గుర్తింపునిచ్చారు.. నిధులు మరిచారు
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ). ఎన్క్వాస్ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు.
ఎన్క్వాస్ గుర్తింపు దక్కిన ఆరోగ్య కేంద్రాల పరిస్థితి
న్యూస్టుడే, వేములవాడ గ్రామీణం
ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్క్వాస్ బృందం (పాత చిత్రం)
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ). ఎన్క్వాస్ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు. ప్రహరీ నిర్మాణం ఇతర పనులు చేపట్టిన వాటికి రూ.4 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. కాగా ఈ పీహెచ్సీకి ఇటీవల ఎన్క్వాస్ గుర్తింపు దక్కింది. దీంతో ఏటా ఆసుపత్రి అభివృద్ధి కోసం ఏటా రూ. 3 లక్షల నిధులు జమకావాల్సి ఉంది. నిధులు జమైతే పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉంది.
జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి, వేములవాడలోని ఏరియా ఆసుపత్రితోపాటు హన్మాజీపేట, లింగన్నపేట, విలాసాగర్, బోయినపల్లి, కొదురుపాక, నేరెళ్ల, చీర్లవంచ, తంగళ్లపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కోనరావుపేట, చందుర్తి, పోత్గల్, ఇల్లంతకుంటలో ఇరవై నాలుగు గంటల పీహెచ్సీలు ఉన్నాయి. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సిరిసిల్లలోని బీవైనగర్, పీఎస్నగర్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందించే ఆరోగ్య కేంద్రాలను నేషనల్ హెల్త్ సిస్టిమ్ రిసోర్స్ సెంటర్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం ఆసుపత్రిలో సేవలను పరిశీలిస్తుంది. ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య కేంద్రం సేవలు ఉంటే నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్ (ఎన్క్వాస్) గుర్తింపు లభిస్తుంది. ఎన్క్వాస్ గుర్తింపు ప్రతి పీహెచ్సీకి దక్కాలన్న లక్ష్యంతో జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించారు. వీటితో ఫర్నిచర్, వార్డుల్లో వసతులు, పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణం తదితర పనులు చేపట్టారు.
సేవలకు...
జిల్లాలోని పలు పీహెచ్సీల్లో అందిస్తున్న సేవలకు ఎన్క్వాస్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో కేంద్ర బృందాలు వాటిని పరిశీలించాయి. ఆరు విభాగాల్లో ఎనిమిది అంశాలను చూశాయి. ఆరోగ్య కేంద్రంలో సేవలు, నిర్వహణ, రికార్డులు, ఓపీ, ఇన్పేషెంట్, ల్యాబ్, లేబర్ రూమ్, నేషనల్ హెల్త్ ప్రోగ్రాం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొన్నారు. జిల్లాలో కొదురుపాక, బోయినపల్లి, విలాసాగర్, తంగళ్లపల్లి, నేరెళ్ల, లింగన్నపేట, హన్మాజీపేట, సిరిసిల్ల, వేములవాడ, పీఎస్నగర్, కోనరావుపేట ఆసుపత్రులకు ఎన్క్వాస్ గుర్తింపు దక్కింది. వీటికి ఏటా రూ.3 లక్షల చొప్పున మూడేళ్లపాటు కేంద్రం నిధులు అందిస్తుంది. వీటిని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, పరికరాల కొనుగోలుకు వినియోగించవచ్చు. అయితే ఎన్క్వాస్ గుర్తింపు దక్కినప్పటికీ ఏ ఒక్క ఆరోగ్య కేంద్రానికి ఇప్పటి వరకు నిధులు జమ కాలేదు. కేవలం ప్రొసీడింగ్స్ మాత్రమే ఇచ్చారు. నిధులు జమ కాకపోవడంతో ఆసుపత్రుల్లో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం
ఎన్నికల నిర్వహణ, కోడ్ కారణంగా నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. ఎన్క్వాస్ ప్రోత్సాహకాలు అందించాల్సిందిగా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. నిధులు వస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. త్వరలో వస్తాయని భావిస్తున్నాం.
విద్యాసాగర్, జిల్లా హెల్త్ క్వాలిటీ మేనేజర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి కరుణ కొంతే!
[ 07-07-2024]
ఉమ్మడి జిల్లాను మేఘాలు ఊరిస్తున్నాయి. భారీ జల్లులు ఖాయమనే విధంగా ప్రతి రోజు ఆకాశం మురిపిస్తోంది. కారు మబ్బులతో మేఘావృతమైన నింగి అంతలోనే తేలిపోతోంది. మబ్బులు మాయమై.. చినుకుల జాడ దూరమవుతోంది. -
నూతన విధానం సఫలమయ్యేనా?
[ 07-07-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విద్యుత్తు బిల్లులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాధ్యమాలైన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, పేటీఎంల నుంచి చెల్లింపులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. -
హోటల్కెళ్తే.. బిర్యానీకే ఓటు
[ 07-07-2024]
నలుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోవాలన్నా.. ఒక సంస్థ ఉద్యోగులు.. రెస్టారెంటుకు వెళ్లినా.. కుటుంబమంతా వారాంతాలు బయటకు వెళ్లినా.. బిర్యానీకే ఓటు వేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు, ప్రత్యేక రోజుల్లోనూ ఆ వంటకం వండుతున్నారు. -
అవగాహనతోనే మహమ్మారికి అడ్డుకట్ట
[ 07-07-2024]
మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, అవగాహన లోపం.. తదితర కారణాలతో మహిళలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత, హార్మోన్ అసమతుల్యత(పీసీవోఎస్), పౌష్టికాహార లోపం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. -
అత్యవసర సేవలు అంతంతే!
[ 07-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్సుల నిర్వహణ పడకేసింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన అంబులెన్సుల ద్వారా ఉచిత సేవలందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
ఇలాగైతే నేల గుణం తెలిసేదెలా!
[ 07-07-2024]
డివిజన్ కేంద్రమైన మంథనిలో భూసార పరీక్ష కేంద్రం అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాల కోసం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1999 జనవరి 11న నాటి మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎల్లారెడ్డి చేతుల మీదుగా భూసార పరీక్ష కేందాన్ని ప్రారంభించారు. -
అయిదేళ్లలో అరకొర నిధులే..
[ 07-07-2024]
జిల్లా, మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు ఆశించిన మేర నిధులు రాక, తమ మండలాల్లో అనుకున్న పనులు చేపట్టలేక నైరాశ్యానికి గురయ్యారు. -
అభివృద్ధి పనుల పేరుతో మట్టి దందా
[ 07-07-2024]
కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేర పెద్దఎత్తున మట్టి దందాకు తెరతీశారు. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా అక్రమార్కులు అగ్రహారం గుట్టను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
టీ-నేతన్నకు దారేది?
[ 07-07-2024]
చేనేత, మరమగ్గాలపై వివిధ విభాగాల్లోని ఆసాములు, కార్మికుల వివరాల నమోదుకు ప్రభుత్వం టీ-నేతన్న యాప్ను తీసుకొచ్చింది. దీనిలో తరచూ సాంకేతిక సమస్యలతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. -
ఏళ్లు గడుస్తున్నా అధ్వానమే!
[ 07-07-2024]
కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకోనిగుట్టపైనున్న ప్రభుత్వ భూమిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 800 ఇళ్లు నిర్మించాలని కాలనీలను ఏర్పాటు చేసింది. సొంతిళ్లు లేని నిరుపేదలకు ప్లాట్లను కేటాయించడంతో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతోపాటు సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. -
గ్రామాల్లో మీసేవ కేంద్రాలు
[ 07-07-2024]
మహిళా శక్తి పేరిట స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేంద్రాలను విస్తరించనున్నారు. -
అతి వేగంతో చెట్టును ఢీ కొట్టిన కారు
[ 07-07-2024]
అజాగ్రత్త, అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఆవిష్కరణల ఒడి.. మారిన బడి
[ 07-07-2024]
ప్రభుత్వ పాఠశాల అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి చేశారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకే ఆసక్తి చూపని స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తల ఎత్తుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దారు.. -
జనన, మరణ ధ్రువపత్రాల జారీకి కొర్రీలు
[ 07-07-2024]
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. జిల్లా కేంద్రంలో పుట్టిన పిల్లలకు, గతంలో సర్టిఫికెట్లు తీసుకున్న వారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా తప్పులను సవరించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. -
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ!
[ 07-07-2024]
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.లక్షల విలువైన విడిభాగాలు మాయమయ్యాయి. గత నెల 7న స్టోర్కు తాళం వేసి సీల్ వేశారు. రెండ్రోజుల క్రితం తెరచి చూసే సరికి విడిభాగాలు కనిపించకుండా పోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..