logo

ధరణి సమస్యల పరిష్కారానికి కృషి

ధరణి దరఖాస్తుల్లో పెండింగ్‌ ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు.

Published : 30 Jun 2024 03:40 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌తో కలిసి పాల్గొన్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : ధరణి దరఖాస్తుల్లో పెండింగ్‌ ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. శనివారం హైదరాబాద్‌ నుంచి సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారుల పరిధిలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్, డీఆర్వో పవన్‌కుమార్, ఆర్డీవో మహేశ్వర్, రమేశ్‌ (హుజూరాబాద్‌) పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని