపిస్తోంది. కారు మబ్బులతో మేఘావృతమైన నింగి అంతలోనే తేలిపోతోంది. మబ్బులు మాయమై.. చినుకుల జాడ దూరమవుతోంది. -
నూతన విధానం సఫలమయ్యేనా?
[ 07-07-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విద్యుత్తు బిల్లులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాధ్యమాలైన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, పేటీఎంల నుంచి చెల్లింపులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. -
హోటల్కెళ్తే.. బిర్యానీకే ఓటు
[ 07-07-2024]
నలుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోవాలన్నా.. ఒక సంస్థ ఉద్యోగులు.. రెస్టారెంటుకు వెళ్లినా.. కుటుంబమంతా వారాంతాలు బయటకు వెళ్లినా.. బిర్యానీకే ఓటు వేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు, ప్రత్యేక రోజుల్లోనూ ఆ వంటకం వండుతున్నారు. -
అవగాహనతోనే మహమ్మారికి అడ్డుకట్ట
[ 07-07-2024]
మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, అవగాహన లోపం.. తదితర కారణాలతో మహిళలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత, హార్మోన్ అసమతుల్యత(పీసీవోఎస్), పౌష్టికాహార లోపం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. -
అత్యవసర సేవలు అంతంతే!
[ 07-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్సుల నిర్వహణ పడకేసింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన అంబులెన్సుల ద్వారా ఉచిత సేవలందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
ఇలాగైతే నేల గుణం తెలిసేదెలా!
[ 07-07-2024]
డివిజన్ కేంద్రమైన మంథనిలో భూసార పరీక్ష కేంద్రం అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాల కోసం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1999 జనవరి 11న నాటి మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎల్లారెడ్డి చేతుల మీదుగా భూసార పరీక్ష కేందాన్ని ప్రారంభించారు. -
అయిదేళ్లలో అరకొర నిధులే..
[ 07-07-2024]
జిల్లా, మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు ఆశించిన మేర నిధులు రాక, తమ మండలాల్లో అనుకున్న పనులు చేపట్టలేక నైరాశ్యానికి గురయ్యారు. -
అభివృద్ధి పనుల పేరుతో మట్టి దందా
[ 07-07-2024]
కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేర పెద్దఎత్తున మట్టి దందాకు తెరతీశారు. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా అక్రమార్కులు అగ్రహారం గుట్టను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
టీ-నేతన్నకు దారేది?
[ 07-07-2024]
చేనేత, మరమగ్గాలపై వివిధ విభాగాల్లోని ఆసాములు, కార్మికుల వివరాల నమోదుకు ప్రభుత్వం టీ-నేతన్న యాప్ను తీసుకొచ్చింది. దీనిలో తరచూ సాంకేతిక సమస్యలతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. -
ఏళ్లు గడుస్తున్నా అధ్వానమే!
[ 07-07-2024]
కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకోనిగుట్టపైనున్న ప్రభుత్వ భూమిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 800 ఇళ్లు నిర్మించాలని కాలనీలను ఏర్పాటు చేసింది. సొంతిళ్లు లేని నిరుపేదలకు ప్లాట్లను కేటాయించడంతో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతోపాటు సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. -
గ్రామాల్లో మీసేవ కేంద్రాలు
[ 07-07-2024]
మహిళా శక్తి పేరిట స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేంద్రాలను విస్తరించనున్నారు. -
అతి వేగంతో చెట్టును ఢీ కొట్టిన కారు
[ 07-07-2024]
అజాగ్రత్త, అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఆవిష్కరణల ఒడి.. మారిన బడి
[ 07-07-2024]
ప్రభుత్వ పాఠశాల అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి చేశారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకే ఆసక్తి చూపని స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తల ఎత్తుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దారు.. -
జనన, మరణ ధ్రువపత్రాల జారీకి కొర్రీలు
[ 07-07-2024]
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. జిల్లా కేంద్రంలో పుట్టిన పిల్లలకు, గతంలో సర్టిఫికెట్లు తీసుకున్న వారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా తప్పులను సవరించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. -
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ!
[ 07-07-2024]
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.లక్షల విలువైన విడిభాగాలు మాయమయ్యాయి. గత నెల 7న స్టోర్కు తాళం వేసి సీల్ వేశారు. రెండ్రోజుల క్రితం తెరచి చూసే సరికి విడిభాగాలు కనిపించకుండా పోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
-
‘మీరు భలే ఉంటారు...’! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?