ఫోన్ కొట్టు పరిష్కారం పట్టు
పిల్లలను వేధిస్తున్నారా.. ఈవ్టీజింగ్తో భయ పెడుతున్నారా.. అత్యవసర వైద్యం అందాలా.. రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయో.. అగ్ని ప్రమాదం జరిగిందా.. ఇలాంటి పలు సమస్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ కేంద్రాలు, టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చాయి.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం, సుభాష్నగర్
పిల్లలను వేధిస్తున్నారా.. ఈవ్టీజింగ్తో భయ పెడుతున్నారా.. అత్యవసర వైద్యం అందాలా.. రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయో.. అగ్ని ప్రమాదం జరిగిందా.. ఇలాంటి పలు సమస్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ కేంద్రాలు, టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చాయి. ఒక ఫోన్ కొడితే చాలు అధికారులు వెంటనే మీ ముంగిటకు చేరి, సమస్య పరిష్కారానికి దోహదపడతారు. అలాంటి ఫోన్ నంబర్లపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
108 అన్ని రకాల వైద్యం కోసం
ఎలాంటి అత్యవసర వైద్యం కావాలన్నా, ప్రమాదంలో గాయపడిన వెంటనే వచ్చి తీసుకెళ్లేందుకు 108 నంబర్ ఉపయోగపడుతుంది. ఫోన్ చేసిన వారు వివరాలను స్పష్టంగా చెప్పాలి. తెలిపిన చోటుకు కుయ్..కుయ్ అంటూ వాహనం వచ్చి చేరుతుంది. మెడికల్ టెక్నీషియన్ ప్రథమ చికిత్స అందిస్తూ సమీప ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తారు.
100 పోలీసు సాయం
శాంతి భద్రతల సమస్యతో సతమతమవుతుంటే, ఏదైన విపత్కర పరిస్థితి వచ్చినా, దొంగలు వచ్చినా ఈ నంబర్కు డయల్ చేస్తే చాలు వెంటనే సమీప పోలీసుస్టేషన్ నుంచి పోలీసులు వచ్చి ఆదుకుంటారు.
1091 ఈవ్టీజింగ్..
ఈ నంబర్ కంట్రోల్రూం నంబర్. ఎవరైనా ఈవ్టీజింగ్కు పాల్పడితే ఈ నంబర్ను సంప్రదించాలి. వారి వివరాలు సేకరించి వేధించే వారి భరతం పడతారు.
1098 పిల్లల వేధింపులు..
ఎవరైనా పిల్లలను వేధింపులకు గురి చేసినా.. బాలలతో పనులు చేయించినా 1098కి కాల్ చేస్తే బాలల సంరక్షణ సమితి, పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి చర్యలు చేపడతారు.
181 గృహహింస
గృహహింస, వరకట్నం వంటి వాటి పేరిట మహిళలను వేధిస్తే పోలీసులు, మహిళా సంక్షేమ విభాగం వారు మీ వద్దకు చేరుకొని తగిన పరిష్కారం చూపుతారు.
18001801551 కిసాన్ కాల్ సెంటర్
దేశంలో 25 చోట్ల కిసాన్ కాల్ సెంటర్లు ఉన్నాయి. రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ నంబర్ను సంప్రదిస్తే సమీప వ్యవసాయ అధికారికి సమాచారం ఇస్తారు. తగిన పరిష్కారం చూపుతారు.
18002004599
ఎయిర్పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల సమాచారంతో పాటు ఇతర వివరాలను తెలుసుకోవడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది.
18001805232 తపాలా సేవలు
తపాలా శాఖకు సంబంధించి సమస్య ఉన్నా, బీమా వివరాలు కావాలన్నా ఈ నంబర్కు కాల్ చేస్తే కావల్సిన వివరాలను అందిస్తారని అధికారులు చెబుతున్నారు.
102 గర్భిణుల కోసం
గ్రామీణ ప్రాంతాలలో పురిటి నొప్పులతో బాధపడుతుంటే తక్షణ వైద్యం కావాలనుకునే వారు 102కు డయల్ చేసి మీ వివరాలు తెలిపితే తగిన సమయంలో 102 వాహనం మీ ఇంటి ముందుకు వాలిపోతుంది. వాహనంలో ఆశా కార్యకర్త లేదా ఏఎన్ఎం వచ్చి గర్భిణిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయిస్తారు. ఆ తర్వాత తిరిగి తీసుకు వస్తారు. పైసా ఖర్చు ఉండదు. ఆరు నెలలు, తొమ్మిది నెలల గర్భం ఉన్న వారిని కూడా వైద్య సదుపాయం కోసం గ్రామాల నుంచి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి తీసుకొస్తారు.
1950 ఓటరు నమోదు
ఓటరు జాబితాలో పేరును ఈ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. నమోదుకు కావాల్సిన ధ్రువపత్రాల వివరాలను తెలుసుకోవచ్చు. ఓటు తొలగింపు, పేరు మార్పిడి, ఓటరు చిరునామా మార్పులకు ఉపయోగపడుతుంది. ఎన్నికల సమయంలో ప్రలోభాలు పెడితే ఈ నంబర్కు సమాచారమిస్తే వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి తనిఖీ చేసి, కేసులు నమోదు చేస్తారు.
198 టెలికాం సేవలు
ఏ నెట్వర్క్ పరిధిలోనైనా సరే ఈ నంబర్కు డయల్ చేస్తే కావాల్సిన సమాచారం అందుతోంది. బిల్లుల వివరాలు, నెట్వర్క్ మారడం, బిల్లుల రీఛార్జీలు వంటివి తెలుసుకునే వీలుంది.
18002004455 ఉపాధి హామీ
ఉపాధి హామీ పథకంలో ఎలాంటి సమస్యపైనైనా సమాచారం ఇవ్వవచ్చు. అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వంటి అంశాలను నేరుగా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు. జాబ్కార్డులు ఇవ్వకపోయినా, సిబ్బంది విధులను విస్మరించినా దీని ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.
101 అగ్నిమాపక
హైదరాబాద్ కంట్రోల్ రూంతో ఈ నంబర్ను అనుసంధానం చేశారు. అగ్ని ప్రమాదం జరిగితే ఈ నంబర్కు సమాచారం ఇస్తే వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించి తగు విధంగా సహాయ పడతారు.
139 రైల్వే..
రైల్వేకు సంబంధించిన సమాచారానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది. దీనికి కాల్ చేస్తే అధికారులు అందుబాటులోకి వస్తారు. ఇంటిగ్రేటెడ్ రైల్వే హెల్ప్లైన్ ఇది. 12 విభిన్న భాషలలో అందుబాటులో ఉంది.
18004250028 విద్యుత్తు
విద్యుత్తు కనెక్షన్, ఇతర సమస్యలకు సంబంధించి ఈ టోల్ ఫ్రీ నంబర్ను వినియోగించుకోవాలి. ఈ నంబర్కు సమాచారం ఇస్తే సమస్యను నమోదు చేసుకొని పరిష్కారమైన తర్వాత కూడా మళ్లీ విద్యుత్తు శాఖ నుంచి ఫోన్ చేసి తెలుసుకుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజావాణికి వినతుల వెల్లువ
[ 02-07-2024]
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్లో ఓపికగా స్వీకరించారు. -
మీసేవలో నగదు రహిత చెల్లింపులకు మిశ్రమ స్పందన
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, రెవెన్యూ అవసరాలకు ఇప్పుడంతా మీసేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు అందించే సేవలకు గానూ ప్రభుత్వం రుసుంలు వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ రుసుంల వివరాలు కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలి. -
పచ్చని సంకల్పం
[ 02-07-2024]
చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది. -
ఉన్నత సమస్యలు
[ 02-07-2024]
మెట్పల్లిలో ఉన్నత చదువు సమస్యలకు నెలవుగా మారింది. ఏళ్లు గడుస్తున్నా సరైన వసతులు సమకూరక విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలు కరవై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
[ 02-07-2024]
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక
[ 02-07-2024]
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మూడో విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను సోమవారం నిర్వహించారు. -
వసూళ్లు పక్కా.. నిర్వహణ మరి?
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లాలో రాజీవ్ రహదారిపై రెండు టోల్ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి. -
నియామకాలపై నీలినీడలు
[ 02-07-2024]
జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్ కోర్సును ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులయ్యాయి. -
రాజన్న ఆలయ ఈవోగా వినోద్రెడ్డి బాధ్యతల స్వీకరణ
[ 02-07-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా వినోద్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్ అనారోగ్య కారణాలతో సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో రామకృష్ణ గత నెల 30 వరకు అదనపు బాధ్యతలు నిర్వహించారు. -
నేడు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన
[ 02-07-2024]
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రామగుండం నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి 11 గంటలకు చేరుకోనున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
[ 02-07-2024]
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
[ 02-07-2024]
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లోని యూనియన్ బ్యాంక్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ నుంచి భారీగా పొగ వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చండి: లోక్సభలో తెదేపా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
-
జగన్ నివాసం వెనుక రోడ్డులో.. అడ్డంకుల తొలగింపు
-
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
-
‘మై క్వీన్’ విష కౌగిలి.. అడుగడుగునా బాధితులే..
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!