ప్రజావాణికి వినతుల వెల్లువ
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్లో ఓపికగా స్వీకరించారు.
ఒక్క రోజే 370 అర్జీలు
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్
కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్లో ఓపికగా స్వీకరించారు.విజ్ఞప్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని పాలనాధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బారు దరఖాస్తులనూ క్లియర్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో పవన్కుమార్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్, డీపీవో రవీందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆసరా కల్పించరూ..
పక్షవాతం, వృద్ధాప్యంతో బాధపడుతున్న తనకు పింఛన్ ఇప్పించాలని గన్నేరువరం మండలం పర్లపల్లికి చెందిన ఇ.వెంకటాద్రి తన భార్యతో కలిసి ప్రజావాణికి వచ్చారు. ఇద్దరు కుమారులు, చిన్నపాటి ఉపాధితో వారు బతుకుతున్నారని, భార్య కష్టం చేసి తనను పోషిస్తోందని, ప్రభుత్వ పరంగా ఆసరా కల్పించాలని వేడుకున్నారు.
అనుమతి లేకుండా గోదాం
కరీంనగర్ గ్రామీణ మండలం ఇరుకుల్ల గ్రామంలో అనుమతి లేకుండా నిర్మించిన పండ్ల గోదాంపైన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన పలువురు ప్రజావాణిని ఆశ్రయించారు. పండ్ల లోడ్లతో వస్తున్న లారీలతో గ్రామస్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అనుమతి లేని గోదాంను తొలగించాలని జువ్వాడి మారుతిరావు, కాశిపాక రాకేశ్, రమేశ్ మరికొందరు కలెక్టర్ను కోరారు.
ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉపాధి చూపండి
కొత్తపల్లిలోని తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థలంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మించినందుకు సీడ్ కంపెనీలో కొన్నేళ్లుగా పని చేస్తున్న తాము ఉపాధి కోల్పోయామని, తమకు వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ కార్మికులుగా అవకాశం కల్పించాలని అధికారులను కోరారు. వారధిలో తమను ఎంపిక చేస్తున్నట్లు జాబితా సైతం తయారు చేశారు. కానీ సీడ్ కంపెనీకి, కళాశాలకు సంబంధంలేని వారిని కళాశాల యజమాన్యం నియమించుకుందని కార్మికులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని 30 మంది కార్మికులు అధికారులను అభ్యర్థించారు.
గురుకుల కళాశాలలో సీటు ఇప్పించండి
జ్వరం రావడంతో కౌన్సెలింగ్కు హాజరుకాలేకపోయాను. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో సీటు ఇప్పించాలని తల్లిని, సోదరున్ని వెంటపెట్టుకొని వచ్చి కలెక్టర్కు విజ్ఞప్తి చేశాడు కండె రామ్చరణ్ అనే విద్యార్థి. మానకొండూర్ మండలం ఆన్నారానికి చెందిన రామ్చరణ్ తండ్రి గతంలోనే చనిపోయాడు. తల్లి కూలీ పని చేసి చదివిస్తోందని, 10వ తరగతి వరకూ మానకొండూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదివానని తెలిపాడు. ఇంటర్ అడ్మిషన్కు సకాలంలో హాజరు కాకపోవటంతో సీటు లేదంటున్నారని, తనకు సీటు వచ్చేలా కలెక్టర్ మేడం చర్యలు తీసుకోవాలని కోరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వామ్మో.. గుంతలు
[ 04-07-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సమస్యలు విని.. పరిష్కారానికే హామీ!
[ 04-07-2024]
ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేయకుండా సమీప ఇంటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రతకు కారణంగా మారే ఆ స్థలాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ నగరపాలక మేయర్ వై.సునీల్రావు అన్నారు. -
ఉపాధి ఛిద్రం.. కార్మికులు ఆగం
[ 04-07-2024]
నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి. -
రైతు రుణమాఫీపై జిల్లాలో కదలిక
[ 04-07-2024]
రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా స్పష్టత ఇచ్చారు. -
గుర్తింపునిచ్చారు.. నిధులు మరిచారు
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ). ఎన్క్వాస్ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు. -
అందని బిల్లులు.. చేసేదెలా పనులు!
[ 04-07-2024]
గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
విచారణలో వేగం.. సత్వర న్యాయం
[ 04-07-2024]
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం అందుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త చట్టాలకు సంబంధించి ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. -
నాణ్యత ప్రశ్నార్థకం!
[ 04-07-2024]
మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. -
నూతన ఒరవడి.. పెరిగేనా దిగుబడి
[ 04-07-2024]
ప్రస్తుత వానాకాలం సీజన్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఉమ్మడి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో వ్యవసాయ శాఖతోపాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించేలా అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఉపకార వేతనాల సాధనలో విద్యార్థుల ప్రతిభ
[ 04-07-2024]
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) నిర్వహిస్తోంది. -
వర్షాకాలం.. అప్రమత్తతే కీలకం
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న రాయికల్ మండలంలోని ఆలూరు, కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు గతేడాది వర్షాకాలంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో రైతులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. -
రేపటి నుంచి ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లాలో 18 మండలాల ఉండగా కొత్తగా ఎండపల్లి, బీమారం మండలాలు ఏర్పాటు కాగా గత ఎన్నికలు జరిగిన 18 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. -
శరవేగంగా రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
[ 04-07-2024]
రామగుండం రైల్వే స్టేషన్ సుందరంగా మారనుంది. అమృత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. -
కుటుంబ కలహాలతో సైజింగ్ కార్మికుడి ఆత్మహత్య
[ 04-07-2024]
సిరిసిల్లలోని బీవైనగర్కు చెందిన సైజింగ్ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్కు చెందిన పల్లె యాదగిరిగౌడ్ సైజింగ్ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
మొక్కుబడి నిధులు.. విధులు
[ 04-07-2024]
జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి.