నిధులున్నా పనులు జాప్యం
వర్షాకాలం ప్రారంభమైతే చాలా పల్లెల నుంచి మండల.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రయాస తప్పదు. ఒక్కసారిగా కురిసే వర్షంతో వరద రహదారులు.. లోలెవల్ కాజ్వేలపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.
అసంపూర్తి వారధులతో ప్రయాణం నరకం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
మానేరు వాగుపై లింగన్నపేట వద్ద వంతెన నిర్మించే ప్రాంతం
వర్షాకాలం ప్రారంభమైతే చాలా పల్లెల నుంచి మండల.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రయాస తప్పదు. ఒక్కసారిగా కురిసే వర్షంతో వరద రహదారులు.. లోలెవల్ కాజ్వేలపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు అత్యవసర వైద్యసేవలు, ఇతరత్రాల పనులకు ప్రత్యామ్నాయం మార్గాలు చూసుకోవాలి.. లేదంటే అదే వరద ప్రవాహాన్ని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. వాగులపై కాజ్వేలు ఉన్నచోట వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరైన చోట పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరికొన్నిచోట్ల మంజూరైన నిధులు ప్రభుత్వం మారడంతో వెనక్కి వెళ్లాయి. వంతెనల నిర్మాణాలు జరిగి అప్రోచ్ రహదారుల్లేక రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో రెండేళ్లుగా వాగులు, వంకలపై వంతెనల నిర్మాణాలకు విడతలవారీగా నిధులు మంజూరయ్యాయి. కాగా ఇప్పటికీ ఎక్కడా పనులు పూర్తయిన దాఖలాల్లేవు. అధికారుల పర్యవేక్షణాలోపం.. గుత్తేదారుల అలసత్వం పనులు సాగక రాకపోలకు అవస్థలు తప్పడంలేదు. వాగులు, వంకలు ఉన్న ప్రాంతాల్లో రహదారిపై నుంచి నీరు ప్రవహించినపుడు బారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను మళ్లిస్తున్నారు.
హన్మాజీపేట వద్ద వంతెన నిర్మాణ ప్రాంతంలో
వరద కోతకు గురైన తాత్కాలిక రహదారి
- గంభీరావుపేట మండలం లింగన్నపేట వద్ద మానేరువాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.10.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏడాది క్రితం పనులు ప్రారంభించిన గుత్తేదారులు పాత వంతెన శిథిలాలను తొలగించారు. పిల్లర్ల నిర్మాణాలకు గుంతలు తీశారు. తాత్కాలికంగా వాగులో మట్టిదారిని నిర్మించారు. ప్రధాన పనులు ప్రారంభంకాలేదు. ఇదే మండలం మల్లుపల్లి వద్ద లోతువాగు నుంచి వచ్చే వరదకు రహదారి ఏటా కోతకు గురవుతుంది. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. ఈ మార్గంలో ముస్తాబాద్, ముచ్చర్ల, కామారెడ్డి నుంచి గంభీరావుపేట మీదుగా ముస్తాబాద్, సిద్దిపేట, దుబ్బాకకు వెళ్లేవారు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
- సిరిసిల్ల- మరిమడ్ల మార్గంలో వెంకట్రావుపేట వద్ద పెంటివాగుపై వంతెన నిర్మాణానికి ఏడాది క్రితం రూ.10 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభం కాలేదు. చిన్నపాటి వర్షానికే రహదారిపైకి వరదనీరు వచ్చిచేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
- కోనరావుపేట- వేములవాడ మండలాల మధ్య ఉన్న మూలవాగుపై మామిడిపల్లి- నిజామాబాద్, బావుసాయిపేట- వెంకట్రావుపేట, వట్టిమల్ల- నిమ్మపల్లి ప్రాంతంలో వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.54 కోట్లు మంజూరయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు టెండర్ల దశలో ఉన్నాయి. తీరా ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం మారడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. ఈ మూడు చోట్ల లోలెవల్ వంతెనలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోగా తాత్కాలికంగా పైపులు, మట్టితో రహదారిని నిర్మించారు. వరదకు ఇవీ కొట్టుకుపోయే స్థితిలో ఉన్నాయి.
- వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట వద్ద నక్కవాగుపై రూ.11.55 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్ వంతెన పిల్లర్ల దశలో నిలిచిపోయింది. బుధవారం కురిసిన వర్షానికి తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. లింగంపల్లి, మంగళపల్లి, సుద్దాల గ్రామాల వారు మారుపాక, నందికమాన్ మీదుగా వేములవాడకు వెళ్తున్నారు. వేములవాడ పట్టణ శివారులో బీరప్ప ఆలయం సమీపంలో మల్లారం రహదారిలో లోలెవల్ కాజ్వే శిథిలావస్థకు చేరింది. రెండేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోవడంలేదు. కోరుట్ల రహదారిలో ఎస్ఆర్ఆర్ కల్యాణ మండలం వద్ద మర్రిపల్లి మార్గంలోనూ లోలెవల్ కాజ్వే శిథిలావస్థకు చేరుకుంది.
- తంగళ్లపల్లి మండలం జిల్లెల-ముస్తాబాద్ మార్గంలో నక్కవాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం రూ.6.5 కోట్లు మంజూరయ్యాయి. అటవీశాఖ అనుమతులు రాక పనులు నిలిచిపోయాయి.
- ఎల్లారెడ్డిపేట-వీర్నపల్లి మార్గంలో అలస్మాస్పూర్, ఎల్లారెడ్డిపేట శివారులో వంతెనలు నిర్మించి దానికి అప్రోచ్ రహదారి నిర్మాణం మరిచారు. దీంతో వర్షాలకు వాహనదారులు రాకపోకలకు ఇబ్బందిగా మారింది
గడువులోగా పూర్తి
వంతెన నిర్మాణాలు ప్రారంభించిన గుత్తేదారులను వారి గడువులోగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లెల వంతెన నిర్మాణానికి రెండు నెలల్లో అటవీఅనుమతులు వస్తాయి. అప్పుడు పనులు ప్రారంభిస్తాం. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మార్గంలో అసంపూర్తిగా వంతెనల నిర్మాణం చేసిన గుత్తేదారును రద్దు చేశాం. అతనే మళ్లీ వచ్చి పనులు పూర్తయ్యేలా చూస్తానని చెప్పారు. నెలరోజుల్లో పనులు పూర్తిచేయాలని సూచించాం.
శ్యాంసుందర్, ఈఈ, రహదారులు భవనాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజావాణికి వినతుల వెల్లువ
[ 02-07-2024]
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్లో ఓపికగా స్వీకరించారు. -
మీసేవలో నగదు రహిత చెల్లింపులకు మిశ్రమ స్పందన
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, రెవెన్యూ అవసరాలకు ఇప్పుడంతా మీసేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు అందించే సేవలకు గానూ ప్రభుత్వం రుసుంలు వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ రుసుంల వివరాలు కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలి. -
పచ్చని సంకల్పం
[ 02-07-2024]
చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది. -
ఉన్నత సమస్యలు
[ 02-07-2024]
మెట్పల్లిలో ఉన్నత చదువు సమస్యలకు నెలవుగా మారింది. ఏళ్లు గడుస్తున్నా సరైన వసతులు సమకూరక విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలు కరవై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
[ 02-07-2024]
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక
[ 02-07-2024]
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మూడో విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను సోమవారం నిర్వహించారు. -
వసూళ్లు పక్కా.. నిర్వహణ మరి?
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లాలో రాజీవ్ రహదారిపై రెండు టోల్ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి. -
నియామకాలపై నీలినీడలు
[ 02-07-2024]
జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్ కోర్సును ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులయ్యాయి. -
రాజన్న ఆలయ ఈవోగా వినోద్రెడ్డి బాధ్యతల స్వీకరణ
[ 02-07-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా వినోద్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్ అనారోగ్య కారణాలతో సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో రామకృష్ణ గత నెల 30 వరకు అదనపు బాధ్యతలు నిర్వహించారు. -
నేడు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన
[ 02-07-2024]
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రామగుండం నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి 11 గంటలకు చేరుకోనున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
[ 02-07-2024]
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
[ 02-07-2024]
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లోని యూనియన్ బ్యాంక్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ నుంచి భారీగా పొగ వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. పాలనలో మార్పు కనిపించాలి: చంద్రబాబు
-
టీషర్ట్, చిరిగిన జీన్స్ ధరించి కాలేజీకి రావొద్దు!
-
మీకు వచ్చింది 99/100 కాదు.. 99/543: కాంగ్రెస్పై మోదీ సెటైర్లు
-
‘నీపై దయచూపడమా..?’: కుమార్తె గర్భానికి కారణమైన తండ్రికి 101 ఏళ్ల జైలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ముంబయి అల్లర్ల నిందితుడు.. 31 ఏళ్ల తర్వాత చిక్కాడు!