ఆలస్యమైనా.. అదను దాటలేదు
ఈ వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో లోటువర్షపాతమే నెలకొనగా మున్ముందు కురిసే వర్షాలపైనే పైర్లసాగు ఆధారపడి ఉందని పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ గాదె శ్రీనివాస్ తెలిపారు. సాగు యాజమాన్యాన్ని ‘న్యూస్టుడే’ ముఖాముఖి ద్వారా వివరించారు.
వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ జి.శ్రీనివాస్
జగిత్యాల వ్యవసాయం, న్యూస్టుడే
ఈ వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో లోటువర్షపాతమే నెలకొనగా మున్ముందు కురిసే వర్షాలపైనే పైర్లసాగు ఆధారపడి ఉందని పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ గాదె శ్రీనివాస్ తెలిపారు. సాగు యాజమాన్యాన్ని ‘న్యూస్టుడే’ ముఖాముఖి ద్వారా వివరించారు.
ప్రశ్న: ఆరుతడి పంటలను ఎప్పటివరకు విత్తుకోవచ్చు.?
జవాబు: ముందుగా పత్తి నాటినవారు మొక్కలు మొలవనిచోట పోగుడ్డలు పోయవచ్చు. కంది, పత్తిని జులై మొదటిపక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షాలు మొదలైనందున కనీసం 50-70 మి.మీ వర్షం కురిసిన తరువాతనే ఆరుతడి పంటలను విత్తుకోవాలి. సోయాబీన్ను జులై 10 వరకు, వర్షాధారంగా మక్కను ఈ నెలాఖరువరకు, నీటి పారుదలగా మక్కను జులై చివరి వరకు విత్తుకోవచ్చు. పసుపు, మక్కను మిశ్రమ పంటలుగా జులై మొదటిపక్షం వరకు విత్తుకోవచ్చు. పెసర, మినుము, అలసంద, అనుము, కూరగాయలు తదితర అన్నిరకాల పంటలను విత్తుకునేందుకు ప్రస్తుతం అదనుంది. జనుము, జీలుగలు పెరిగిన తరువాత నేలలో కలియదున్నాలి.
ప్ర: వర్షాలు ఆలస్యమైతే వరిసాగు అదను దాటుతుందా.?
జ: 9 లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణం అంచనాగల వరిలో 150 రోజుల కాలపరిమితిగల దీర్ఘకాలిక రకాలతో నార్లుపోసుకునే గడువు దాటింది. 135 రోజుల మధ్యకాలిక, 120 రోజుల స్వల్పకాలిక, 105 రోజుల అతి స్వల్పకాలిక వరి రకాలతో నార్లకు అదనుంది. మధ్యకాలిక రకాలతో ఈ నెలాఖరు వరకు, స్వల్పకాలిక రకాలతో జులై 15 వరకు, అతిస్వల్పకాలిక రకాలతో జులై నెలాఖరు వరకు నార్లు పోసుకునే వీలుంది. ఏ రకమైనా ఆగస్టు నెలాఖరు లోపు వరినాట్లు పూర్తికావాలి. నీటిలభ్యత, నూర్పిడి, మార్కెటింగ్ తదితరాలనుబట్టి సన్న లేదా దొడ్డురకాలు ఎన్నుకోవాలి.
ప్ర: మేలురకం విత్తనాలను ఎక్కడి నుంచి తీసుకోవాలి.?
జ: ఇటీవలే విత్తనమేళా జరిపి రైతులకు విత్తనాలను అందించాం. సూటిరకం వరిలో బ్రీడర్, ఫౌండేషన్, ట్రూత్ఫుల్, సర్టిఫైడ్ విత్తనాలను లేదా రైతు విత్తనాన్ని తీసుకుని సాగు చేయవచ్చు. ఏ పంటయినా సరే సూటిరకాల్లో ప్రతిసీజనుకు నూతనంగా విత్తనాన్ని కొనాల్సిన అవసరంలేదు రైతు విత్తనాన్ని వాడుకోవచ్చు. కేవలం సంకర రకాల్లోనే ప్రతిపంటకూ నూతనంగా విత్తనాన్ని కొనాలి. వ్యవసాయశాఖ అథీకృత డీలర్లు, దుకాణాల్లోనే బిల్లులపై విత్తనాలను కొనాలి. గ్రామాల్లో నేరుగా విక్రయించే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను కొనవద్దు, వాడవద్దు. విత్తనమొలకశాతం పరీక్షించాలి. నీటిలభ్యత, నేలలకు అనువైన, చీడపీడలను తట్టుకునే విత్తనాలను తీసుకోవాలి.
ప్ర: రైతులకు మీరిచ్చే సలహా ఏమిటి?
జ: విత్తనోత్పత్తి చేసే రైతులు కంపెనీలచే ముందస్తు రాతపూర్వక ఒప్పందాలను చేసుకోవాలి. వరి, వేరుసెనగ, నువ్వులు తదితర రకాల మినీకిట్స్ను పొందిన రైతులు విత్తనాలను అభివృద్ధిచేసి తోటిరైతులకు చేరవేయాలి. రైతులు వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు, శాస్త్రవేత్తల సూచనలను పాటించాలి. పంటలపై సమస్యలువస్తే అధికారులు లేదా శాస్త్రవేత్తలను సంప్రదించాలి గానీ నేరుగా దుకాణాల్లో మందులను కొని పిచికారీ చేయవద్దు. భూసార పరీక్షల ఫలితాలను అనుగుణంగానే రసాయన ఎరువులను వాడాలి. పైర్లపై సమస్యలుంటే గుర్తించేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని పంపిస్తాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజావాణికి వినతుల వెల్లువ
[ 02-07-2024]
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్లో ఓపికగా స్వీకరించారు. -
మీసేవలో నగదు రహిత చెల్లింపులకు మిశ్రమ స్పందన
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, రెవెన్యూ అవసరాలకు ఇప్పుడంతా మీసేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు అందించే సేవలకు గానూ ప్రభుత్వం రుసుంలు వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ రుసుంల వివరాలు కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలి. -
పచ్చని సంకల్పం
[ 02-07-2024]
చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది. -
ఉన్నత సమస్యలు
[ 02-07-2024]
మెట్పల్లిలో ఉన్నత చదువు సమస్యలకు నెలవుగా మారింది. ఏళ్లు గడుస్తున్నా సరైన వసతులు సమకూరక విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలు కరవై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
[ 02-07-2024]
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక
[ 02-07-2024]
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మూడో విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను సోమవారం నిర్వహించారు. -
వసూళ్లు పక్కా.. నిర్వహణ మరి?
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లాలో రాజీవ్ రహదారిపై రెండు టోల్ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి. -
నియామకాలపై నీలినీడలు
[ 02-07-2024]
జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్ కోర్సును ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులయ్యాయి. -
రాజన్న ఆలయ ఈవోగా వినోద్రెడ్డి బాధ్యతల స్వీకరణ
[ 02-07-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా వినోద్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్ అనారోగ్య కారణాలతో సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో రామకృష్ణ గత నెల 30 వరకు అదనపు బాధ్యతలు నిర్వహించారు. -
నేడు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన
[ 02-07-2024]
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రామగుండం నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి 11 గంటలకు చేరుకోనున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
[ 02-07-2024]
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
[ 02-07-2024]
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లోని యూనియన్ బ్యాంక్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ నుంచి భారీగా పొగ వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బీఎస్ఎన్ఎల్ రూ.249 ప్లాన్.. 45 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా
-
రోజులో ఆ టైమ్ నాకు ఇంపార్టెంట్: దినచర్య గురించి జెఫ్ బెజోస్ ఏం చెప్పారంటే?
-
ఆ వీడియో చేసినందుకు చిరంజీవికి ధన్యవాదాలు: సీఎం రేవంత్రెడ్డి
-
‘రాజాసాబ్’ స్టోరీ లైన్ వైరల్.. ఫన్నీ రిప్లై ఇచ్చిన నిర్మాత
-
శారదా పీఠానికి కేటాయించిన ఆ 15 ఎకరాలు రద్దు చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి
-
టీజీఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్