ఉపకార వేతనాల సాధనలో విద్యార్థుల ప్రతిభ
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) నిర్వహిస్తోంది.
న్యూస్టుడే, మార్కండేయకాలనీ
రామగుండం ఆదర్శ పాఠశాల
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు దీనికి అర్హులు.. ఈ పరీక్షలో రాణించిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందజేస్తోంది. ఉమ్మడి జిల్లాలోనే రామగుండం లింగాపూర్లోని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం అత్యుత్తమ మార్కులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయులు ఎన్ఎంఎంఎస్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ఉపకార వేతనం సాధించేలా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
అర్హతలు... పరీక్ష విధానం
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించే ఉపకారవేతన పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.. వీరు ఏడో తరగతిలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.50, ఇతరులు రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. తదుపరి అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనిని ఏటా నవంబరు మాసంలో నిర్వహిస్తారు. జిల్లా యూనిట్గా, కేటగిరీల వారీగా, ప్రతిభ కొలమానంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏటా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఈ అర్హత పరీక్ష రాసేలా ప్రోత్సహిస్తున్నారు.
ఆదర్శ పాఠశాల నుంచి ఎంపికైన విద్యార్థులు
2022-2023 : 19
2021-2022 : 23
2023-2024 : 17
ఎంతో సంతోషంగా ఉంది
నేను రామగుండం మోడల్ పాఠశాలలో ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసి అత్యుత్తమ మార్కులు సాధించా. సీనియర్ల సలహాలు, సూచనలతో నిత్యం చదువుపై దృష్టి సారించా. ఉపాధ్యాయుల మార్గదర్శనంలో నమూనా ప్రశ్నపత్రాలతో నిత్యం సాధన చేశా. నా కష్టానికి ఫలితం దక్కింది. ఉపకార వేతనం పొందేందుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
చిట్టోజు అన్విత, తొమ్మిదో తరగతి
ఉపాధ్యాయుల శిక్షణ బాగుంది
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించా. ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ ఇందుకు ఎంతగానో దోహదపడింది. ఉపాధ్యాయుల చొరవతో ఆన్లైన్ తరగతుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించా. అనుకున్న విధంగా మంచి ర్యాంకు సాధించి ఉపకార వేతనానికి ఎంపికయ్యా. పాఠశాలలో ప్రత్యక్ష బోధనతో పాటు అంతర్జాలంలో కూడా ప్రతి అంశాన్ని వివరించారు.
ఎం.చక్రిక, తొమ్మిదో తరగతి
సమష్టి కృషితో...
ఈ విద్యా సంవత్సరం రామగుండం మోడల్ పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు ఎంపికయ్యారు. విద్యార్థులను రీజనింగ్, నెంబరు సిరీస్ ఇతర అంశాలపై నిత్యం సన్నద్ధం చేయించాము. సాంఘిక, సామాన్య, గణితంపై ఇతర ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇచ్చాము. ప్రతి ఏటా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉపకార వేతనాలకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల సమష్టి కృషితో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
ముత్యం రాజశేఖర్, ఆంగ్ల ఉపాధ్యాయులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి కరుణ కొంతే!
[ 07-07-2024]
ఉమ్మడి జిల్లాను మేఘాలు ఊరిస్తున్నాయి. భారీ జల్లులు ఖాయమనే విధంగా ప్రతి రోజు ఆకాశం మురిపిస్తోంది. కారు మబ్బులతో మేఘావృతమైన నింగి అంతలోనే తేలిపోతోంది. మబ్బులు మాయమై.. చినుకుల జాడ దూరమవుతోంది. -
నూతన విధానం సఫలమయ్యేనా?
[ 07-07-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విద్యుత్తు బిల్లులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాధ్యమాలైన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, పేటీఎంల నుంచి చెల్లింపులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. -
హోటల్కెళ్తే.. బిర్యానీకే ఓటు
[ 07-07-2024]
నలుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోవాలన్నా.. ఒక సంస్థ ఉద్యోగులు.. రెస్టారెంటుకు వెళ్లినా.. కుటుంబమంతా వారాంతాలు బయటకు వెళ్లినా.. బిర్యానీకే ఓటు వేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు, ప్రత్యేక రోజుల్లోనూ ఆ వంటకం వండుతున్నారు. -
అవగాహనతోనే మహమ్మారికి అడ్డుకట్ట
[ 07-07-2024]
మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, అవగాహన లోపం.. తదితర కారణాలతో మహిళలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత, హార్మోన్ అసమతుల్యత(పీసీవోఎస్), పౌష్టికాహార లోపం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. -
అత్యవసర సేవలు అంతంతే!
[ 07-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్సుల నిర్వహణ పడకేసింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన అంబులెన్సుల ద్వారా ఉచిత సేవలందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
ఇలాగైతే నేల గుణం తెలిసేదెలా!
[ 07-07-2024]
డివిజన్ కేంద్రమైన మంథనిలో భూసార పరీక్ష కేంద్రం అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాల కోసం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1999 జనవరి 11న నాటి మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎల్లారెడ్డి చేతుల మీదుగా భూసార పరీక్ష కేందాన్ని ప్రారంభించారు. -
అయిదేళ్లలో అరకొర నిధులే..
[ 07-07-2024]
జిల్లా, మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు ఆశించిన మేర నిధులు రాక, తమ మండలాల్లో అనుకున్న పనులు చేపట్టలేక నైరాశ్యానికి గురయ్యారు. -
అభివృద్ధి పనుల పేరుతో మట్టి దందా
[ 07-07-2024]
కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేర పెద్దఎత్తున మట్టి దందాకు తెరతీశారు. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా అక్రమార్కులు అగ్రహారం గుట్టను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
టీ-నేతన్నకు దారేది?
[ 07-07-2024]
చేనేత, మరమగ్గాలపై వివిధ విభాగాల్లోని ఆసాములు, కార్మికుల వివరాల నమోదుకు ప్రభుత్వం టీ-నేతన్న యాప్ను తీసుకొచ్చింది. దీనిలో తరచూ సాంకేతిక సమస్యలతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. -
ఏళ్లు గడుస్తున్నా అధ్వానమే!
[ 07-07-2024]
కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకోనిగుట్టపైనున్న ప్రభుత్వ భూమిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 800 ఇళ్లు నిర్మించాలని కాలనీలను ఏర్పాటు చేసింది. సొంతిళ్లు లేని నిరుపేదలకు ప్లాట్లను కేటాయించడంతో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతోపాటు సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. -
గ్రామాల్లో మీసేవ కేంద్రాలు
[ 07-07-2024]
మహిళా శక్తి పేరిట స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేంద్రాలను విస్తరించనున్నారు. -
అతి వేగంతో చెట్టును ఢీ కొట్టిన కారు
[ 07-07-2024]
అజాగ్రత్త, అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఆవిష్కరణల ఒడి.. మారిన బడి
[ 07-07-2024]
ప్రభుత్వ పాఠశాల అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి చేశారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకే ఆసక్తి చూపని స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తల ఎత్తుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దారు.. -
జనన, మరణ ధ్రువపత్రాల జారీకి కొర్రీలు
[ 07-07-2024]
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. జిల్లా కేంద్రంలో పుట్టిన పిల్లలకు, గతంలో సర్టిఫికెట్లు తీసుకున్న వారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా తప్పులను సవరించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. -
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ!
[ 07-07-2024]
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.లక్షల విలువైన విడిభాగాలు మాయమయ్యాయి. గత నెల 7న స్టోర్కు తాళం వేసి సీల్ వేశారు. రెండ్రోజుల క్రితం తెరచి చూసే సరికి విడిభాగాలు కనిపించకుండా పోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు
-
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
-
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది