Jagtial: రికార్డుల మాస్టారు.. 39 ఏళ్లలో చదువు చెప్పిన విద్యార్థుల వివరాల నమోదు
విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు గుర్తుంచుకుంటారు. కానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తను విద్యాబుద్ధలు నేర్పిన విద్యార్థుల వివరాలు రికార్డులో నమోదు చేసుకున్నారు.
తాను చదువు చెప్పిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మదన్మోహన్రావు
న్యూస్టుడే, జగిత్యాల గ్రామీణం: విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు గుర్తుంచుకుంటారు. కానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తను విద్యాబుద్ధలు నేర్పిన విద్యార్థుల వివరాలు రికార్డులో నమోదు చేసుకున్నారు. ఏ ఉపాధ్యాయుడైనా తన సర్వీసులో ఎంత మందికి పాఠాలు చెప్పావు అంటే లెక్కలు ఉండవు కానీ.. ఆ ఉపాధ్యాయుడి దగ్గర మాత్రం తన వద్ద విద్య నేర్చుకున్న ప్రతి విద్యార్థి వివరాలు లభిస్తాయి. ఆ వివరాల ఆధారంగా చరవాణిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థుల కుటుంబాల పరిస్థితి, యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన నందెల్లి మదన్మోహన్రావు 1984లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. మొదట రాయికల్ మండలం వీరాపూర్లో రెండేళ్లు, అదే మండలంలోని భూపతిపూర్లో 10 ఏళ్లు, కొత్తపేటలో ఏడాది, జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేటలో తొమ్మిదేళ్లు, తన సొంతూరు రామాజీపేటలో ఏడేళ్లు, ప్రస్తుతం అంతర్గాంలో 10 ఏళ్లుగా సాంఘికశాస్త్రం బోధిస్తున్నారు. 39 ఏళ్లుగా తను విద్య నేర్పిన ప్రతి విద్యార్థి వివరాలను నమోదు చేస్తూ వస్తున్నారు. వీరాపూర్లో 119 మందికి, భూపతిపూర్లో 942, కొత్తపేటలో 176, గోపాల్రావుపేట 408, రామాజీపేటలో 466, అంతర్గాంలో 557 మొత్తం 2678 మంది విద్యార్థులకు చదువు చెప్పారు. తనతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలు సైతం రికార్డుల్లో నమోదు చేసుకున్నారు.
వాట్సాప్లోనూ..
మాస్టారు 39 ఏళ్లుగా ఏడు పాఠశాలల్లో పని చేయగా అక్కడ చదువుకున్న బాలికలు, బాలురకు వేర్వేరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారి మంచి చెడులు అడిగి తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల వివరాలు సైతం నమోదు చేసుకని వారితో మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా అని అడిగి తెలుసుకుంటారు. తన వద్ద చదువుకుని చనిపోయిన వారి వివరాలు కూడా నమోదు చేసుకున్నారు. ఉన్నత ఉద్యోగాలు చేసే వారి వివరాలు, ఆ గమ్యానికి ఎలా చేరారు ఇలా అన్ని వివరాలు మిగతా వారితో పంచుకుని వారిని ప్రోత్సహిస్తుంటారు. 2010 నుంచి విద్యార్థుల ఫొటోలు కూడా దాచుకున్నారు.
చాలా ఆనందంగా ఉంది..
తన వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థి గొప్పవాడిగా ఎదిగితే ఆ ఉపాధ్యాయుడికి అంతకంటే ఆనందం ఏముంటుంది. చాలా మంది విద్యార్థులు సాఫ్ట్వేర్, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పోలీసు, ఇతర ఉద్యోగాలు, రాజకీయ నాయకులుగా ఉన్నారు. జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత నా శిష్యురాలు. కొత్తపేట, భూపతిపూర్, చింతలూర్ సర్పంచులు నా దగ్గర చదువు నేర్చుకున్నారు. వారి వివరాలు నమోదు చేసుకోవటంతో వారితో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను. నా దగ్గర చదువు నేర్చుకున్న వారు ఉన్నత స్థితిలో ఉండడం చాలా ఆనందంగా ఉంది.
మదన్మోహన్రావు, ఉపాధ్యాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్లె నుంచి జడ్పీ దాకా ప్రత్యేకాధికారుల పాలన
[ 05-07-2024]
గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు.. ఇలా స్థానిక సంస్థల్లో కీలకమైన పరిపాలన పగ్గాలు ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లాయి. -
రెండు నెలల్లో ఉద్యోగ విరమణ.. అనిశాకు పట్టుబడిన డీసీఎంఎస్ మేనేజర్
[ 05-07-2024]
పదవీ విరమణకు రెండు నెలల గడువు ఉందనే ఆలోచన కూడా లేకుండా కాసులకు కక్కుర్తిపడిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ అనిశాకు పట్టుబడటం ఉమ్మడి జిల్లాలోని ఆ సంస్థ కార్యాలయాల్లో చర్చనీయాంశమైంది. -
కందులు అ‘ధర’హో
[ 05-07-2024]
చొప్పదండి జువ్వాడి చొక్కారావు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ ఏడాది కందులకు మంచి ధర పలుకుతోంది. పంట సీజన్ ముగిసినా ధర మాత్రం తగ్గడంలేదు. -
ఉచిత వైద్యం.. సేవే ప్రధానం
[ 05-07-2024]
రోగమేదైనా..పేదలైనా.. మధ్యతరగతైనా డబ్బులు లేకుండానే అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యాన్ని సాయి స్వాస్థ్య వెల్నెస్ కేంద్రం నిర్వహిస్తోంది. -
మేలైన వంగడాలు.. సమగ్ర యాజమాన్యం
[ 05-07-2024]
వానాకాలం పైర్లసాగులో రైతులకు తోడుగా నిలిచేలా పొలాస ప్రాంతీయ పరిశోధనస్థానం శాస్త్రవేత్తలతో గురువారం ‘ఈనాడు’ ఫోన్ఇన్ కార్యక్రమాన్ని చేపట్టింది. -
ఆలయ భూముల్లో సోలార్ ప్లాంట్లు
[ 05-07-2024]
ఉమ్మడి జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో వందలాది ఎకరాల్లో భూములుండగా, అందులో కొన్ని ఎకరాలలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. -
గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
[ 05-07-2024]
ధర్మపురిలో ఇద్దరు గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ పేర్కొన్నారు -
కొత్త జీవితం ప్రారంభిస్తాం
[ 05-07-2024]
గెట్ల పంచాయతీ తోపులాటలో బంధువు చనిపోయిన కేసుతో తండ్రి, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.. 2010 నుంచి 2024 వరకు గడిపిన జైలు జీవితం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని వారు అంటున్నారు -
రెండు సహకార సంఘాలకు రాష్ట్ర స్థాయి పురస్కారం
[ 05-07-2024]
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలం అప్పన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యాయి -
తనిఖీలు విస్తృతం.. అక్రమాలు యథాతథం
[ 05-07-2024]
పెద్దపల్లికి చెందిన ఓ బయో ఫెర్టిలైజర్ కంపెనీ డీలర్ కొన్నేళ్ల కిందట జన్మదిన వేడుకలు నిర్వహించారు. విందు ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారిని ఆహ్వానించారు. -
పసుపు.. ఎరుపు హెచ్చరిక కార్డులు
[ 05-07-2024]
గని ప్రమాదాలపై సింగరేణి యాజమాన్యం కార్మికులకు పసుపు.. ఎరుపు కార్డులను(ఎల్లో, రెడ్) ప్రవేశపెట్టింది. రెండు నెలల క్రితమే ఈ ఆదేశాలు విడుదల చేసినా ఎన్నికల కోడ్ కారణంగా బయటకు రాలేదు -
పదిలో కష్టపడ్డారు... ట్రిపుల్ ఐటీ సాధించారు
[ 05-07-2024]
తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశారు. వారు పడిన బాధలు తాము భవిష్యత్తులో చూడకూడదని భావించారు. ఇందుకు ప్రణాళిక ప్రకారం చదివారు. -
వృక్ష రాజసం... హరిత శోభితం
[ 05-07-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని రెండు వైపులా ఉన్న బైపాస్ రోడ్లు పచ్చని చెట్లు, పూలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
-
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!