ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు.
సమస్యలు వింటున్న కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, న్యూస్టుడే: ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు. ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించే వీలున్నవాటిపై వెంటనే చర్య తీసుకుని వీలుకాని పక్షంలో సంబంధిత వ్యక్తులకు కారణం తెలపాలన్నారు. ఈ సందర్భంగా 44 వినతులు రాగా వాటిని పరిశీలించి పరష్కరించాల్సిందిగా సంబంధిత శాఖలకు రాశారు. అదనపు కలెక్టర్లు పి.రాంబాబు, ఎం.రఘువరణ్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు పి.మధుసూదన్, ఆనంద్కుమార్, ఎన్.శ్రీనివాస్,కలెక్టరేట్ ఏవో పి.హన్మంతరావు తదితరులున్నారు.
ఫిజికల్ డైరెక్టర్ బదిలీ రద్దు చేయాలని..
మల్యాల మండలం తక్కళ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ గంగాసాగర్కు పదోన్నతి ఇచ్చి ఫిజికల్ డైరెక్టర్గా బదిలీ చేశారని అతని బదిలీ రద్దు చేయాలని గ్రామానికి చెందిన యువకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. గంగాసాగర్ పాఠశాల విద్యార్థులకే కాకుండా పరిసర గ్రామాల యువతి, యువకులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇప్పటి వరకు 42 మంది పోలీసు, ఆర్మీలో ఉద్యోగాలు పొందారని తక్కళ్లపల్లి పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టు ఉందని అతన్ని తమ గ్రామంలో నియమించాలని కోరారు.
ప్రైవేటు పాఠశాలలపై చర్యలకు
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు కోరారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేశ్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా ఫీజు తీసుకోవడమే కాకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఇతర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని కొన్ని పాఠశాలలు అనుమతి లేకుండా నడుపుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రైవేటు పాఠశాలలో నాణ్యత లేని ఆహార వస్తువులు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారని ఆ పాఠశాలపై చర్య తీసుకోవాలని ఎన్ఎస్యుఐ నాయకులు కోరారు. పట్టణ అధ్యక్షుడు చిట్ల భార్గవ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ప్రజావాణితో ఫిర్యాదు చేశారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను పిల్లలకు వడ్డిస్తున్నారని పాఠశాలపై చర్య తీసుకుని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని వారు కోరారు.
మద్యం విక్రయాలు నిలిపి వేయాలి
కోరుట్ల మండలం పైడిమడుగులో అక్రమ మద్యం విక్రయాలను నిలిపివేయాలని గ్రామానికి చెందిన అంబేడ్కర్, జై భీం యూత్ సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గొలుసు దుకాణాలతో పాటు పర్మిట్రూంలో మద్యం విక్రయాల వల్ల గ్రామంలో యువకులు మద్యం, మత్తుకు అలవాటు పడుతున్నారని తరచూ గొడవలు జరుగుతున్నాయని వెంటనే అక్రమ మద్య విక్రయాలను నిలిపివేయాలని కోరారు.
ఫీజు బకాయిల విడుదలకు..
విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు కోరారు. జిల్లా కార్యదర్శి అక్రం మాలిక్, జిల్లా అధ్యక్షుడు సమీర్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కోర్సు పూర్తయినప్పటికీ కళాశాలల యజమాన్యాలు ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఇబ్బందిగా మారుతుందని వారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వామ్మో.. గుంతలు
[ 04-07-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సమస్యలు విని.. పరిష్కారానికే హామీ!
[ 04-07-2024]
ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేయకుండా సమీప ఇంటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రతకు కారణంగా మారే ఆ స్థలాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ నగరపాలక మేయర్ వై.సునీల్రావు అన్నారు. -
ఉపాధి ఛిద్రం.. కార్మికులు ఆగం
[ 04-07-2024]
నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి. -
రైతు రుణమాఫీపై జిల్లాలో కదలిక
[ 04-07-2024]
రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా స్పష్టత ఇచ్చారు. -
గుర్తింపునిచ్చారు.. నిధులు మరిచారు
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ). ఎన్క్వాస్ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు. -
అందని బిల్లులు.. చేసేదెలా పనులు!
[ 04-07-2024]
గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
విచారణలో వేగం.. సత్వర న్యాయం
[ 04-07-2024]
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం అందుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త చట్టాలకు సంబంధించి ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. -
నాణ్యత ప్రశ్నార్థకం!
[ 04-07-2024]
మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. -
నూతన ఒరవడి.. పెరిగేనా దిగుబడి
[ 04-07-2024]
ప్రస్తుత వానాకాలం సీజన్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఉమ్మడి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో వ్యవసాయ శాఖతోపాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించేలా అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఉపకార వేతనాల సాధనలో విద్యార్థుల ప్రతిభ
[ 04-07-2024]
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) నిర్వహిస్తోంది. -
వర్షాకాలం.. అప్రమత్తతే కీలకం
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న రాయికల్ మండలంలోని ఆలూరు, కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు గతేడాది వర్షాకాలంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో రైతులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. -
రేపటి నుంచి ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లాలో 18 మండలాల ఉండగా కొత్తగా ఎండపల్లి, బీమారం మండలాలు ఏర్పాటు కాగా గత ఎన్నికలు జరిగిన 18 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. -
శరవేగంగా రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
[ 04-07-2024]
రామగుండం రైల్వే స్టేషన్ సుందరంగా మారనుంది. అమృత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. -
కుటుంబ కలహాలతో సైజింగ్ కార్మికుడి ఆత్మహత్య
[ 04-07-2024]
సిరిసిల్లలోని బీవైనగర్కు చెందిన సైజింగ్ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్కు చెందిన పల్లె యాదగిరిగౌడ్ సైజింగ్ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
మొక్కుబడి నిధులు.. విధులు
[ 04-07-2024]
జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ