పచ్చని సంకల్పం
చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది.
ప్రతి ఒక్కరూ మొక్క నాటాలి
భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావాలి
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం, కార్పొరేషన్
చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది. ఇంటి పరిసరాలు, ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన.. అని చూడకుండా ఎక్కడ అవకాశముంటే అక్కడ బాధ్యతగా మొక్క నాటితే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందవచ్చు.
‘వన మహోత్సవంలో భాగంగా అమ్మ పేరుతో మొక్క నాటండి.. నేనూ మా అమ్మ స్మారకార్థం నాటాను.. తల్లుల పేరుతో మొక్క నాటే కార్యక్రమం ఉద్యమంలా సాగడం సంతోషాన్నిస్తోంది.. చాలా మంది తల్లులను తీసుకెళ్లి నాటుతున్నారు.. తల్లులు చనిపోయిన వారూ ఫొటోలు తీసుకెళ్లి నాటుతున్నారు.. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.. ఈ ప్రచారం భూమాతను రక్షించడానికి సహాయపడుతుంది.’
మన్కీబాత్లో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు
‘పచ్చని చెట్టును నేను రా
పాలు గారే మనసు నాది రా
కొమ్మను నే రమ్మను
మీకు తోడుగా ఉండే అమ్మను
నీ పొలమును దున్నిన నాగలై
పంటను మోసిన బండినై
అమ్మమ్మ చేతిలో కవ్వము నై
తాతాయ్య చేతిలో కర్ర నై
అమ్మ పాటతో ఊగిన ఊయలై
ఆ పాడేటి పిల్లల గ్రో వినయ్’
కవి, జయరాజు
వాతావరణంపై ప్రభావం..
ఉమ్మడి జిల్లాలో అడవి విస్తీర్ణం రోజురోజుకు తగ్గుతోంది. ప్రజావసరాలకు, భవన నిర్మాణాలకు చెట్లు నరికి వేస్తున్నారు. వాతావరణంలో మార్పులతో సకాలంలో వర్షాలు కురవడం లేదు. జిల్లాల విభజన సమయంలో రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో కొంతశాతం వెళ్లిపోవడంతో కరీంనగర్ జిల్లాలో అడవులు తగ్గిపోయాయి. పక్షులకు, జంతువులకు ఆహారం కూడా లభించని పరిస్థితి నెలకొంది.
లక్ష్యంతోపాటు సంరక్షణా ప్రధానం..
హరితహారంలో భాగంగా గత తొమ్మిది విడతలుగా కోట్లాది మొక్కలు నాటారు. ప్రభుత్వం కూడా మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యం ఆశించిన స్థాయిలో కనిపించలేదు. పైగా సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వంపై పడటంతో అది భారంగా మారింది. ఇళ్ల ముందు, రోడ్లపై నాటినవి కూడా రక్షించుకోలేకపోవడంతో పట్టణాలు, గ్రామాల్లో నిలువ నీడ లేకుండా పోయింది. ఎండాకాలంలో సూర్యుడు ప్రతాపం చూపించడానికి కారణం కూడా ఈ కాంక్రీట్ జంగిల్ అనే విషయాన్ని గుర్తించాలి.
ఆక్సిజన్ జనరేటర్లు
ఒక రకంగా చెప్పాలంటే చెట్లు ఆక్సిజన్ జనరేటర్లుగా అనవచ్చు. ఒక చెట్టు సుమారు సంవత్సరానికి 100-200 పౌండ్ల(45-90 కిలోగ్రాముల) ప్రాణవాయువు ఉత్పత్తి చేస్తుంది. సంవత్సరానికి నాలుగు లక్షల లీటర్ల ఆక్సిజన్తో సమానం.
ఒక వ్యక్తి రోజుకు 550 లీటర్ల ఆక్సిజన్ను వినియోగిస్తాడు. చెట్టు ఏడాది పొడవునా నలుగురికి సరిపడా ఆక్సిజన్ అందించగలదు.
గుర్తుగా నాటాలి..
వర్షాకాలం రానే వచ్చింది. మళ్లీ ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రజలు కూడా పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సందర్భాల్లో గుర్తుగా ఒక మొక్క నాటాలి. దానిని శ్రద్ధగా సంరక్షిస్తే చెట్టుగా ఎదిగిన తర్వాత ఫలాలు వస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఇది ఉద్యమంలా సాగి భావితరాలకు ఆదర్శం కావాలి.
మాను, మొక్క అంటే
పక్క కొమ్మలు కలిగి కనీసం ఇరవై అడుగుల ఎత్తు పెరిగే దానిని చెట్టు అంటారు. కొన్ని చెట్లు 200 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఏటా చిగురిస్తూ, పుష్పిస్తూ, కాయలు, పండ్లు అందిస్తాయి. ఒకసారి కాయలు కాసి చనిపోయే వాటిని మొక్కలు అంటారు.
ఉపయోగాలు ఇలా..
- ప్రకృతిలో మొక్కలను పరిశీలిస్తే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. ఔషధాల తయారీలో మొక్కలు ఉపయోగపడతాయి.
- పారిశ్రామికంగా పరిశీలిస్తే పేపర్ తయారీ, పెన్సిల్, సబ్బులు, నూనె, రసాయన పదార్థాల తయారీకి దోహదపడతాయి.
- ఇళ్ల నిర్మాణ సామగ్రి, అలంకరణ వస్తువుల
- ఆహారం దుస్తులు, నివాసం అవసరాలను తీరుస్తున్నాయి.
- రోజూ తినే వరి, గోధుమ, పప్పు దినుసులు, నూనెలు, కూరగాయలు, పండ్లు, వంటివి వివిధ రూపాల్లో లభిస్తాయి.
- చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడుతాయి. ప్రకృతికి అందాలను చేకూర్చడంలో, వ్యవసాయంలోను ప్రధాన పాత్ర పోషిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వామ్మో.. గుంతలు
[ 04-07-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సమస్యలు విని.. పరిష్కారానికే హామీ!
[ 04-07-2024]
ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేయకుండా సమీప ఇంటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రతకు కారణంగా మారే ఆ స్థలాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ నగరపాలక మేయర్ వై.సునీల్రావు అన్నారు. -
ఉపాధి ఛిద్రం.. కార్మికులు ఆగం
[ 04-07-2024]
నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి. -
రైతు రుణమాఫీపై జిల్లాలో కదలిక
[ 04-07-2024]
రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా స్పష్టత ఇచ్చారు. -
గుర్తింపునిచ్చారు.. నిధులు మరిచారు
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ). ఎన్క్వాస్ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు. -
అందని బిల్లులు.. చేసేదెలా పనులు!
[ 04-07-2024]
గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
విచారణలో వేగం.. సత్వర న్యాయం
[ 04-07-2024]
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం అందుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త చట్టాలకు సంబంధించి ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. -
నాణ్యత ప్రశ్నార్థకం!
[ 04-07-2024]
మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. -
నూతన ఒరవడి.. పెరిగేనా దిగుబడి
[ 04-07-2024]
ప్రస్తుత వానాకాలం సీజన్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఉమ్మడి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో వ్యవసాయ శాఖతోపాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించేలా అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఉపకార వేతనాల సాధనలో విద్యార్థుల ప్రతిభ
[ 04-07-2024]
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) నిర్వహిస్తోంది. -
వర్షాకాలం.. అప్రమత్తతే కీలకం
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న రాయికల్ మండలంలోని ఆలూరు, కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు గతేడాది వర్షాకాలంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో రైతులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. -
రేపటి నుంచి ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లాలో 18 మండలాల ఉండగా కొత్తగా ఎండపల్లి, బీమారం మండలాలు ఏర్పాటు కాగా గత ఎన్నికలు జరిగిన 18 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. -
శరవేగంగా రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
[ 04-07-2024]
రామగుండం రైల్వే స్టేషన్ సుందరంగా మారనుంది. అమృత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. -
కుటుంబ కలహాలతో సైజింగ్ కార్మికుడి ఆత్మహత్య
[ 04-07-2024]
సిరిసిల్లలోని బీవైనగర్కు చెందిన సైజింగ్ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్కు చెందిన పల్లె యాదగిరిగౌడ్ సైజింగ్ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
మొక్కుబడి నిధులు.. విధులు
[ 04-07-2024]
జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్