శరవేగంగా రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
రామగుండం రైల్వే స్టేషన్ సుందరంగా మారనుంది. అమృత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు.
రామగుండం రైల్వే స్టేషన్ సుందరంగా మారనుంది. అమృత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. స్టేషన్ ముందు భాగంలో ఆకర్షణీయమైన ఎలివేషన్తో పాటు ప్రయాణికులు వాహనాలను నిలుపుకోవడానికి ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్ఫాంపైకి చేరుకునేందుకు లిఫ్టు సౌకర్యంతో పాటు ముందు భాగంలో పాదచారులు లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక దారిని ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ ఎదుట ఎలాంటి ఇతర నిర్మాణాలు ఉండకుండా ముందుగానే తొలగించారు. మొదటి దశ పనుల్లో తెలంగాణ వ్యాప్తంగా 21 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేపడుతున్నారు. ఇందులో రామగుండంతో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉంది. అమృత్ పథకంలో భాగంగా మొదటి దశలో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. దీంతో అధికారులు ఆయా పనులను శరవేగంగా చేపడుతున్నారు. ప్రయాణికులు కూర్చునేందుకు విశాలమైన ఆవరణతో పాటు టికెట్ బుకింగ్ కేంద్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఆయా పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం ఇటీవల సందర్శించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కాజీపేట-బల్లార్ష మార్గంలో అధిక ఆదాయం వస్తున్న స్టేషన్లలో రామగుండం ఒకటి. ఈ ప్రాంతం నుంచే ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణికులు ఉండటంతో అందుకు అనుగుణంగా రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
న్యూస్టుడే, గోదావరిఖని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విలువల బోధనతో మనస్సులో సుస్థిరం
[ 06-07-2024]
ఒక్కో జిల్లాలో వేలమంది ఉపాధ్యాయులు ఉంటారు.. బదిలీలు వారి ఉద్యోగ జీవితంలో సహజం.. కొందరికి మాత్రమే విద్యార్థుల నుంచి ఇలాంటి ఆత్మీయత అందుతోంది.. -
పల్లె పాలన సాగేదెలా!
[ 06-07-2024]
ఉమ్మడి జిల్లా పంచాయతీలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. -
ప్రభుత్వ నిర్ణయం.. చేనేత కార్మికులకు శాపం
[ 06-07-2024]
నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న చేనేత సహకార సంఘం మూతపడటంతో కార్మికుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. -
భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం
[ 06-07-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి నిరంతరం కాళేశ్వరం జలాలను సరఫరా చేసి నీటి ఎద్దడిని నివారించేందుకు నిర్మిస్తున్న నీటి పథకం నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. -
పట్టణ ప్రకృతి వనాలు.. బోర్డులకే పరిమితం
[ 06-07-2024]
‘తెలంగాణకు హరితహారం.. డివిజన్కో ఉద్యానవనం’ పేరిట సుమారు మూడున్నరేళ్ల క్రితం రామగుండం నగరపాలక సుమారు రూ.కోటి వ్యయంతో చేపట్టిన పనులు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. -
పట్టణ ప్రజలకు ఆహ్లాదం
[ 06-07-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలో రోజు రోజుకు పెరుగుతున్న పట్టణ జనాభాకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలకు రూపకల్పన చేసింది. -
పనుల్లో జాప్యం.. వర్షాకాలంలో తప్పని ఇబ్బందులు
[ 06-07-2024]
లోలెవల్ కల్వర్టు వద్ద హైలెవల్ వంతెన నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
టీకా వేయిస్తున్నారా?
[ 06-07-2024]
జంతువుల నుంచి సంక్రమించే వైరస్ నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ వినియోగం తప్పనిసరి. దాన్ని విస్మరించడంతో కుక్కలు, కోతుల కాటుతో ప్రమాదం పొంచి ఉంది. -
కోడెలకు మోక్షం.. అన్నదాతకు ఉచితం
[ 06-07-2024]
రాజన్న కోడెలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గత ఆరు నెలలుగా రాజన్న గోశాలలో సామర్థ్యానికి మించి ఉండటం, వివిధ కారణాలతో తరచూ మృతి చెందుతుండటం వంటి ఘటనలు విమర్శలకు తావిస్తోంది. -
పోలీసులు చిత్రహింసలు పెట్టారు
[ 06-07-2024]
గొర్రెల చోరీ కేసులో రామడుగు ఠాణా ఎస్సై, పోలీసుల తీరుపై మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)కు ఫిర్యాదు వెళ్లింది.. పోలీసులు చిత్రహింసలు పెట్టారని.. అరికాళ్లపై బెల్టుతో విచక్షణ లేకుండా కొట్టారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
14 ఏళ్లకు.. నాన్న చెంతకు!
[ 06-07-2024]
అతడి క్షణికావేశానికి కట్టుకున్న భార్య బలైంది. ఇద్దరి బిడ్డల్ని ఏకంగా పద్నాలుగేళ్లపాటు దూరం చేసింది. -
తెలుగు కళాశాల పునరుద్ధరణకు ఉత్తర్వులు
[ 06-07-2024]
దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మినరసింహ సంస్కృతాంధ్ర కళాశాలను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిందని, త్వరలోనే ఈ కళాశాల ప్రారంభమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ పేర్కొన్నారు. -
అనిశాకు చిక్కిన డీసీఎంఎస్ మేనేజర్, క్యాషియర్ సస్పెన్షన్
[ 06-07-2024]
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు గురువారం పట్టుబడిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వర్రావు, ఆయనకు సహకరించిన క్యాషియర్ కుమారస్వామిగౌడ్ను సస్పెండ్ చేస్తూ డీసీఎంఎస్ ఛైర్మన్ శ్రీకాంత్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. మరో ముగ్గురి అరెస్టు
-
భారాసకు షాక్.. కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే
-
ఉత్తరాఖండ్లో కొండచరియల బీభత్సం.. ఇద్దరు హైదరాబాదీల మృతి
-
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు
-
కేరళలో ‘మెదడును తినే అమీబా’.. మరో కేసు నమోదు
-
ఎన్నో హెచ్చుతగ్గులు చూశా.. నన్ను గేలిచేశారు: మోదీతో హార్దిక్ పాండ్య