కార్యకర్తలకు అండగా ఉంటాం
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్
సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు ఈశ్వర్, రాజేశంగౌడ్, ఎమ్మెల్సీ రమణ,
ఎమ్మెల్యే డా.సంజయ్, జడ్పీ ఛైర్పర్సన్ వసంత, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రవిశంకర్, చందర్ తదితరులు
జగిత్యాల, న్యూస్టుడే: నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఎవరో ఒకరు పార్టీ వదిలి పోయారని భయపడాల్సిన అవసరం లేదని తాను, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ వస్తామని ఎమ్మెల్సీ రమణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు వారానికి అయిదురోజులు అందుబాటులో ఉంటారన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని కష్టాలు వచ్చినప్పుడే మనిషి విలువ తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ భారాస పాలనలో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చరిత్రలో కేసీఆర్ మార్కును చేరిపేయలేరన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు తలదించుకోవాలని కార్యకర్తలు, నాయకులు తప్పు చేసినట్లుగా ఉండవద్దని పార్టీ పునర్ వైభవం సాధించేందుకు కష్టపడాలని ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామన్నారు. భారాస జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు మాట్లాడుతూ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అండగా ఉంటామని ఒక్కరోజు కూడా ఉద్యమంలో లేని సంజయ్కుమార్కు మూడుసార్లు టికెట్ ఇచ్చి రెండుసార్లు గెలిపిస్తే కాంట్రాక్టులు, బిల్లుల కోసం ప్రజలను మోసం చేసి పార్టీ మారాడని దమ్ముంటే రాజీనామా చేయాలని అన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యేను కవిత కష్టపడి గెలిపిస్తే వ్యక్తిగత ప్రయోజనం కోసం పార్టీ మారారని తనను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఎమ్మెల్యే సంజయ్కుమార్ను గెలిపించారని ఆయన పార్టీ మారినా పట్టించుకోవద్దన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీగా కవిత అయిదేళ్లపాటు జగిత్యాల అభివృద్ధికి నిధులు తెచ్చారని కష్టపడి సంజయ్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆమె జైలుకు వెళ్లిందని చూడకుండా పార్టీ మారి మోసం చేశారన్నారు. మాజీ మంత్రి రాజేశంగౌడ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, డీసీఎంఎస్ అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, లోక బాపురెడ్డి, రవీందర్సింగ్, చల్మెడ లక్ష్మినర్సింహరావు, రమణారావు, ముప్పాల రాంచందర్రావు, జడ్పీ వైస్ఛైర్మన్ హరిచరణ్రావు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. సమావేశం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఫోన్లో కొడిమ్యాల మండలం సర్పంచుల ఫోరం మాజీ మండలాధ్యక్షులు పునుగోటి కృష్ణారావుతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కృష్ణారావు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
హాజరైన కార్యకర్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వామ్మో.. గుంతలు
[ 04-07-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సమస్యలు విని.. పరిష్కారానికే హామీ!
[ 04-07-2024]
ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేయకుండా సమీప ఇంటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రతకు కారణంగా మారే ఆ స్థలాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ నగరపాలక మేయర్ వై.సునీల్రావు అన్నారు. -
ఉపాధి ఛిద్రం.. కార్మికులు ఆగం
[ 04-07-2024]
నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి. -
రైతు రుణమాఫీపై జిల్లాలో కదలిక
[ 04-07-2024]
రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా స్పష్టత ఇచ్చారు. -
గుర్తింపునిచ్చారు.. నిధులు మరిచారు
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ). ఎన్క్వాస్ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు. -
అందని బిల్లులు.. చేసేదెలా పనులు!
[ 04-07-2024]
గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
విచారణలో వేగం.. సత్వర న్యాయం
[ 04-07-2024]
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం అందుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త చట్టాలకు సంబంధించి ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. -
నాణ్యత ప్రశ్నార్థకం!
[ 04-07-2024]
మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. -
నూతన ఒరవడి.. పెరిగేనా దిగుబడి
[ 04-07-2024]
ప్రస్తుత వానాకాలం సీజన్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఉమ్మడి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో వ్యవసాయ శాఖతోపాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించేలా అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఉపకార వేతనాల సాధనలో విద్యార్థుల ప్రతిభ
[ 04-07-2024]
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) నిర్వహిస్తోంది. -
వర్షాకాలం.. అప్రమత్తతే కీలకం
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న రాయికల్ మండలంలోని ఆలూరు, కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు గతేడాది వర్షాకాలంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో రైతులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. -
రేపటి నుంచి ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లాలో 18 మండలాల ఉండగా కొత్తగా ఎండపల్లి, బీమారం మండలాలు ఏర్పాటు కాగా గత ఎన్నికలు జరిగిన 18 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. -
శరవేగంగా రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
[ 04-07-2024]
రామగుండం రైల్వే స్టేషన్ సుందరంగా మారనుంది. అమృత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. -
కుటుంబ కలహాలతో సైజింగ్ కార్మికుడి ఆత్మహత్య
[ 04-07-2024]
సిరిసిల్లలోని బీవైనగర్కు చెందిన సైజింగ్ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్కు చెందిన పల్లె యాదగిరిగౌడ్ సైజింగ్ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
మొక్కుబడి నిధులు.. విధులు
[ 04-07-2024]
జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి.