ఆదర్శం.. ఈ సర్కారు బడి
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్(పూర్వ బాలికల) ఉన్నత పాఠశాల నిలుస్తోంది.
ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు.. మెరుగైన వసతులు
ధర్మపురి జడ్పీ ఉన్నత పాఠశాలలో వెల్లువలా అడ్మిషన్లు
న్యూస్టుడే, ధర్మపురి
ధర్మపురి జడ్పీ ఉన్నత పాఠశాల
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్(పూర్వ బాలికల) ఉన్నత పాఠశాల నిలుస్తోంది. తక్కువ మంది విద్యార్థులతో వెలవెలబోతున్న సర్కారు బడులు ఉన్న కాలంలో కూడా ఆ పాఠశాలలో అడ్మిషన్ల వెల్లువతో సందడి నెలకొంది. ఎస్సెస్సీలో మంచి ఫలితాలు, ఉత్తమ విద్యాబోధన, పేద విద్యార్థులకు అండగా నిలవడం, మౌలిక వసతులు తదితర విషయాల్లో మెరుగ్గా ఉండటంతో తమ పిల్లల్ని చేర్పించేందుకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు ఆసక్తి, ఉత్సాహం చూపుతున్నారు.
విద్యార్థుల సంఖ్య 405..
గత విద్యాసంవత్సరం 369 మంది విద్యార్థులు ఉండగా.. పదో తరగతి విద్యార్థులు పోను ఈ ఏడాది నూతన ప్రవేశాలతో ఆ సంఖ్య 405కు చేరింది. ఈ పాఠశాలలో ఇంకా ప్రవేశాలు జరుగుతుండటంతో సందడి నెలకొంది. ధర్మపురి మండలంలోని 9 గ్రామాల విద్యార్థులతో పాటు, వెల్గటూర్, బుగ్గారం, ధర్మారం, ఎండపల్లి మండలాల విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో అడ్మిషన్లు పొందడం గమనార్హం. బడి ఆవరణలో పచ్చని మొక్కలతో పాటు విశాలమైన ఆటస్థలం, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలోని అత్యుత్తమ పాఠశాలలో ఒకటైనా ఈ స్కూల్లో చాలా ఏళ్లుగా పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో సాయిప్రదీప్తి 9.8, అయ్యోరి అమూల్య 9.7 గ్రేడ్ పాయింట్లు పొందారు. వీరితో పాటు 9.00 పైగా గ్రేడింగు పాయింట్లతో పది మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులను ఆకర్షిండటానికి, పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులు దాతల సహాయంతో ప్రతీ సంవత్సరం నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన వారిలో సాఫ్ట్వేర్, ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థిరపడిన వారు ఉన్నారు. క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణిస్తున్నారు. గత ఏడాది అథ్లెటిక్స్లో, కబడ్డీలో ఇద్దరు రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు గెలుచుకున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాఠశాలలో వసతుల కల్పనకు కృషి చేస్తూ.. తాగునీటి వసతులును కల్పించడంతో పాటు, మిగతా సమస్యలను పరిష్కరించారు.
అందరి సహకారంతోనే..
ఈ సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 405కి చేరింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి పరుస్తున్నాం. విద్యార్థులపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతూ చర్యలు తీసుకుంటున్నాం.
కొలిచాల శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీ ఉన్నత పాఠశాల, ధర్మపురి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజావాణికి వినతుల వెల్లువ
[ 02-07-2024]
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్లో ఓపికగా స్వీకరించారు. -
మీసేవలో నగదు రహిత చెల్లింపులకు మిశ్రమ స్పందన
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, రెవెన్యూ అవసరాలకు ఇప్పుడంతా మీసేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు అందించే సేవలకు గానూ ప్రభుత్వం రుసుంలు వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ రుసుంల వివరాలు కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలి. -
పచ్చని సంకల్పం
[ 02-07-2024]
చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది. -
ఉన్నత సమస్యలు
[ 02-07-2024]
మెట్పల్లిలో ఉన్నత చదువు సమస్యలకు నెలవుగా మారింది. ఏళ్లు గడుస్తున్నా సరైన వసతులు సమకూరక విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలు కరవై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
[ 02-07-2024]
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక
[ 02-07-2024]
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మూడో విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను సోమవారం నిర్వహించారు. -
వసూళ్లు పక్కా.. నిర్వహణ మరి?
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లాలో రాజీవ్ రహదారిపై రెండు టోల్ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి. -
నియామకాలపై నీలినీడలు
[ 02-07-2024]
జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్ కోర్సును ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులయ్యాయి. -
రాజన్న ఆలయ ఈవోగా వినోద్రెడ్డి బాధ్యతల స్వీకరణ
[ 02-07-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా వినోద్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్ అనారోగ్య కారణాలతో సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో రామకృష్ణ గత నెల 30 వరకు అదనపు బాధ్యతలు నిర్వహించారు. -
నేడు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన
[ 02-07-2024]
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రామగుండం నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి 11 గంటలకు చేరుకోనున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
[ 02-07-2024]
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
[ 02-07-2024]
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లోని యూనియన్ బ్యాంక్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ నుంచి భారీగా పొగ వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
-
విమానంలో కుదుపులు.. ఓవర్హెడ్ బిన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
-
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
-
ఎఫ్డీ కంటే అధిక వడ్డీ.. ఆర్బీఐ గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్ గురించి తెలుసా?
-
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 15 మంది విద్యార్థులకు గాయాలు
-
‘నాయకులు ఇంకెప్పుడు తెలుసుకుంటారు..’: గర్భవిచ్ఛిత్తి పోస్ట్పై మస్క్ వర్సెస్ కమలా హ్యారిస్!