Kondagattu: కొండగట్టులో ఇంటి దొంగలు
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నది పాత సామెత.
అంజన్న ఆలయం
న్యూస్టుడే, మల్యాల: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నది పాత సామెత. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దాదాపు 50 వరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నా ఆలయంలో తరచూ సిబ్బంది చేతివాటం విమర్శలకు తావిస్తోంది. ఆలయం ముందు ప్రత్యేక పోలీసు ఔటుపోస్టు, రక్షణ సిబ్బంది, హోంగార్డులు, ప్రైవేటు సెక్యూరిటీ ఉన్నా ఆలయంలో చోరీలపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రసాదం తయారి కేంద్రంలో ఔట్సోర్సింగ్ కింద 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి బుధవారం హుండీ లెక్కింపు సందర్భంగా రూ.11,010 తస్కరిస్తూ పట్టుబడటం పరిస్థితులకు అద్దం పడుతోంది.
గతంలో సంఘటనలు..
- 2007లో హుండీ లెక్కింపు సందర్భంగా ఆలయంలో పనిచేసే ఉద్యోగి రూ.500 నోట్ల కట్టను తస్కరిస్తూ పట్టుబడి సస్పెన్షన్కు గురయ్యారు.
- 2007 మార్చి17న ఆలయంలో పనిచేసే వేదపండితుడు హుండీ లెక్కింపులో పాల్గొని రూ.1650 దొంగిలించి కానిస్టేబుల్ చేతికి చిక్సి సస్పెండయ్యారు.
- 2008లో హుండీ లెక్కింపు సమయంలో ఓ ఉద్యోగి ఆభరణాన్ని మింగినట్లు ఫిర్యాదు రావడంతో మరుసటిరోజు అధికారులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించగా కడుపులో ఆభరణం లేదని తేల్చిచెప్పారు.
- 2023 ఫిబ్రవరి 23 అర్ధరాత్రి అంతర్రాష్ట దొంగల ముఠాకు చెందిన 8 మంది ఆంజనేయస్వామి ఆలయంలో దాదాపు 35 కిలోల ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
- 2023 ఆగస్టులో ఆలయ పాలకవర్గంలోని ఓ ప్రముఖ వ్యక్తి హుండీ లెక్కింపు రోజు స్వామివారికి చెందిన నగను మాయం చేసినట్లు ఆలయ పాలకవర్గంలోని సభ్యుడు, స్థానిక సర్పంచి అధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు వ్యక్తిని అధికారులు సస్పెండు చేశారు.
- గతంలో ఆలయంలో పనిచేసే ఓ స్వీపరు అభిషేకం సందర్భంగా భక్తురాలి ఉంగరాన్ని మాయం చేయగా సదరు భక్తురాలు పోలీసులను ఆశ్రయించడంతో చివరికి నాటకీయంగా ఉంగరాన్ని పోలీసుల ద్వారా భక్తురాలికి అప్పగించారు.
అక్రమ వసూళ్లపై నియంత్రణ కరవు
కొండగట్టులో కొందరు గుత్తేదారుల వద్ద పనిచేసే వ్యక్తులు, ఆలయ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కొబ్బరికాయలు కొట్టే చోట ఎలాంటి రుసుము లేకపోయినా భక్తుల నుంచి రూ.10 చొప్పున వసూళ్లు చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు పేర్కొంటున్నారు. కొందరు సిబ్బంది, అర్చకులు బడా కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలతో చనువు పెంచుకుని ఆలయంలో పనులు చేపట్టేపేరుతో భారీగానే దండుకుంటున్నట్లు ఆరోపణలున్నా ఉన్నతాధికారుల స్పందనలేదు. గతంలో జయంతి ఉత్సవాలు, ఇతర సందర్భాల్లో వివిధ సేవలకు సంబంధించిన టిక్కెట్ల రీఇష్యూ కూడా అయినట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. ఆలయంలో నిఘా పెంచి ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప సిబ్బంది చేతివాటం అక్రమాలు నివారించడం అసాధ్యమని భక్తులు పేర్కొంటున్నారు. ఇటీవల కొందరు నాయకులు తమకు నచ్చినవారిని ఆలయంలో ఔట్సోర్సింగ్ కింద నియమించి వారి నుంచి భారీగానే డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె నుంచి జడ్పీ దాకా ప్రత్యేకాధికారుల పాలన
[ 05-07-2024]
గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు.. ఇలా స్థానిక సంస్థల్లో కీలకమైన పరిపాలన పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి. -
రెండు నెలల్లో ఉద్యోగ విరమణ.. అనిశాకు పట్టుబడిన డీసీఎంఎస్ మేనేజర్
[ 05-07-2024]
పదవీ విరమణకు రెండు నెలల గడువు ఉందనే ఆలోచన కూడా లేకుండా కాసులకు కక్కుర్తిపడిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ అనిశాకు పట్టుబడటం ఉమ్మడి జిల్లాలోని ఆ సంస్థ కార్యాలయాల్లో చర్చనీయాంశమైంది. -
కందులు అ‘ధర’హో
[ 05-07-2024]
చొప్పదండి జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది కందులకు మంచి ధర పలుకుతోంది. పంట సీజన్ ముగిసినా ధర మాత్రం తగ్గడంలేదు. -
ఉచిత వైద్యం.. సేవే ప్రధానం
[ 05-07-2024]
రోగమేదైనా..పేదలైనా.. మధ్యతరగతైనా డబ్బులు లేకుండానే అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యాన్ని సాయి స్వాస్థ్య వెల్నెస్ కేంద్రం నిర్వహిస్తోంది. -
మేలైన వంగడాలు.. సమగ్ర యాజమాన్యం
[ 05-07-2024]
వానాకాలం పైర్లసాగులో రైతులకు తోడుగా నిలిచేలా పొలాస ప్రాంతీయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలతో గురువారం ‘ఈనాడు’ ఫోన్ఇన్ కార్యక్రమాన్ని చేపట్టింది. -
ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్లు
[ 05-07-2024]
ఉమ్మడి జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో వందలాది ఎకరాల్లో భూములుండగా, అందులో కొన్ని ఎకరాలలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. -
గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
[ 05-07-2024]
ధర్మపురిలో ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ పేర్కొన్నారు -
కొత్త జీవితం ప్రారంభిస్తాం
[ 05-07-2024]
గెట్ల పంచాయతీ తోపులాటలో బంధువు చనిపోయిన కేసుతో తండ్రి, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. 2010 నుంచి 2024 వరకు గడిపిన జైలు జీవితం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని వారు అంటున్నారు -
రెండు సహకార సంఘాలకు రాష్ట్ర స్థాయి పురస్కారం
[ 05-07-2024]
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యాయి -
తనిఖీలు విస్తృతం.. అక్రమాలు యథాతథం
[ 05-07-2024]
పెద్దపల్లికి చెందిన ఓ బయో ఫెర్టిలైజర్ కంపెనీ డీలర్ కొన్నేళ్ల కిందట జన్మదిన వేడుకలు నిర్వహించారు. విందు ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారిని ఆహ్వానించారు. -
పసుపు.. ఎరుపు హెచ్చరిక కార్డులు
[ 05-07-2024]
గని ప్రమాదాలపై సింగరేణి యాజమాన్యం కార్మికులకు పసుపు.. ఎరుపు కార్డులను(ఎల్లో, రెడ్) ప్రవేశపెట్టింది. రెండు నెలల క్రితమే ఈ ఆదేశాలు విడుదల చేసినా ఎన్నికల కోడ్ కారణంగా బయటకు రాలేదు -
పదిలో కష్టపడ్డారు... ట్రిపుల్ ఐటీ సాధించారు
[ 05-07-2024]
తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశారు. వారు పడిన బాధలు తాము భవిష్యత్తులో చూడకూడదని భావించారు. ఇందుకు ప్రణాళిక ప్రకారం చదివారు. -
వృక్ష రాజసం... హరిత శోభితం
[ 05-07-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని రెండు వైపులా ఉన్న బైపాస్ రోడ్లు పచ్చని చెట్లు, పూలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
-
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!