మొక్కుబడి నిధులు.. విధులు
జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి.
అయిదేళ్ల కాలంలో ఫలితాలు అంతంత మాత్రమే
నేటితో ముగియనున్న జడ్పీ పాలకవర్గాల పదవీకాలం
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం
జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి. గ్రామ, మండల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయికి తీసుకెళ్లాలంటే జిల్లా పరిషత్తు సమావేశాలు వేదికగా ఉంటాయి. కాని ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదని పలువురు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. నేటితో జిల్లా మండల, పరిషత్తుల పాలకవర్గాల గడువు ముగియనుంది.
సభ్యులు ఇలా..
జిల్లా పరిషత్తులో జడ్పీటీసీ సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. మండల పరిషత్తు అధ్యక్షులు ఆహ్వానిత సభ్యులు, లోకసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదం తెలిపిన రాజ్యసభ సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, సుడా ఛైర్మన్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, డీసీఎంఎస్, డైరీ ఛైర్మన్లు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. స్థాయీ సంఘాల్లో మాత్రం జడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రమే సభ్యులుగా ఉంటారు.
ఎవరెవరు..?
జిల్లాలో కరీంనగర్, హజూరాబాద్, హుస్నాబాద్, మానకొండూరు, చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ ఎంపీ, పట్టభద్రులు, ఉపాధ్యాయులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు జడ్పీ సభ్యులుగా ఉన్నారు.
చట్టసభల ప్రతినిధులతో ఎంతో మేలు
జడ్పీ సమావేశాల్లో జిల్లా సమస్యలు చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సమావేశాలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైతే నిధులు సాధించడానికి వీలవుతుంది. కానీ గత అయిదేళ్ల కాలం పరిశీలిస్తే ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధుల్లో కొందరు ఒక్కసారి కూడా హాజరు కాకపోగా.. మరికొందరు ఒకటి, రెండు సమావేశాలకు మొక్కుబడిగా హాజరయ్యారు. ఇప్పటికీ జిల్లా పరిషత్తు 15వ ఆర్థిక సంఘం 2023-24కు సంబంధించి ఒక విడత, 2024-25 రెండు విడుతల నిధులు రాలేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరైతే క్షేత్రస్థాయిలో సమస్యలు పూర్తిగా అవగతమై నిధుల విడుదలకు కృషి చేసేందుకు అవకాశముంటుంది కానీ.. సరిగా హాజరు కాకపోవడం, ప్రభుత్వం నుంచి నిధులు సరిగా రాకపోవడంతో గత అయిదేళ్ల జడ్పీ సమావేశాలు మొక్కుబడిగా సాగాయన్న అభిప్రాయం ఉంది. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా వ్యవహరించిన గంగుల కమలాకర్, ఈటల రాజేందర్లు అడపాదపా సమావేశాలకు హాజరయ్యారు. తాజాగా మంగళవారం చివరి సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చాలాసార్లు హాజరయ్యారు. కొత్త ఎమ్మెల్యేల్లో కౌశిక్రెడ్డి మాత్రమే చివరి సమావేశంలో పాల్గొన్నారు. భారాస ప్రభుత్వ హయాంలో మొత్తం 12 సర్వసభ్య సమావేశాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడు జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణుడి కరుణ కొంతే!
[ 07-07-2024]
ఉమ్మడి జిల్లాను మేఘాలు ఊరిస్తున్నాయి. భారీ జల్లులు ఖాయమనే విధంగా ప్రతి రోజు ఆకాశం మురిపిస్తోంది. కారు మబ్బులతో మేఘావృతమైన నింగి అంతలోనే తేలిపోతోంది. మబ్బులు మాయమై.. చినుకుల జాడ దూరమవుతోంది. -
నూతన విధానం సఫలమయ్యేనా?
[ 07-07-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విద్యుత్తు బిల్లులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మాధ్యమాలైన గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్, పేటీఎంల నుంచి చెల్లింపులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు ఇబ్బందిగా మారనుంది. -
హోటల్కెళ్తే.. బిర్యానీకే ఓటు
[ 07-07-2024]
నలుగురు స్నేహితులు కలిసి పార్టీ చేసుకోవాలన్నా.. ఒక సంస్థ ఉద్యోగులు.. రెస్టారెంటుకు వెళ్లినా.. కుటుంబమంతా వారాంతాలు బయటకు వెళ్లినా.. బిర్యానీకే ఓటు వేస్తారు. ఇంట్లో శుభ కార్యాలు, ప్రత్యేక రోజుల్లోనూ ఆ వంటకం వండుతున్నారు. -
అవగాహనతోనే మహమ్మారికి అడ్డుకట్ట
[ 07-07-2024]
మారిన జీవన శైలి, ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, అవగాహన లోపం.. తదితర కారణాలతో మహిళలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. రక్తహీనత, హార్మోన్ అసమతుల్యత(పీసీవోఎస్), పౌష్టికాహార లోపం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. -
అత్యవసర సేవలు అంతంతే!
[ 07-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంబులెన్సుల నిర్వహణ పడకేసింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన అంబులెన్సుల ద్వారా ఉచిత సేవలందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. -
ఇలాగైతే నేల గుణం తెలిసేదెలా!
[ 07-07-2024]
డివిజన్ కేంద్రమైన మంథనిలో భూసార పరీక్ష కేంద్రం అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. మంథని, ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలాల కోసం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో 1999 జనవరి 11న నాటి మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి ఎల్లారెడ్డి చేతుల మీదుగా భూసార పరీక్ష కేందాన్ని ప్రారంభించారు. -
అయిదేళ్లలో అరకొర నిధులే..
[ 07-07-2024]
జిల్లా, మండల పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు ఆశించిన మేర నిధులు రాక, తమ మండలాల్లో అనుకున్న పనులు చేపట్టలేక నైరాశ్యానికి గురయ్యారు. -
అభివృద్ధి పనుల పేరుతో మట్టి దందా
[ 07-07-2024]
కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేర పెద్దఎత్తున మట్టి దందాకు తెరతీశారు. ప్రభుత్వానికి చిల్లి గవ్వ చెల్లించకుండా అక్రమార్కులు అగ్రహారం గుట్టను తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
టీ-నేతన్నకు దారేది?
[ 07-07-2024]
చేనేత, మరమగ్గాలపై వివిధ విభాగాల్లోని ఆసాములు, కార్మికుల వివరాల నమోదుకు ప్రభుత్వం టీ-నేతన్న యాప్ను తీసుకొచ్చింది. దీనిలో తరచూ సాంకేతిక సమస్యలతో నమోదు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. -
ఏళ్లు గడుస్తున్నా అధ్వానమే!
[ 07-07-2024]
కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకోనిగుట్టపైనున్న ప్రభుత్వ భూమిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద 800 ఇళ్లు నిర్మించాలని కాలనీలను ఏర్పాటు చేసింది. సొంతిళ్లు లేని నిరుపేదలకు ప్లాట్లను కేటాయించడంతో ప్రభుత్వం అందించిన ఆర్థికసాయంతోపాటు సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. -
గ్రామాల్లో మీసేవ కేంద్రాలు
[ 07-07-2024]
మహిళా శక్తి పేరిట స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు సేవల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేంద్రాలను విస్తరించనున్నారు. -
అతి వేగంతో చెట్టును ఢీ కొట్టిన కారు
[ 07-07-2024]
అజాగ్రత్త, అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఆవిష్కరణల ఒడి.. మారిన బడి
[ 07-07-2024]
ప్రభుత్వ పాఠశాల అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవిరళ కృషి చేశారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకే ఆసక్తి చూపని స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో తల ఎత్తుకునేలా పాఠశాలలను తీర్చిదిద్దారు.. -
జనన, మరణ ధ్రువపత్రాల జారీకి కొర్రీలు
[ 07-07-2024]
కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయ పరిధిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారింది. జిల్లా కేంద్రంలో పుట్టిన పిల్లలకు, గతంలో సర్టిఫికెట్లు తీసుకున్న వారు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా తప్పులను సవరించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. -
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ!
[ 07-07-2024]
రామగుండం బి-థర్మల్ కేంద్రంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.లక్షల విలువైన విడిభాగాలు మాయమయ్యాయి. గత నెల 7న స్టోర్కు తాళం వేసి సీల్ వేశారు. రెండ్రోజుల క్రితం తెరచి చూసే సరికి విడిభాగాలు కనిపించకుండా పోయాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది
-
ఆ పురుగు ఖరీదు రూ.75 లక్షలా..!
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు