వైద్యుల భర్తీకి చర్యలు.. తీరనున్న ఇబ్బందులు
ఎంబీబీఎస్ విద్యార్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లోని కొన్ని విభాగాల్లో వైద్యుల కొరత తీరనుంది.
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
ఎంబీబీఎస్ విద్యార్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లోని కొన్ని విభాగాల్లో వైద్యుల కొరత తీరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు మల్టీ జోన్లలో మొత్తం 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే అన్ని జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత తీరనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామగుండంతో పాటు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. ఆయా కళాశాలల్లోని క్యాజువాలిటీ మెడికల్ అధికారుల పోస్టులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నియామక ప్రకటనతో భర్తీ కానున్నాయి. వైద్య కళాశాలల్లోని ఆచార్యులు, సహఆచార్యులు, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ నిర్వహణ వైద్య విద్య విభాగానికి రాగా ఆయా కళాశాలల్లో పనిచేసే క్యాజువాలిటీ మెడికల్ అధికారుల భర్తీ, నిర్వహణ రాష్ట వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది. ఒక్కో కళాశాలలో సుమారు 8 మంది క్యాజువాలిటీ మెడికల్ అధికారుల పోస్టులను ప్రకటించగా దాదాపు ఖాళీగానే ఉన్నాయి. బోధనాసుపత్రుల్లోనూ రెసిడెంట్ మెడికల్ అధికారుల పోస్టుల భర్తీ, నిర్వహణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉండగా ఒక్కో బోధనాసుపత్రిలో సుమారు 8 మంది రెసిడెంట్ మెడికల్ అధికారులు ఉంటారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో 8 ఆర్.ఎం.ఒ. పోస్టులుండగా నలుగురు విధుల్లో ఉన్నారు. మరో నాలుగు ఖాళీగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా ప్రకటనతో ఈ పోస్టులు భర్తీ అయ్యే అవకాశముంది. ఇప్పటి వరకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు ఒప్పంద విధానంలో పనిచేస్తుండగా ఆయా పోస్టుల్లోనూ రెగ్యులర్గా సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో భర్తీ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజావాణికి వినతుల వెల్లువ
[ 02-07-2024]
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్లో ఓపికగా స్వీకరించారు. -
మీసేవలో నగదు రహిత చెల్లింపులకు మిశ్రమ స్పందన
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, రెవెన్యూ అవసరాలకు ఇప్పుడంతా మీసేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు అందించే సేవలకు గానూ ప్రభుత్వం రుసుంలు వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ రుసుంల వివరాలు కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలి. -
పచ్చని సంకల్పం
[ 02-07-2024]
చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది. -
ఉన్నత సమస్యలు
[ 02-07-2024]
మెట్పల్లిలో ఉన్నత చదువు సమస్యలకు నెలవుగా మారింది. ఏళ్లు గడుస్తున్నా సరైన వసతులు సమకూరక విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలు కరవై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
[ 02-07-2024]
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక
[ 02-07-2024]
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మూడో విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను సోమవారం నిర్వహించారు. -
వసూళ్లు పక్కా.. నిర్వహణ మరి?
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లాలో రాజీవ్ రహదారిపై రెండు టోల్ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి. -
నియామకాలపై నీలినీడలు
[ 02-07-2024]
జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్ కోర్సును ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులయ్యాయి. -
రాజన్న ఆలయ ఈవోగా వినోద్రెడ్డి బాధ్యతల స్వీకరణ
[ 02-07-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా వినోద్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్ అనారోగ్య కారణాలతో సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో రామకృష్ణ గత నెల 30 వరకు అదనపు బాధ్యతలు నిర్వహించారు. -
నేడు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన
[ 02-07-2024]
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రామగుండం నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి 11 గంటలకు చేరుకోనున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
[ 02-07-2024]
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
[ 02-07-2024]
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లోని యూనియన్ బ్యాంక్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ నుంచి భారీగా పొగ వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రేషన్ సరకుల వ్యాన్పై జగన్ బొమ్మ.. రెవెన్యూ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
-
హైదరాబాద్లో ఐపీఎస్ వర్సెస్ ఎమ్మెల్యే..!
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం
-
నేపాల్కు పాకిన వైకాపా అక్రమాలు
-
పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం
-
శాఖల్లో మార్పులు జరిగితే సీతక్కకు హోం!