వసూళ్లు పక్కా.. నిర్వహణ మరి?
ఉమ్మడి జిల్లాలో రాజీవ్ రహదారిపై రెండు టోల్ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి.
రాజీవ్ రహదారిపై పలుచోట్ల గుంతలు
ఈనాడు, కరీంనగర్
పెద్దకల్వల వద్ద రాజీవ్ రహదారిపై గుంత
ఉమ్మడి జిల్లాలో రాజీవ్ రహదారిపై రెండు టోల్ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి. వేగంగా వెళ్లే వాహనదారులు గమనించక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల వీటికి మరమ్మతు చేసినప్పటికీ ప్యాచ్ వర్క్ ఎగుడుదిగుడుగా ఉండటంతో అవి వేగ నిరోధకాలను తలపిస్తున్నాయి.
పర్యవేక్షణ పెరిగితేనే..
రాజీవ్ రహదారిపై తిమ్మాపూర్ మండలం రేణికుంటతోపాటు పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ వద్ద టోల్ ప్లాజాలను ఏర్పాటు చేశారు. దాదాపు 15 ఏళ్ల కిందట ఈ మార్గాన్ని విస్తరించి నిర్మాణం చేపట్టినందుకుగానూ ప్రతి 60 కి.మీ దూరంలో ఒక టోల్ప్లాజాను పెట్టి ఈ మార్గంలో వెళ్లే నాలుగు, ఆరు, ఎనిమిది చక్రాల వాహనాల నుంచి టోల్ ట్యాక్స్ను వసూలు చేస్తున్నారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) పర్యవేక్షణలో పలు ఏజెన్సీలు వీటిని నడుపుతున్నాయి. కాగా ఈ మార్గం ఏర్పాటు సమయం నుంచి ఈ రోడ్డుపై పలురకాల వసతుల కల్పన కూడా వీరే చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా రహదారిపై ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేని పరిస్థితులు ఉండాలి. టోల్ అనేది మనం పొందుతున్న సేవలకు చెల్లిస్తున్న పరోక్ష పన్ను. నాణ్యమైన గుంతలు లేని రహదారిని వినియోగించి ప్రయాణం సాఫీగా సాగేందుకు చెల్లించే రుసుము. ఇలా ఉమ్మడి జిల్లాలో వాహనదారులు ఏళ్లతరబడి రుసుము చెల్లిస్తున్నా.. అందుకు తగిన వసతులందడం లేదనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ పెరిగేలా.. వసతులు మెరుగయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులు తగిన శ్రద్ధను కనబర్చాల్సిన అవసరముంది.
రోడ్లు సరిగ్గా నిర్వహించలేనప్పుడు టోల్ వసూలు చేయొద్దు.. గుంతలతో కూడిన రహదారులు.. టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ.. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఇటీవల కేంద్ర రహదారి, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేషనల్ హైవే అధికారులు, టోల్ ఏజెన్సీలతో అన్న మాటలివి.
ఉమ్మడి జిల్లాలో టోల్ప్లాజాలు : రేణికుంట, తిమ్మాపూర్ మండలం (కరీంనగర్ జిల్లా), బసంత్నగర్, పాలకుర్తి మండలం (పెద్దపల్లి జిల్లా)
నిత్యం ఈ రెండు టోల్ గేట్ల వద్ద టోల్ కట్టే వాహనాలు : 11 వేల నుంచి 12 వేలు
రెండు టోల్ప్లాజాల్లో నిత్యం వసూలవుతున్న రుసుము : రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు
ఇవన్నీ అరకొరగానే..!
- చాలా గ్రామాల వద్ద ప్రమాద హెచ్చరికలు సరిగా లేవు.
- రాత్రి వేళ ఆయా గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన హెమాస్ట్ లైట్లు చాలా చోట్ల వెలగడం లేదు. కొన్నిచోట్ల ఏర్పాటు చేయాల్సి ఉంది.
- విభాగినిపై మొక్కల పెంపకం విషయంలో దారిపొడువునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. మొక్కలు లేక గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగాయి.
- రహదారి పక్కన చాలాచోట్ల గతంలో కంచెలను ఏర్పాటు చేశారు. చాలాచోట్ల ఇవి మాయమైనా తిరిగి ఏర్పాటు చేయలేదు.
- తారు రోడ్డుకు ఆనుకుని సైడ్బర్మ్లో గుంతలను పూడ్చకపోవడంతో వర్షం పడినప్పుడు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
- మార్గమధ్యలో కూడా తాగునీరు, మరుగుదొడ్లు, అత్యవసర సేవలు, అగ్నిమాపక నియంత్రణ సౌకర్యాలు మరిన్ని పెంచాలి.
- 100 మీటర్ల కన్నా ఎక్కువగా వరుస ఉంటే టోల్ప్లాజా వద్ద రుసుము చెల్లించవద్దనే నిబంధన ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు.
- ప్లాజాకు 20 కి.మీ.ల పరిధి వాహనాలకు టోల్ తీసుకోవద్దనే నిబంధన కొందరికే వర్తిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వామ్మో.. గుంతలు
[ 04-07-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సమస్యలు విని.. పరిష్కారానికే హామీ!
[ 04-07-2024]
ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేయకుండా సమీప ఇంటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రతకు కారణంగా మారే ఆ స్థలాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ నగరపాలక మేయర్ వై.సునీల్రావు అన్నారు. -
ఉపాధి ఛిద్రం.. కార్మికులు ఆగం
[ 04-07-2024]
నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి. -
రైతు రుణమాఫీపై జిల్లాలో కదలిక
[ 04-07-2024]
రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా స్పష్టత ఇచ్చారు. -
గుర్తింపునిచ్చారు.. నిధులు మరిచారు
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ). ఎన్క్వాస్ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు. -
అందని బిల్లులు.. చేసేదెలా పనులు!
[ 04-07-2024]
గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
విచారణలో వేగం.. సత్వర న్యాయం
[ 04-07-2024]
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం అందుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త చట్టాలకు సంబంధించి ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. -
నాణ్యత ప్రశ్నార్థకం!
[ 04-07-2024]
మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. -
నూతన ఒరవడి.. పెరిగేనా దిగుబడి
[ 04-07-2024]
ప్రస్తుత వానాకాలం సీజన్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఉమ్మడి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో వ్యవసాయ శాఖతోపాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించేలా అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఉపకార వేతనాల సాధనలో విద్యార్థుల ప్రతిభ
[ 04-07-2024]
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) నిర్వహిస్తోంది. -
వర్షాకాలం.. అప్రమత్తతే కీలకం
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న రాయికల్ మండలంలోని ఆలూరు, కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు గతేడాది వర్షాకాలంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో రైతులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. -
రేపటి నుంచి ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లాలో 18 మండలాల ఉండగా కొత్తగా ఎండపల్లి, బీమారం మండలాలు ఏర్పాటు కాగా గత ఎన్నికలు జరిగిన 18 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. -
శరవేగంగా రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
[ 04-07-2024]
రామగుండం రైల్వే స్టేషన్ సుందరంగా మారనుంది. అమృత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. -
కుటుంబ కలహాలతో సైజింగ్ కార్మికుడి ఆత్మహత్య
[ 04-07-2024]
సిరిసిల్లలోని బీవైనగర్కు చెందిన సైజింగ్ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్కు చెందిన పల్లె యాదగిరిగౌడ్ సైజింగ్ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
మొక్కుబడి నిధులు.. విధులు
[ 04-07-2024]
జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి.