Nizamabad: మూలుగ బొక్క కోసం రద్దయిన పెళ్లి సంబంధం
బలగం సినిమాలో మూలుగ(పులుగు) బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ అందరికీ తెలిసిందే..
కోరుట్ల గ్రామీణం, న్యూస్టుడే: బలగం సినిమాలో మూలుగ(పులుగు) బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ అందరికీ తెలిసిందే. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవతో పెళ్లి సంబంధం రద్దయిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. కట్నకానుకలు సైతం మాట్లాడుకున్నారు. నవంబరు మొదటి వారంలో నిశ్చితార్థం సందర్భంగా అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. గొడవ పెద్దదై చివరికి పోలీస్స్టేషన్ వరకు వెళ్లింది. తర్వాత ఇరువర్గాలు శాంతించినప్పటికీ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె నుంచి జడ్పీ దాకా ప్రత్యేకాధికారుల పాలన
[ 05-07-2024]
గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు.. ఇలా స్థానిక సంస్థల్లో కీలకమైన పరిపాలన పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి. -
రెండు నెలల్లో ఉద్యోగ విరమణ.. అనిశాకు పట్టుబడిన డీసీఎంఎస్ మేనేజర్
[ 05-07-2024]
పదవీ విరమణకు రెండు నెలల గడువు ఉందనే ఆలోచన కూడా లేకుండా కాసులకు కక్కుర్తిపడిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ అనిశాకు పట్టుబడటం ఉమ్మడి జిల్లాలోని ఆ సంస్థ కార్యాలయాల్లో చర్చనీయాంశమైంది. -
కందులు అ‘ధర’హో
[ 05-07-2024]
చొప్పదండి జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది కందులకు మంచి ధర పలుకుతోంది. పంట సీజన్ ముగిసినా ధర మాత్రం తగ్గడంలేదు. -
ఉచిత వైద్యం.. సేవే ప్రధానం
[ 05-07-2024]
రోగమేదైనా..పేదలైనా.. మధ్యతరగతైనా డబ్బులు లేకుండానే అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యాన్ని సాయి స్వాస్థ్య వెల్నెస్ కేంద్రం నిర్వహిస్తోంది. -
మేలైన వంగడాలు.. సమగ్ర యాజమాన్యం
[ 05-07-2024]
వానాకాలం పైర్లసాగులో రైతులకు తోడుగా నిలిచేలా పొలాస ప్రాంతీయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలతో గురువారం ‘ఈనాడు’ ఫోన్ఇన్ కార్యక్రమాన్ని చేపట్టింది. -
ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్లు
[ 05-07-2024]
ఉమ్మడి జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో వందలాది ఎకరాల్లో భూములుండగా, అందులో కొన్ని ఎకరాలలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. -
గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
[ 05-07-2024]
ధర్మపురిలో ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ పేర్కొన్నారు -
కొత్త జీవితం ప్రారంభిస్తాం
[ 05-07-2024]
గెట్ల పంచాయతీ తోపులాటలో బంధువు చనిపోయిన కేసుతో తండ్రి, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. 2010 నుంచి 2024 వరకు గడిపిన జైలు జీవితం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని వారు అంటున్నారు -
రెండు సహకార సంఘాలకు రాష్ట్ర స్థాయి పురస్కారం
[ 05-07-2024]
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యాయి -
తనిఖీలు విస్తృతం.. అక్రమాలు యథాతథం
[ 05-07-2024]
పెద్దపల్లికి చెందిన ఓ బయో ఫెర్టిలైజర్ కంపెనీ డీలర్ కొన్నేళ్ల కిందట జన్మదిన వేడుకలు నిర్వహించారు. విందు ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారిని ఆహ్వానించారు. -
పసుపు.. ఎరుపు హెచ్చరిక కార్డులు
[ 05-07-2024]
గని ప్రమాదాలపై సింగరేణి యాజమాన్యం కార్మికులకు పసుపు.. ఎరుపు కార్డులను(ఎల్లో, రెడ్) ప్రవేశపెట్టింది. రెండు నెలల క్రితమే ఈ ఆదేశాలు విడుదల చేసినా ఎన్నికల కోడ్ కారణంగా బయటకు రాలేదు -
పదిలో కష్టపడ్డారు... ట్రిపుల్ ఐటీ సాధించారు
[ 05-07-2024]
తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశారు. వారు పడిన బాధలు తాము భవిష్యత్తులో చూడకూడదని భావించారు. ఇందుకు ప్రణాళిక ప్రకారం చదివారు. -
వృక్ష రాజసం... హరిత శోభితం
[ 05-07-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని రెండు వైపులా ఉన్న బైపాస్ రోడ్లు పచ్చని చెట్లు, పూలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
-
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్
-
ఇప్పుడు 140+ కోట్ల మంది ఛాంపియన్లే: హార్దిక్ పాండ్య
-
బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి హవా.. 26 మంది గెలుపు!
-
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో పెద్ద తలకాయలను పట్టుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్
-
ఆ ప్రశ్నాపత్రాలు ఇస్తామంటే నమ్మొద్దు - ఎన్బీఈ హెచ్చరిక