ఉపాధి ఛిద్రం.. కార్మికులు ఆగం
నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి.
ప్రభుత్వం చొరవ చూపితేనే భరోసా
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
మరమగ్గాలపై వస్త్రోత్పత్తులు
నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి. లేకుంటే పస్తులు అన్న చందంగా మారింది. కుటుంబ పోషణకు తోడు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మూణ్నెళ్లలో వివిధ కారణాలతో తొమ్మిది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో వారి కుటుంబాలు మరింత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి.
జిల్లాలో ఆరు చేనేత సహకార సంఘాలు ఉండగా, వాటిలో 74 మంది కార్మికులు పని చేస్తున్నారు. 30,352 మరమగ్గాలకు వివిధ రంగాల్లో 6,500 మంది కార్మికులున్నారు. చేనేత, మరమగ్గాలపై పని చేసే వారికి టీ నేతన్న యాప్లో హెల్త్కార్డులు వస్తున్నా వాటి వినియోగంపై స్పష్టత లేదు. గతంలో ఏదైన అనారోగ్య సమస్య తలెత్తి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందితే ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల వరకు తిరిగి చెల్లించేది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పొందే అవకాశం ఉన్నా చాలా మందికి తెల్ల రేషన్కార్డు లేదు. వీరు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గతేడాది ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా అప్పటి చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ ఆరోగ్య బీమాను రూ.25 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య బీమా పథకం ఊసేలేదని నేతన్నలు వాపోతున్నారు.
నేతన్న బీమా పథకంలో 60 మంది చేనేత, 4,644 మంది మరమగ్గాల కార్మికులు నమోదు చేసుకున్నారు. దీనిలో నమోదైన కార్మికులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బీమా డబ్బులు రూ.5 లక్షలు అందుతాయి. ఇటీవల కాలంలో తొమ్మిది మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకోగా వారిలో ఇద్దరు మాత్రమే బీమాకు అర్హులు. దీనిలో కొంత మంది వయసు పైబడినవారు ఉన్నారు. మరికొందరు నమోదు చేసుకోలేని వారు కూడా ఉన్నారు. నేత వృత్తిలో పని చేసేవారిలో ఎక్కువగా వయసు పైబడిన వారు ఉంటారు. దీనిలో వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచేలా గత ప్రభుత్వం మరమగ్గాల కార్పొరేషన్ ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. ఇది కార్యరూపం దాల్చలేదు. బీమా పథకం ప్రారంభమైన 2022 నుంచి ఇప్పటి వరకు 38 మంది నేతన్నలు మృతి చెందగా వారిలో 27 మందికి బీమా డబ్బులు అందాయి. 11 మందివి ఎల్ఐసీ పరిశీలనలో ఉన్నాయి.
చేనేత మిత్ర కింద త్రిఫ్ట్ ఫండ్ మనీ సేవింగ్ స్కీం (టీఎఫ్ఎంఎస్ఎస్) పేరుతో పొదుపు పథకం అమలవుతోంది. చేనేతలో నెలకు కార్మికులు రూ.వెయ్యి జమ చేస్తే ప్రభుత్వం రూ.2 వేలు కలుపుతుంది. అలాగే మరమగ్గాల్లో రూ.వెయ్యికి ప్రభుత్వం రూ.వెయ్యి జమ చేస్తుంది. 36 నెలల తర్వాత ఈ పథకంలో పూర్తి డబ్బులు పొందవచ్చు. జిల్లాలో 5,720 మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. కాగా 2023 జూన్ నుంచి ప్రభుత్వం తరఫున జమ కావాల్సిన నిధులు అందడం లేదు. దీంతో కార్మికులు అయోమయంలో పడ్డారు.
ప్రభుత్వం నుంచి జమ కావాలి
త్రిఫ్ట్ పథకంలో రెండేళ్లకు పైగా నా వంతు డబ్బులు బ్యాంకులో జమ చేస్తున్నాను. ప్రభుత్వం నుంచి జమ కావడం లేదు. నేత కార్మికుల సమస్యలపై దృష్టిసారించి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. హెల్త్కార్డులు ఇచ్చారు గానీ అవి ఎక్కడ ఉపయోగపడతాయో చెప్పడం లేదు.
వంగల శంకరయ్య, మరమగ్గాల కార్మికుడు, బీవైనగర్
ఉన్నతాధికారులకు తెలియజేశాం
నేత కార్మికుల త్రిఫ్ట్ ఫండ్ నిధులు జిల్లాకు రూ. 6.16 కోట్లు రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. త్వరలోనే జమ చేస్తామన్నారు.
సాగర్, ఏడీ, చేనేత, జౌళిశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి కరుణ కొంతే!
[ 07-07-2024]
ఉమ్మడి జిల్లాను మేఘాలు ఊరిస్తున్నాయి. భారీ జల్లులు ఖాయమనే విధంగా ప్రతి రోజు ఆకాశం మురిపిస్తోంది. కారు మబ్బులతో మేఘావృతమైన నింగి అంతలోనే తేలిపోతోంది. మబ్బులు మాయమై.. చినుకుల జాడ దూరమవుతోంది. -
నూతన విధానం సఫలమయ్యేనా?
[ 07-07-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విద్యుత్తు బిల్లులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాధ్యమాలైన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, పేటీఎంల నుంచి చెల్లింపులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. -
హోటల్కెళ్తే.. బిర్యానీకే ఓటు
[ 07-07-2024]
నలుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోవాలన్నా.. ఒక సంస్థ ఉద్యోగులు.. రెస్టారెంటుకు వెళ్లినా.. కుటుంబమంతా వారాంతాలు బయటకు వెళ్లినా.. బిర్యానీకే ఓటు వేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు, ప్రత్యేక రోజుల్లోనూ ఆ వంటకం వండుతున్నారు. -
అవగాహనతోనే మహమ్మారికి అడ్డుకట్ట
[ 07-07-2024]
మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, అవగాహన లోపం.. తదితర కారణాలతో మహిళలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత, హార్మోన్ అసమతుల్యత(పీసీవోఎస్), పౌష్టికాహార లోపం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. -
అత్యవసర సేవలు అంతంతే!
[ 07-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్సుల నిర్వహణ పడకేసింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన అంబులెన్సుల ద్వారా ఉచిత సేవలందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
ఇలాగైతే నేల గుణం తెలిసేదెలా!
[ 07-07-2024]
డివిజన్ కేంద్రమైన మంథనిలో భూసార పరీక్ష కేంద్రం అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాల కోసం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1999 జనవరి 11న నాటి మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎల్లారెడ్డి చేతుల మీదుగా భూసార పరీక్ష కేందాన్ని ప్రారంభించారు. -
అయిదేళ్లలో అరకొర నిధులే..
[ 07-07-2024]
జిల్లా, మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు ఆశించిన మేర నిధులు రాక, తమ మండలాల్లో అనుకున్న పనులు చేపట్టలేక నైరాశ్యానికి గురయ్యారు. -
అభివృద్ధి పనుల పేరుతో మట్టి దందా
[ 07-07-2024]
కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేర పెద్దఎత్తున మట్టి దందాకు తెరతీశారు. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా అక్రమార్కులు అగ్రహారం గుట్టను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
టీ-నేతన్నకు దారేది?
[ 07-07-2024]
చేనేత, మరమగ్గాలపై వివిధ విభాగాల్లోని ఆసాములు, కార్మికుల వివరాల నమోదుకు ప్రభుత్వం టీ-నేతన్న యాప్ను తీసుకొచ్చింది. దీనిలో తరచూ సాంకేతిక సమస్యలతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. -
ఏళ్లు గడుస్తున్నా అధ్వానమే!
[ 07-07-2024]
కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకోనిగుట్టపైనున్న ప్రభుత్వ భూమిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 800 ఇళ్లు నిర్మించాలని కాలనీలను ఏర్పాటు చేసింది. సొంతిళ్లు లేని నిరుపేదలకు ప్లాట్లను కేటాయించడంతో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతోపాటు సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. -
గ్రామాల్లో మీసేవ కేంద్రాలు
[ 07-07-2024]
మహిళా శక్తి పేరిట స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేంద్రాలను విస్తరించనున్నారు. -
అతి వేగంతో చెట్టును ఢీ కొట్టిన కారు
[ 07-07-2024]
అజాగ్రత్త, అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఆవిష్కరణల ఒడి.. మారిన బడి
[ 07-07-2024]
ప్రభుత్వ పాఠశాల అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి చేశారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకే ఆసక్తి చూపని స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తల ఎత్తుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దారు.. -
జనన, మరణ ధ్రువపత్రాల జారీకి కొర్రీలు
[ 07-07-2024]
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. జిల్లా కేంద్రంలో పుట్టిన పిల్లలకు, గతంలో సర్టిఫికెట్లు తీసుకున్న వారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా తప్పులను సవరించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. -
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ!
[ 07-07-2024]
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.లక్షల విలువైన విడిభాగాలు మాయమయ్యాయి. గత నెల 7న స్టోర్కు తాళం వేసి సీల్ వేశారు. రెండ్రోజుల క్రితం తెరచి చూసే సరికి విడిభాగాలు కనిపించకుండా పోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు