తీరని ధరణి సమస్యలు!
భూ సమస్యల సమగ్ర పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న ధరణి పోర్టల్ దరఖాస్తుల పరిష్కారంపైనా దృష్టి పెట్టింది..
పరిష్కరించాల్సిన దరఖాస్తులు 23,953
రెండు రోజులే గడువు
ఈనాడు, పెద్దపల్లి, న్యూస్టుడే, కరీంనగర్ కలెక్టరేట్ : భూ సమస్యల సమగ్ర పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న ధరణి పోర్టల్ దరఖాస్తుల పరిష్కారంపైనా దృష్టి పెట్టింది.. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉంచిన అన్ని దరఖాస్తులను పరిష్కరించే దిశగా ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.. ఈ క్రమంలో రెండు విడతల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.. పోర్టల్లోని కొన్ని అంశాలను కలెక్టర్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లకు బదిలీ చేయాలని నిర్ణయించారు.. అన్నీ సిద్ధం చేసి లాగిన్ ఐడీలు ఇచ్చేలోపు లోక్సభ ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలు ముగియడంతో తాజాగా ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.. ఈ నెల 30 వరకు దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం గడువు విధించగా 29వ తేదీన జిల్లాల కలెక్టర్లతో భూ రికార్డులు, పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో అధికారులు దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టారు.
ః ఈ నెలాఖరులోపు భూ సమస్యలపై దరఖాస్తులు (జీఎల్ఎం), టీఎం-33 మ్యాడ్యుల్ సమస్యలతో పాటు స్పెషల్ డ్రైవ్ దరఖాస్తులను అధికారులు పరిష్కరించనున్నారు. అధికారులు పాత దస్త్రాలను వెలికితీసి పెండింగ్ ఎందుకు ఉందో తెలుసుకుని ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతున్నారు
- లోక్సభ ఎన్నికల కోడ్ సమయంలో కలెక్టరేట్లలో జీఎల్ఎం, టీఎం-33 ఆర్జీలను పరిష్కరించే ప్రక్రియ వాయిదా పడింది. ధరణి దరఖాస్తులు వేలల్లో వస్తుండటంతో గతంలో కలెక్టర్కు పరిష్కరించే అధికారం నుంచి ఆర్డీవో, తహసీల్దార్లకు సైతం సమస్యలు పరిష్కరించేలా లాగిన్ సౌకర్యం కల్పించారు.
- ఆర్డీవోలకు పట్టాదారు పాసు పుస్తకం లేకుండా నాలా మార్పు, ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, ‘ఆధార్ కార్డులు’ లేని ప్రవాస భారతీయులకు చెందిన భూ సమస్యలు, కోర్టు కేసులను పరిష్కరించేందుకు వీరికి అవకాశం కల్పించారు. తహసీల్దార్లకు జీఎల్ఎంలోని కులం, లింగం, తండ్రి పేరు మార్పిడి బాధ్యతలు అప్పగించారు.
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం దరఖాస్తులు 1,61,695 రాగా ఇందులో 92,539 రెవెన్యూ సమస్యలు పరిష్కరించారు. 45,203 దరఖాస్తులను తిరస్కరించగా ఇంకా 23,953 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. రెండ్రోజులే సమయం ఉండటంతో వీటిని పరిష్కరించడం గగనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ముమ్మర కసరత్తు
జూన్ నెలాఖరులోగా ధరణి పోర్టల్లోని సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు పెండింగ్లో ఉన్న ధరణి దస్త్రాలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరిస్తున్నప్పటికి చిన్న చిన్న తప్పిదాలున్న వాటిని తిరస్కరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హద్దులు సరిగా లేవని, ప్రవాసీయుల తరఫున అతని బంధువులు దరఖాస్తు చేస్తే మిస్సింగ్ సర్వే నంబర్లు పోర్టల్లో లేవని, మాన్యువల్ పహాణీలో ఇతరుల పేర్లు ఉన్నాయని సాకులు చెబుతూ తిరస్కరిస్తున్నారని వాపోతున్నారు..
భిన్న కారణాలు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సివిల్ కోర్టుల్లో ఉన్న వివాదాలకు సంబంధించి పలు సమస్యలు ధరణిలో పెండింగ్లో ఉన్నాయి. కోర్టు తీర్పు వచ్చేవరకు ఈ సమస్యలు అలాగే ఉండనున్నాయి.
- ధరణిలోని భూముల వివరాలకు అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల వద్ద ఉన్న రికార్డులకు పొంతన లేదు.
- నిషేధిత జాబితా(22-ఏ)లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ చెల్లదు. క్రయ, విక్రయాలు చేసే అవకాశాలు లేవు. అయితే ఈ భూములు తమవే అని సమస్య పరిష్కరించాలని చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. కాని నిషేధిత జాబితాలో ఉండటంతో పరిష్కారానికి నోచుకోవడం లేదు.
- ధరణిలో నమోదైన అనంతరం ‘లింక్’ డాక్యుమెంట్ల వివరాలు కనిపించడం లేదు.
- రైతులు మరణించకున్నా..మరణించినటు ధ్రువీకరణ పత్రాలు తెచ్చినవారికి మ్యుటేషన్లు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజావాణికి వినతుల వెల్లువ
[ 02-07-2024]
ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు, వినతులు వెల్లువలా వచ్చాయి. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చారు. ఒక రోజే 370 దరఖాస్తులు రావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెకర్లు ప్రఫుల్దేశాయ్, లక్ష్మీకిరణ్లో ఓపికగా స్వీకరించారు. -
మీసేవలో నగదు రహిత చెల్లింపులకు మిశ్రమ స్పందన
[ 02-07-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, రెవెన్యూ అవసరాలకు ఇప్పుడంతా మీసేవ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. ఈ కేంద్రం నిర్వాహకులు అందించే సేవలకు గానూ ప్రభుత్వం రుసుంలు వసూలు చేయాలని నిర్దేశించింది. ఈ రుసుంల వివరాలు కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలి. -
పచ్చని సంకల్పం
[ 02-07-2024]
చెట్లు.. మండుటెండల్లో నీడను, భారీ వర్షంలో రక్షణనిస్తాయి. మనం వెళ్లే దారికిరువైపులా స్వాగతం పలుకుతాయి. ఇంటికి అందాన్నిచే తోరణాలు అవుతాయి. ప్రతి జీవికి నిరంతరం అవసరాల్లో అన్ని విధాలా సహాయపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాల్సిన అవసరముంది. -
ఉన్నత సమస్యలు
[ 02-07-2024]
మెట్పల్లిలో ఉన్నత చదువు సమస్యలకు నెలవుగా మారింది. ఏళ్లు గడుస్తున్నా సరైన వసతులు సమకూరక విద్యార్థులు అవస్థలు పడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలు కరవై ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రజావాణి వినతులు పరిష్కరించాలి
[ 02-07-2024]
ప్రజావాణి వినతులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
[ 02-07-2024]
నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక
[ 02-07-2024]
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మూడో విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను సోమవారం నిర్వహించారు. -
వసూళ్లు పక్కా.. నిర్వహణ మరి?
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లాలో రాజీవ్ రహదారిపై రెండు టోల్ ప్లాజాలు ఉన్నా నిర్వహణ మాత్రం సరిగా లేదు.. ఏళ్ల తరబడి అవస్థల ప్రయాణం వాహనదారులకు తప్పడం లేదు.. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా వెళ్లే 108 కి.మీ.ల మేర ఈ రహదారిపై పలు చోట్ల గుంతలు దర్శనమిస్తాయి. -
నియామకాలపై నీలినీడలు
[ 02-07-2024]
జిల్లాకు మంజూరైన ఎస్సీ అధ్యయన కేంద్రం (స్టడీ సర్కిల్)లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిలో అయిదు నెలల ఫౌండేషన్ కోర్సును ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించారు. వంద మంది మహిళలు, పురుషులకు వసతితో కూడిన శిక్షణ ఇస్తున్నారు. -
ఉమ్మడి జిల్లాలో తొలి రోజు 16 కేసులు
[ 02-07-2024]
కొత్త న్యాయ, నేర చట్టాల అమలు ప్రారంభమైంది.. తొలి రోజైన సోమవారం రాత్రి 8 గంటల వరకు ఉమ్మడి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా పట్టణంలోనే నమోదవడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగు కేసులయ్యాయి. -
రాజన్న ఆలయ ఈవోగా వినోద్రెడ్డి బాధ్యతల స్వీకరణ
[ 02-07-2024]
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవోగా వినోద్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్ అనారోగ్య కారణాలతో సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో రామకృష్ణ గత నెల 30 వరకు అదనపు బాధ్యతలు నిర్వహించారు. -
నేడు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన
[ 02-07-2024]
జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రామగుండం నుంచి బయలుదేరి జిల్లా కేంద్రానికి 11 గంటలకు చేరుకోనున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
[ 02-07-2024]
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లలతో ఎవరైనా పనులు చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం
[ 02-07-2024]
కరీంనగర్ బస్టాండ్ కాంప్లెక్స్లోని యూనియన్ బ్యాంక్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ నుంచి భారీగా పొగ వస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రం నిధులను వైకాపా పక్కదారి పట్టించింది: నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి
-
బ్యాంకింగ్ షేర్లలో ఒత్తిడి.. ఆరంభ లాభాలు ఆవిరి
-
ప్రైవేటు పాఠశాలలో స్లాబ్ పెచ్చులూడి ఆరుగురు విద్యార్థులకు గాయాలు
-
విజయ్ మాల్యాపై నాన్- బెయిలబుల్ వారెంట్.. జారీ చేసిన ముంబయి కోర్టు
-
9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయిని 48 గంటల్లో పట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్
-
భారత్-పాక్ సంబంధాలపై.. అమెరికా ఏమన్నదంటే?