నాణ్యత ప్రశ్నార్థకం!
మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి..
వరుసగా వంతెన గడ్డర్లు కూలడంపై విస్మయం
ఈనాడు, పెద్దపల్లి , న్యూస్టుడే, ముత్తారం
మానేరు వంతెనపై కూలిన గడ్డర్లు
మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి..
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామం, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామాలను అనుసంధానం చేస్తూ 2016 ఆగస్టు 4వ తేదీన రూ.47.40 కోట్ల అంచనాతో కిలోమీటర్ దూరం వంతెన నిర్మాణానికి అప్పటి రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఇతర ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మిస్తున్న క్రమంలోనే భారీ వరదలకు నిర్మాణ సామగ్రి దెబ్బతినడంతో రెండేళ్ల క్రితం గుత్తేదారు పియర్లపై గడ్డర్లను అనుసంధానం చేసే క్రమంలో అవి కూలిపోకుండా ఉండేందుకు చెక్క ముక్కలను పెట్టారు. వాటిని పూర్తి స్థాయిలో బిగించలేదు. మానేరు వాగు రెండేళ్లు భారీ వరదలతో ఉద్ధృతంగా ప్రవహించడంతో సపోర్టుగా ఉన్న చెక్కముక్కలు ధ్వంసమయ్యాయి. దీంతో గిడ్డర్లు పట్టు తప్పాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న మూడు గడ్డర్లు కుప్పకూలాయి. అప్పుడు విచారణ జరిపిన అధికారులు చెక్కముక్కల ధ్వంసమవడంతోనే గడ్డర్లు కూలాయని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు రావడంతో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. మంగళవారం మరోసారి అయిదు గడ్డర్లు నేలకూలాయి. రెండు సందర్భాల్లోనూ గాలి దుమారం బాగా వచ్చినప్పుడే కుప్పకూలాయని ఓడేడు గ్రామస్థులు పేర్కొంటుండగా గాలి దుమారానికి గడ్డర్లు కుప్పకూలే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. వాస్తవానికి కాంక్రీట్ గడ్డర్లు చాలా బరువు కలిగి ఉంటాయి. వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించాలంటే ఇవి బలోపేతంగా ఉంటేనే సాధ్యమవుతుంది. అలాంటి గడ్డర్లు పేకమేడల్లా కూలిపోవడం గమనార్హం. డిజైనింగ్ సరిగా ఉందా.. నిర్మాణానికి ముందు భూమి పరీక్ష చేశారా.. పనులు చేసే సమయంలో పర్యవేక్షణ సరిగా ఉందా.. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాంక్రీట్ బీమ్ సరిగా లేకే..
ఒక్కో గడ్డరు 130 టన్నుల బరువుతో ఉంటుంది. కిలోమీటర్ వంతెన నిర్మాణానికి 120 గడ్డర్లు అవసరమయ్యాయి. ఇందులో 58 వంతెనకు అనుసంధానించగా మిగిలిన 62 ఇంకా బిగించలేదు. ఏప్రిల్ 22, జులై 2న కూలిన గడ్డర్లు మొదటగా అనుసంధానించిన 58 గడ్డర్లలోనివి. కాంక్రీట్ బీమ్లు సరిగా వేయకపోవడంతోనే కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నాం. మిగతా గడ్డర్లు కూడా నిర్మించిన వెంటనే అనుసంధించకుండా వదిలేశారు. ఇవి కూడా కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో కూలిన గడ్డర్లకు గ్యాస్ వెల్డింగ్ వేసి వంతెనకు అనుసంధానించేందుకు ప్రయత్నించినా నిలవడం లేదు. ఈ పనులు చేసిన గుత్తేదారు పనులు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఆయన నుంచి జరిగిన నష్టం వసూలు చేస్తాం. మిగిలిన పనులు వేరే గుత్తేదారుకు అప్పగించి పనులు పూర్తి చేస్తాం. వంతెన పనులు పూర్తి స్థాయిలో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం.
జాఫర్, డీఈ, ఆర్అండ్బీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి కరుణ కొంతే!
[ 07-07-2024]
ఉమ్మడి జిల్లాను మేఘాలు ఊరిస్తున్నాయి. భారీ జల్లులు ఖాయమనే విధంగా ప్రతి రోజు ఆకాశం మురిపిస్తోంది. కారు మబ్బులతో మేఘావృతమైన నింగి అంతలోనే తేలిపోతోంది. మబ్బులు మాయమై.. చినుకుల జాడ దూరమవుతోంది. -
నూతన విధానం సఫలమయ్యేనా?
[ 07-07-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విద్యుత్తు బిల్లులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాధ్యమాలైన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, పేటీఎంల నుంచి చెల్లింపులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. -
హోటల్కెళ్తే.. బిర్యానీకే ఓటు
[ 07-07-2024]
నలుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోవాలన్నా.. ఒక సంస్థ ఉద్యోగులు.. రెస్టారెంటుకు వెళ్లినా.. కుటుంబమంతా వారాంతాలు బయటకు వెళ్లినా.. బిర్యానీకే ఓటు వేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు, ప్రత్యేక రోజుల్లోనూ ఆ వంటకం వండుతున్నారు. -
అవగాహనతోనే మహమ్మారికి అడ్డుకట్ట
[ 07-07-2024]
మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, అవగాహన లోపం.. తదితర కారణాలతో మహిళలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత, హార్మోన్ అసమతుల్యత(పీసీవోఎస్), పౌష్టికాహార లోపం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. -
అత్యవసర సేవలు అంతంతే!
[ 07-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్సుల నిర్వహణ పడకేసింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన అంబులెన్సుల ద్వారా ఉచిత సేవలందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
ఇలాగైతే నేల గుణం తెలిసేదెలా!
[ 07-07-2024]
డివిజన్ కేంద్రమైన మంథనిలో భూసార పరీక్ష కేంద్రం అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాల కోసం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1999 జనవరి 11న నాటి మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎల్లారెడ్డి చేతుల మీదుగా భూసార పరీక్ష కేందాన్ని ప్రారంభించారు. -
అయిదేళ్లలో అరకొర నిధులే..
[ 07-07-2024]
జిల్లా, మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు ఆశించిన మేర నిధులు రాక, తమ మండలాల్లో అనుకున్న పనులు చేపట్టలేక నైరాశ్యానికి గురయ్యారు. -
అభివృద్ధి పనుల పేరుతో మట్టి దందా
[ 07-07-2024]
కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేర పెద్దఎత్తున మట్టి దందాకు తెరతీశారు. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా అక్రమార్కులు అగ్రహారం గుట్టను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
టీ-నేతన్నకు దారేది?
[ 07-07-2024]
చేనేత, మరమగ్గాలపై వివిధ విభాగాల్లోని ఆసాములు, కార్మికుల వివరాల నమోదుకు ప్రభుత్వం టీ-నేతన్న యాప్ను తీసుకొచ్చింది. దీనిలో తరచూ సాంకేతిక సమస్యలతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. -
ఏళ్లు గడుస్తున్నా అధ్వానమే!
[ 07-07-2024]
కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకోనిగుట్టపైనున్న ప్రభుత్వ భూమిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 800 ఇళ్లు నిర్మించాలని కాలనీలను ఏర్పాటు చేసింది. సొంతిళ్లు లేని నిరుపేదలకు ప్లాట్లను కేటాయించడంతో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతోపాటు సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. -
గ్రామాల్లో మీసేవ కేంద్రాలు
[ 07-07-2024]
మహిళా శక్తి పేరిట స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేంద్రాలను విస్తరించనున్నారు. -
అతి వేగంతో చెట్టును ఢీ కొట్టిన కారు
[ 07-07-2024]
అజాగ్రత్త, అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఆవిష్కరణల ఒడి.. మారిన బడి
[ 07-07-2024]
ప్రభుత్వ పాఠశాల అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి చేశారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకే ఆసక్తి చూపని స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తల ఎత్తుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దారు.. -
జనన, మరణ ధ్రువపత్రాల జారీకి కొర్రీలు
[ 07-07-2024]
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. జిల్లా కేంద్రంలో పుట్టిన పిల్లలకు, గతంలో సర్టిఫికెట్లు తీసుకున్న వారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా తప్పులను సవరించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. -
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ!
[ 07-07-2024]
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.లక్షల విలువైన విడిభాగాలు మాయమయ్యాయి. గత నెల 7న స్టోర్కు తాళం వేసి సీల్ వేశారు. రెండ్రోజుల క్రితం తెరచి చూసే సరికి విడిభాగాలు కనిపించకుండా పోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్