నియామకాలపై నీలినీడలు
జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్ కోర్సును ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు.
గడువు తీరిన పొరుగుసేవల సంస్థ నుంచి ఉత్తర్వులు
ఎస్సీ అధ్యయన కేంద్రంలో ఉద్యోగాలకు పైరవీలు
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
సిరిసిల్లలోని ఎస్సీ అధ్యయన కేంద్రం
జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్ కోర్సును ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు. దీంతోపాటు మూడు నెలల ఫౌండేషన్ కోర్సును డేస్కాలర్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ అధ్యయన కేంద్రంలో మొత్తం 152 మంది శిక్షణ పొందుతున్నారు. వీరికి కోర్సు నిర్వహణపై ప్రణాళిక, అధ్యాపకుల ఎంపిక, వసతి తదితరాలను చూసుకునేందుకు సిబ్బంది అవసరం. వీరిని కలెక్టర్ అనుమతితో జిల్లాలోని పొరుగుసేవల సంస్థ ద్వారా నియమించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో జాప్యం జరగడంతో ఎస్సీ సంక్షేమశాఖలోని ఆరుగురు ఉద్యోగులను ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్ పద్ధతిలో ఇక్కడ నియమించారు. ఒక డైరెక్టర్, మేనేజర్, అకౌంటెంట్, శిక్షణ సమన్వయకర్త, కంప్యూటర్ ఆపరేటర్, ముగ్గురు ఆఫీస్ అస్టెంట్లు, అటెండరు అవసరం. డైరెక్టర్ నియామకానికి అధ్యయన కేంద్రం ప్రారంభానికి ముందే ఉత్తర్వులు జారీ చేశారు. పీజీ అర్హత ఉన్న ఈ పోస్టుకు ముప్పై మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మెరిట్ జాబితా తీసి, ముఖాముఖి నిర్వహించేలోగా ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో ఈ ప్రక్రియను నిలిపివేశారు. మిగతా పోస్టులకు స్థాయిని బట్టి డిగ్రీ మొదలుకొని ఏడో తరగతి వరకు అర్హతలుగా పేర్కొన్నారు. ఈ నియామకాల్లోనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా వివిధ ప్రాంతాల్లో ఎస్సీ సంక్షేమశాఖలో పని చేస్తున్న ఉద్యోగులను డిప్యూటేషన్పై అధ్యయన కేంద్రంలో నియమించారు.
ఏం జరిగిందంటే...
అధ్యయన కేంద్రం డైరెక్టర్ మినహా మిగతా ఆరు పోస్టుల నియామకాలకు ముందుగా పేపరు ప్రకటన ఇవ్వాలి. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, ప్రతిభ ఆధారంగా ముఖాముఖి నిర్వహించాలి. దీనిలో ఎంపికైన వారిని ఉద్యోగ నియామకాలకు జిల్లా ఉపాధి కల్పన అధికారి ద్వారా పొరుగుసేవల సంస్థకు అప్పగించాలి. వారు కలెక్టర్ అనుమతితో నియామక పత్రాలు ఇవ్వాలి. కాగా ఈ పోస్టుల నియామకాలకు పేపరు ప్రకటన ఇవ్వకుండానే సురక్ష (పొరుగు సేవలు) సంస్థ ద్వారా నియామక పత్రాలు ఇచ్చారు. వీటిని తీసుకున్న అభ్యర్థులు అధ్యయన కేంద్రానికి వెళ్లారు. నియామక పత్రాలపై మార్చి 14 అని ఉంది. కాగా మార్చి 14కే జిల్లాలో సురక్ష సంస్థ గడువు ముగిసింది. అదే రోజు కొత్తగా సాధన సంస్థకు పొరుగుసేవల ఉద్యోగ నియామకాల బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థ సేవలు అదే రోజు నుంచి అమలులోకి వచ్చాయి. పాత సంస్థ అదే రోజు నియామక పత్రాలు ఇవ్వడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యయన కేంద్రంలో ఉద్యోగాల నియామకాలకు కలెక్టరేట్లోనే పెద్దఎత్తున పైరవీలు జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పాత కలెక్టర్ అనురాగ్ జయంతికి ఫిర్యాదులు వెళ్లాయి. కలెక్టరేట్లో జరిగిన ఈ వ్యవహారంపై విచారణ కూడా చేయించినట్లు తెలిసింది. ఇంతలోనే ఆయన బదిలీపై వెళ్లడంతో విచారణ వివరాలేవీ బయటకు రాలేదు. మరోవైపు మూడు నెలలు పూర్తయినా అధ్యయన కేంద్రంలో నియామకాలు జరగలేదు.
నిబంధనలు పాటించలేదు
ఉద్యోగుల నియామకాల్లో పాత పొరుగుసేవల సంస్థ సరైన నిబంధనలు పాటించలేదు. ఈ విషయం పాత కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జాప్యం జరిగింది. అధ్యయన కేంద్రంలో ఉద్యోగుల నియామకంపై కొత్తగా వచ్చిన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.-
వినోద్, ఈడీ, జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వామ్మో.. గుంతలు
[ 04-07-2024]
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ఒకటెండ్రు వర్షాలకే రోడ్లు గుంతలు పడుతుండటంతో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. -
సమస్యలు విని.. పరిష్కారానికే హామీ!
[ 04-07-2024]
ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం వేయకుండా సమీప ఇంటి యజమానులు శుభ్రంగా ఉంచుకోవాలని, అపరిశుభ్రతకు కారణంగా మారే ఆ స్థలాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ నగరపాలక మేయర్ వై.సునీల్రావు అన్నారు. -
ఉపాధి ఛిద్రం.. కార్మికులు ఆగం
[ 04-07-2024]
నేతన్నలు రెక్కల కష్టాన్ని నమ్ముకుని మరమగ్గాలపై వస్త్రం నేస్తే వచ్చే రోజు కూలీయే వారి జీవనాధారం. పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు నేతన్నలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అరకొర ఆర్డర్లతో చాలా మందికి ఉపాధి లభించడం లేదు. పని చేస్తే తిండి. -
రైతు రుణమాఫీపై జిల్లాలో కదలిక
[ 04-07-2024]
రైతులు పంటల సాగుకోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా స్పష్టత ఇచ్చారు. -
గుర్తింపునిచ్చారు.. నిధులు మరిచారు
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వేములవాడ గ్రామీణ మండలంలోని హన్మాజీపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ). ఎన్క్వాస్ గుర్తింపు కోసం పనులు చేపట్టడానికి కలెక్టర్ రూ.5 లక్షలు కేటాయించారు. వీటితో పనులు చేపట్టారు. -
అందని బిల్లులు.. చేసేదెలా పనులు!
[ 04-07-2024]
గత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పల్లెల్లో మూలన పడిన చేతిపంపులు, బోరు మోటార్లు, బావులు, పగుళ్లు బారిన పడిన పైపులైన్లకు మరమ్మతు చేసేందుకు ‘ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్’ పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
విచారణలో వేగం.. సత్వర న్యాయం
[ 04-07-2024]
కొత్త నేర, న్యాయ చట్టాలతో కేసుల దర్యాప్తు, విచారణలో వేగం పెరిగి బాధితులకు సత్వర న్యాయం అందుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త చట్టాలకు సంబంధించి ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. -
నాణ్యత ప్రశ్నార్థకం!
[ 04-07-2024]
మానేరు వాగుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా.. రెండు జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న వంతెన గడ్డర్లు వరుసగా కూలిపోతుండటం విస్మయం కలిగిస్తోంది.. పనులు నాణ్యంగా జరిగాయా.. నిబంధనల ప్రకారం పనులు చేశారా.. అధికారులు సరిగా పర్యవేక్షణ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.. -
నూతన ఒరవడి.. పెరిగేనా దిగుబడి
[ 04-07-2024]
ప్రస్తుత వానాకాలం సీజన్లో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేలా జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఉమ్మడి జిల్లాకు లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో వ్యవసాయ శాఖతోపాటు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహించేలా అవగాహన సదస్సులు నిర్వహించారు. -
ఉపకార వేతనాల సాధనలో విద్యార్థుల ప్రతిభ
[ 04-07-2024]
పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్యను ఆపేయకుండా ఉన్నత విద్యనభ్యసించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన అర్హత పరీక్ష(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) నిర్వహిస్తోంది. -
వర్షాకాలం.. అప్రమత్తతే కీలకం
[ 04-07-2024]
ఈ చిత్రంలో కనిపిస్తున్న రాయికల్ మండలంలోని ఆలూరు, కుర్మపల్లి గ్రామానికి చెందిన యువరైతు గతేడాది వర్షాకాలంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో రైతులు మృతి చెందడంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. -
రేపటి నుంచి ప్రత్యేక పాలన
[ 04-07-2024]
జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోనున్నారు. జిల్లాలో 18 మండలాల ఉండగా కొత్తగా ఎండపల్లి, బీమారం మండలాలు ఏర్పాటు కాగా గత ఎన్నికలు జరిగిన 18 మంది జడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. -
శరవేగంగా రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
[ 04-07-2024]
రామగుండం రైల్వే స్టేషన్ సుందరంగా మారనుంది. అమృత్ పథకంలో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్ను మొదటి విడతలో సుందరీకరించనున్నారు. రూ.26.49 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. -
కుటుంబ కలహాలతో సైజింగ్ కార్మికుడి ఆత్మహత్య
[ 04-07-2024]
సిరిసిల్లలోని బీవైనగర్కు చెందిన సైజింగ్ కార్మికుడు పల్లె యాదగిరిగౌడ్ (46) కుటుంబ కలహాలతో బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని బీవైనగర్కు చెందిన పల్లె యాదగిరిగౌడ్ సైజింగ్ కార్మికుడిగా గత 30 ఏళ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. -
మొక్కుబడి నిధులు.. విధులు
[ 04-07-2024]
జిల్లా స్థాయిలో ఒక శాసనసభ సమావేశాలుగా జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలను భావిస్తారు. అలాంటి జిల్లా పరిషత్తులకు నిధులు.. విధులు తగ్గడంతో అదే స్థాయిలో సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయన్న విమర్శలున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM