కుటుంబ కలహాలతో సైజింగ్ కార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్లలోని బీవైనగర్కు చెందిన సైజింగ్ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్కు చెందిన పల్లె యాదగిరిగౌడ్ సైజింగ్ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
పల్లె యాదగిరి
సిరిసిల్ల గ్రామీణం, న్యూస్టుడే: సిరిసిల్లలోని బీవైనగర్కు చెందిన సైజింగ్ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్కు చెందిన పల్లె యాదగిరిగౌడ్ సైజింగ్ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఇంట్లో గొడవల కారణంగా అతని భార్య తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై వారం రోజుల కిందట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డాడు. ఈక్రమంలోనే మళ్లీ బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య మంజుల, కూతుర్లు లహరి, నిహారిక ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్న కుమార్తె హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘుపతి తెలిపారు.
చర్లపల్లి జైలు నుంచి ఖైదీల విడుదల
కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే: హత్యా నేరం కేసుల్లో 14 సంవత్సరాలు శిక్ష అనుభవించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరుగురు ఖైదీలు బుధవారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. వీరిలో గంభీరావుపేట గజసింగవరానికి చెందిన తండ్రి, అతడి ఇద్దరు కుమారులతోపాటు కరీంనగర్ భగత్నగర్కు చెందిన ఒకరు, గోదావరిఖని అశోక్నగర్కు చెందిన ఒకరు, రాయికల్ మండలం గుడికోట ప్రాంతానికి చెందిన మరొకరు ఉన్నారు. గవర్నర్ క్షమాభిక్ష ఆమోదించడంతో మంగళవారం ఆరుగురిని చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడి నుంచి అధికారికంగా విడుదలయ్యారు.
తప్పు తెలుసుకున్నాం.. కొత్త జీవితం ప్రారంభిస్తాం..
ఈనాడు- హైదరాబాద్ : క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. జైలు అధికారుల సాయంతో నైపుణ్యాలకు సానబెట్టుకున్నారు. మానసిక నిపుణుల సూచనలతో చేసిన తప్పు తెలుసుకున్నారు. జీవితాంతం కారాగారవాసం అనుభవించాల్సి వారికి రాష్ట్ర ప్రభుత్వం రెక్కలు తొడిగింది. సత్ప్రవర్తనతో నడుచుకుంటున్న 213 మంది ఖైదీలను బుధవారం విడుదల చేసింది. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన ఖైదీలను ‘ఈనాడు’ పలకరించింది.
జైలుకొచ్చాక జీవితమంటే తెలిసింది
కె.రాజేశ్, కరీంనగర్
‘ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయితో సంతోషంగా ఉండేవాణ్ని. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో జీవితకాలం శిక్ష పడింది. 15 ఏళ్ల క్రితం జైలుకొచ్చా. ఇక్కడికొచ్చాక జీవితం విలువ అర్థమైంది. క్రమశిక్షణతో ఉంటూ పెట్రోలు బంకులో పని చేశా. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేయాలని ఆదేశించడం, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరో తప్పు జరగకుండా చూసుకుంటా. రెండో జీవితాన్ని క్రమశిక్షణతో.. పిల్లలతో గడుపుతా’.
దొరకని రాయికల్ ఎస్సై ఆచూకీ
జగిత్యాల, న్యూస్టుడే: ఏసీబీ అధికారుల దాడితో పరారైన రాయికల్ ఎస్సై అజయ్ ఆచూకీ లభించలేదు. జగిత్యాల జిల్లా రాయికల్ ఠాణా ఎస్సైగా పనిచేస్తున్న టి.అజయ్ జూన్ 11న పట్టుకున్న ఇసుక ట్రాక్టరు విడిపించేందుకు బాధితుడు రాజేందర్రెడ్డిని డబ్బులు డిమాండ్ చేయగా ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. జూన్ 21న రాత్రి ఏసీబీ అధికారులు ఇటిక్యాలకు చెందిన మధ్యవర్తి పుల్లూరి రాజుకు రాజేందర్రెడ్డి రూ.10 వేలు ఇస్తుండగా పట్టుకుని రిమాండ్కు తరలించారు. అధికారుల రాకతో పారిపోయిన రాయికల్ ఎస్సై 13 రోజులుగా పరారీలోనే ఉన్నారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ ఎస్సై అజయ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం ఉందని, ఏసీబీ కేసులో ముందస్తు బెయిలు దొరకడం కష్టమని ఎట్టి పరిస్థితుల్లోనైనా లొంగిపోవాల్సిందేనని అన్నారు. ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి కరుణ కొంతే!
[ 07-07-2024]
ఉమ్మడి జిల్లాను మేఘాలు ఊరిస్తున్నాయి. భారీ జల్లులు ఖాయమనే విధంగా ప్రతి రోజు ఆకాశం మురిపిస్తోంది. కారు మబ్బులతో మేఘావృతమైన నింగి అంతలోనే తేలిపోతోంది. మబ్బులు మాయమై.. చినుకుల జాడ దూరమవుతోంది. -
నూతన విధానం సఫలమయ్యేనా?
[ 07-07-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విద్యుత్తు బిల్లులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాధ్యమాలైన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, పేటీఎంల నుంచి చెల్లింపులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. -
హోటల్కెళ్తే.. బిర్యానీకే ఓటు
[ 07-07-2024]
నలుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోవాలన్నా.. ఒక సంస్థ ఉద్యోగులు.. రెస్టారెంటుకు వెళ్లినా.. కుటుంబమంతా వారాంతాలు బయటకు వెళ్లినా.. బిర్యానీకే ఓటు వేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు, ప్రత్యేక రోజుల్లోనూ ఆ వంటకం వండుతున్నారు. -
అవగాహనతోనే మహమ్మారికి అడ్డుకట్ట
[ 07-07-2024]
మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, అవగాహన లోపం.. తదితర కారణాలతో మహిళలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత, హార్మోన్ అసమతుల్యత(పీసీవోఎస్), పౌష్టికాహార లోపం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. -
అత్యవసర సేవలు అంతంతే!
[ 07-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్సుల నిర్వహణ పడకేసింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన అంబులెన్సుల ద్వారా ఉచిత సేవలందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
ఇలాగైతే నేల గుణం తెలిసేదెలా!
[ 07-07-2024]
డివిజన్ కేంద్రమైన మంథనిలో భూసార పరీక్ష కేంద్రం అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాల కోసం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1999 జనవరి 11న నాటి మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎల్లారెడ్డి చేతుల మీదుగా భూసార పరీక్ష కేందాన్ని ప్రారంభించారు. -
అయిదేళ్లలో అరకొర నిధులే..
[ 07-07-2024]
జిల్లా, మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు ఆశించిన మేర నిధులు రాక, తమ మండలాల్లో అనుకున్న పనులు చేపట్టలేక నైరాశ్యానికి గురయ్యారు. -
అభివృద్ధి పనుల పేరుతో మట్టి దందా
[ 07-07-2024]
కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేర పెద్దఎత్తున మట్టి దందాకు తెరతీశారు. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా అక్రమార్కులు అగ్రహారం గుట్టను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
టీ-నేతన్నకు దారేది?
[ 07-07-2024]
చేనేత, మరమగ్గాలపై వివిధ విభాగాల్లోని ఆసాములు, కార్మికుల వివరాల నమోదుకు ప్రభుత్వం టీ-నేతన్న యాప్ను తీసుకొచ్చింది. దీనిలో తరచూ సాంకేతిక సమస్యలతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. -
ఏళ్లు గడుస్తున్నా అధ్వానమే!
[ 07-07-2024]
కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకోనిగుట్టపైనున్న ప్రభుత్వ భూమిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 800 ఇళ్లు నిర్మించాలని కాలనీలను ఏర్పాటు చేసింది. సొంతిళ్లు లేని నిరుపేదలకు ప్లాట్లను కేటాయించడంతో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతోపాటు సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. -
గ్రామాల్లో మీసేవ కేంద్రాలు
[ 07-07-2024]
మహిళా శక్తి పేరిట స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేంద్రాలను విస్తరించనున్నారు. -
అతి వేగంతో చెట్టును ఢీ కొట్టిన కారు
[ 07-07-2024]
అజాగ్రత్త, అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఆవిష్కరణల ఒడి.. మారిన బడి
[ 07-07-2024]
ప్రభుత్వ పాఠశాల అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి చేశారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకే ఆసక్తి చూపని స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తల ఎత్తుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దారు.. -
జనన, మరణ ధ్రువపత్రాల జారీకి కొర్రీలు
[ 07-07-2024]
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. జిల్లా కేంద్రంలో పుట్టిన పిల్లలకు, గతంలో సర్టిఫికెట్లు తీసుకున్న వారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా తప్పులను సవరించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. -
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ!
[ 07-07-2024]
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.లక్షల విలువైన విడిభాగాలు మాయమయ్యాయి. గత నెల 7న స్టోర్కు తాళం వేసి సీల్ వేశారు. రెండ్రోజుల క్రితం తెరచి చూసే సరికి విడిభాగాలు కనిపించకుండా పోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గుడివాడలో క్షుద్రపూజల కలకలం
-
భారమనుకుని నేలకేసి బాది.. ఏడాదిన్నర పసివాడిని పొట్టన పెట్టుకున్న కర్కశుడు
-
రూ.కోటి విలువచేసే ఫ్లాటు.. ఆడీ కారు.. పోలీసులకు చిక్కిన దర్జాదొంగ
-
వయసు 57.. సెంచరీలు 1000
-
ఏపీలోని ఆ ఐదు గ్రామాలు.. మళ్లీ భద్రాచలంలో కలిసేనా..?
-
నా హత్యకు కుట్ర.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు