అందని బిల్లులు.. చేసేదెలా పనులు!
గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
వేసవిలో తాగునీటి వనరులకు మరమ్మతు
నెలలు గడుస్తున్నా తప్పని నిరీక్షణ
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
చిత్రంలో కనిపిస్తోంది ఎలిగేడు మండలకేంద్రంలో తాగునీటి పైపులైన్ గేటువాల్వు. లీకేజీ మరమ్మతు కోసం గొయ్యి తవ్వారు. పనులు పూర్తయ్యాక కొత్త గేట్వాల్వ్ బిగించడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలిగాయి.
గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు దగ్గరుండి పనులు చేయించడంతో తాగునీటి సమస్య తొలగింది. అక్కడివరకు బాగానే ఉన్నా పనులు చేసి మూడు నెలలు గడుస్తున్నా బిల్లులు రాలేదు. గతంలో చేసిన పనుల్లో మళ్లీ లీకేజీలు ఏర్పడుతుండటంతో కలుషిత నీటి కష్టాలు తప్పడం లేదు.
171 పనులు.. రూ.1.83 కోట్లు
జిల్లాలోని 266 పంచాయతీల్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా మొత్తం 1,47,579 కనెక్షన్లున్నాయి. జిల్లావ్యాప్తంగా 171 పనులకు రూ.1.83 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పైపులైన్ల లీకేజీని అరికట్టడంతో పాటు వృథాగా ఉన్న చేతిపంపులను వినియోగంలోకి తీసుకొచ్చారు. తాగునీటి బావుల్లో పూడిక తొలగించారు. పాడయిన మోటార్లకు మరమ్మతు చేశారు. కొన్ని చోట్ల బోర్లను అద్దెకు తీసుకున్నారు. జిల్లా అధికారుల ఆదేశాలతో గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పాయి.
నిధుల కోసం వెదుకులాట
మూడు నెలల కిందట పనులు హడావుడిగా చేయడంతో లీకేజీ సమస్య మళ్లీ ఎదురవుతోంది. వానాకాలంలో లీకేజీలతో తాగునీరు కలుషితమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చేతిపంపులు మొరాయిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అనుమతి లేకుండానే పనులు చేశారు. దీంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపు లేక నిధుల కోసం వెదుక్కోవాల్సి వస్తోందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నయా పైసా రాలేదు
ధర్మారం: ఖిలావనపర్తిలో ఓఅండ్ఎం కింద అయిదు బోరుబావులను రూ.50 వేలకు పైగా వెచ్చించి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మరమ్మతు చేయించారు. పనులు పూర్తి చేసి రెండు నెలలవుతున్నా ఇప్పటికీ నయా పైసా రాలేదు. ఒక్క ఖిలావనపర్తే కాదు, మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. తాను రూ.1.20 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటికీ బిల్లులు రాలేదని మరో గ్రామ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా పంచాయతీ కార్యదర్శులకు బదిలీల ప్రక్రియ మొదలవనుండగా స్థాన చలనం కలిగితే పెట్టిన ఖర్చులు వస్తాయో లేదోనని కార్యదర్శులు వాపోతున్నారు.
అయిదు గ్రామాల్లో అప్పు తెచ్చి పనులు
కాల్వశ్రీరాంపూర్లో చేతి పంపునకు మరమ్మతు
కాల్వశ్రీరాంపూర్: ఓఅండ్ఎం(ఆపరేషనల్ మెయింటెనెన్స్) పథకం ద్వారా మండలంలోని పెద్దంపేట, ఇద్లాపూర్, మడిపల్లికాలనీ, అంకంపల్లి, చిన్నరాతుపల్లి గ్రామాలను ఎంపిక చేసి రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశారు. అయిదు గ్రామాల్లో అధికారులు అప్పు తెచ్చి మోటార్లు, పైపులైన్లు వేసి తాగునీరు సరఫరా చేయగా ఇప్పటివరకు బిల్లులు రాలేదని అధికారులు తెలిపారు.
ఎంబీ రికార్డులు సిద్ధం చేస్తున్నాం
జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. గుర్తించిన పనులను నాణ్యత ప్రమాణాలు పాటించి పకడ్బందీగా పూర్తి చేశాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరిగింది. పనుల ఆధారంగా ఎంబీ రికార్డులు సిద్ధం చేస్తున్నారు. పని విలువ ప్రకారం బిల్లులు మంజూరు చేస్తాం.
శ్రీనివాస్, మిషన్ భగీరథ(అంతర్గత విభాగం) ఈఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి కరుణ కొంతే!
[ 07-07-2024]
ఉమ్మడి జిల్లాను మేఘాలు ఊరిస్తున్నాయి. భారీ జల్లులు ఖాయమనే విధంగా ప్రతి రోజు ఆకాశం మురిపిస్తోంది. కారు మబ్బులతో మేఘావృతమైన నింగి అంతలోనే తేలిపోతోంది. మబ్బులు మాయమై.. చినుకుల జాడ దూరమవుతోంది. -
నూతన విధానం సఫలమయ్యేనా?
[ 07-07-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విద్యుత్తు బిల్లులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాధ్యమాలైన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, పేటీఎంల నుంచి చెల్లింపులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. -
హోటల్కెళ్తే.. బిర్యానీకే ఓటు
[ 07-07-2024]
నలుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోవాలన్నా.. ఒక సంస్థ ఉద్యోగులు.. రెస్టారెంటుకు వెళ్లినా.. కుటుంబమంతా వారాంతాలు బయటకు వెళ్లినా.. బిర్యానీకే ఓటు వేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు, ప్రత్యేక రోజుల్లోనూ ఆ వంటకం వండుతున్నారు. -
అవగాహనతోనే మహమ్మారికి అడ్డుకట్ట
[ 07-07-2024]
మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, అవగాహన లోపం.. తదితర కారణాలతో మహిళలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత, హార్మోన్ అసమతుల్యత(పీసీవోఎస్), పౌష్టికాహార లోపం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. -
అత్యవసర సేవలు అంతంతే!
[ 07-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్సుల నిర్వహణ పడకేసింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన అంబులెన్సుల ద్వారా ఉచిత సేవలందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
ఇలాగైతే నేల గుణం తెలిసేదెలా!
[ 07-07-2024]
డివిజన్ కేంద్రమైన మంథనిలో భూసార పరీక్ష కేంద్రం అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాల కోసం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1999 జనవరి 11న నాటి మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎల్లారెడ్డి చేతుల మీదుగా భూసార పరీక్ష కేందాన్ని ప్రారంభించారు. -
అయిదేళ్లలో అరకొర నిధులే..
[ 07-07-2024]
జిల్లా, మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు ఆశించిన మేర నిధులు రాక, తమ మండలాల్లో అనుకున్న పనులు చేపట్టలేక నైరాశ్యానికి గురయ్యారు. -
అభివృద్ధి పనుల పేరుతో మట్టి దందా
[ 07-07-2024]
కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేర పెద్దఎత్తున మట్టి దందాకు తెరతీశారు. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా అక్రమార్కులు అగ్రహారం గుట్టను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
టీ-నేతన్నకు దారేది?
[ 07-07-2024]
చేనేత, మరమగ్గాలపై వివిధ విభాగాల్లోని ఆసాములు, కార్మికుల వివరాల నమోదుకు ప్రభుత్వం టీ-నేతన్న యాప్ను తీసుకొచ్చింది. దీనిలో తరచూ సాంకేతిక సమస్యలతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. -
ఏళ్లు గడుస్తున్నా అధ్వానమే!
[ 07-07-2024]
కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకోనిగుట్టపైనున్న ప్రభుత్వ భూమిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 800 ఇళ్లు నిర్మించాలని కాలనీలను ఏర్పాటు చేసింది. సొంతిళ్లు లేని నిరుపేదలకు ప్లాట్లను కేటాయించడంతో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతోపాటు సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. -
గ్రామాల్లో మీసేవ కేంద్రాలు
[ 07-07-2024]
మహిళా శక్తి పేరిట స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేంద్రాలను విస్తరించనున్నారు. -
అతి వేగంతో చెట్టును ఢీ కొట్టిన కారు
[ 07-07-2024]
అజాగ్రత్త, అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఆవిష్కరణల ఒడి.. మారిన బడి
[ 07-07-2024]
ప్రభుత్వ పాఠశాల అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి చేశారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకే ఆసక్తి చూపని స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తల ఎత్తుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దారు.. -
జనన, మరణ ధ్రువపత్రాల జారీకి కొర్రీలు
[ 07-07-2024]
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. జిల్లా కేంద్రంలో పుట్టిన పిల్లలకు, గతంలో సర్టిఫికెట్లు తీసుకున్న వారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా తప్పులను సవరించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. -
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ!
[ 07-07-2024]
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.లక్షల విలువైన విడిభాగాలు మాయమయ్యాయి. గత నెల 7న స్టోర్కు తాళం వేసి సీల్ వేశారు. రెండ్రోజుల క్రితం తెరచి చూసే సరికి విడిభాగాలు కనిపించకుండా పోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?