ACB: రెండు నెలల్లో ఉద్యోగ విరమణ.. అనిశాకు పట్టుబడిన డీసీఎంఎస్ మేనేజర్
పదవీ విరమణకు రెండు నెలల గడువు ఉందనే ఆలోచన కూడా లేకుండా కాసులకు కక్కుర్తిపడిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ అనిశాకు పట్టుబడటం ఉమ్మడి జిల్లాలోని ఆ సంస్థ కార్యాలయాల్లో చర్చనీయాంశమైంది.
డీసీఎంఎస్ కార్యాలయం
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం, నేరవార్తలు: పదవీ విరమణకు రెండు నెలల గడువు ఉందనే ఆలోచన కూడా లేకుండా కాసులకు కక్కుర్తిపడిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ మేనేజర్ అనిశాకు పట్టుబడటం ఉమ్మడి జిల్లాలోని ఆ సంస్థ కార్యాలయాల్లో చర్చనీయాంశమైంది. మేనేజర్కు సాయం చేస్తూ క్యాషియర్ కుమారస్వామి కూడా అనిశా వలలో చిక్కడం కింది స్థాయి ఉద్యోగులను కలవరపెడుతోంది. డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎరువు విక్రయాలు, ధాన్యం కొనుగోలు చేస్తుంటుంది. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, మెట్పల్లి తదితర ప్రాంతాల్లో దుకాణాల సముదాయాల నుంచి అద్దె రూపంలో సొసైటీకి ఆదాయం వస్తుంది. ఈ సంస్థ శాఖలు జిల్లా వ్యాప్తంగా 300కుపైగా ఉన్నా.. సగం వాటిలోనే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి.
17 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీసీఎంఎస్ యాసంగిలో 10 లక్షలు, వానాకాలంలో 7 లక్షల క్వింటాళ్ల చొప్పున 17 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు చేస్తుంటుంది. ఇందుకు ప్రభుత్వం ధాన్యం క్వింటాలుకు రూ.32 కమీషన్ సంఘానికి చెల్లిస్తుంది. ఇలా ఈ కమీషన్పై సంస్థ ఉద్యోగుల ద్వారా 40 కేంద్రాల్లో కొనుగోలు చేస్తుంటారు. ఇదికాకుండా మరో 60 మంది గ్రామీణ ప్రాంతాల్లో కమీషన్ పద్ధతిపై ధాన్యం కేంద్రాలను కొనసాగిస్తున్నారు. వీరికి మాత్రం సంస్థకు వచ్చే రూ.32లో సగం రూ.16 మాత్రమే ఇస్తుంటుంది. ఆ డబ్బు కూడా ఎరువు రూపంలో సరఫరా చేస్తే ఈ కేంద్రాల వారు వాటిని రైతులకు విక్రయించి డబ్బు జమ చేసుకుంటారు. నేరుగా కమీషన్ను చెక్కుల రూంలో ఇవ్వాల్సి ఉండగా, ఎరువులు అంటగట్టడంపై కొందరు అభ్యంతరం చేస్తున్నారు. కమీషన్దారులు ధాన్యం విక్రయించేందుకు సంస్థకు రూ.3 లక్షలు అడ్వాన్స్ చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే విధానంలో ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కావేటి రాజు ఆరు గ్రామాల్లో 2018 నుంచి 2023 వరకు వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఆయనకు సంస్థ రూ.69.25 లక్షల కమీషన్ చెల్లించాల్సి ఉండగా మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వర్రావు కొంతకాలంగా తిప్పుకుంటున్నారు. చివరకు లంచం డిమాండ్ చేసి, అనిశాకు చిక్కారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదివారం వైద్యసేవలకు సుస్తీ
[ 08-07-2024]
అసలే వానాకాలం. ఈ సమయంలో దోమలు, ఈగలు వృద్ధి చెంది.. వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇప్పటికే పలువురు వైరల్ జ్వరాలతో సతమతమవుతున్నారు. అక్కడక్కడ కుక్కలు, పాములు, కోతులు కరుస్తున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. -
ప్రహసనంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ
[ 08-07-2024]
పల్లెల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం గత ప్రభుత్వం అన్ని గ్రామాల్లో చెత్త విభజన నిల్వ కేంద్రాలు (సెగ్రిగేషన్ షెడ్లు) ఏర్పాటు చేసింది. ఇంటింటి నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వాటిని క్రమ పద్ధతిగా ఏరివేసి ఈ కేంద్రాలకు పంపించాలి. -
నీటి శుద్ధికి సాంకేతిక సమస్యలు
[ 08-07-2024]
నగర అవసరాలకు అనుకూలంగా తాగునీరు సరఫరా చేసేందుకు వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జలాన్ని శుద్ధి చేయడంలో సాంకేతిక సమస్యలు వస్తుండగా.. మరమ్మతు చేయడంలో జాప్యం చేస్తున్నారు. -
పర్యవేక్షణ కొరవడి.. బోధన కుంటుపడి
[ 08-07-2024]
ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక సర్కారు లక్ష్యం నీరుగారుతోంది. మండల స్థాయిల్లో పర్యవేక్షించే విద్యాధికారుల రెగ్యులర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉండటం ప్రభుత్వ తీరును వెక్కిరిస్తోంది. -
సాంకేతిక విద్య.. వసతులు మిథ్య
[ 08-07-2024]
జేఎన్టీయూ ఇంజీనిరింగ్ కళాశాల.. దేశ, విదేశాల్లో ఎంతో మంది సాంకేతిక పట్టభద్రులు జీవితంలో స్థిరపడేలా చేసిన ఉన్నత విద్యాసంస్థ.. ఏటా ఇక్కడ చదివి ఉత్తీర్ణులైన వేలాది మంది టెకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఐటీ, మెట్రోపాలిటన్ నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. -
ప్రజారోగ్యానికి రుచుల విపత్తు
[ 08-07-2024]
ఆకట్టుకునే రంగులు.. పైపై హంగులతో కూడిన ఆహార పదార్థాలను విక్రయిస్తూ కొందరు ప్రజారోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం సరకుల వాడకం, రసాయనాలు, రంగులు కలుపుతుండటంతో వ్యాధులు వెంటాడుతున్నాయి. మార్కెట్లో పెచ్చుమీరుతున్న కల్తీ ప్రాణాలను హరిస్తోంది. -
మానీరుపైనే ఆశలు నిండితేనే పంటల సాగు
[ 08-07-2024]
మానేరు జలాశయంలో నీరు లేక అన్నదాతలు పంటల సాగుకు వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్నారు. కొందరు నారు మడులు వేసినా నీరు లేక ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల నారు ముదిరిపోతుంది. -
కలగా సాంకేతిక విద్య
[ 08-07-2024]
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ విద్యకు శ్రీకారం చుట్టింది. కొన్నాళ్లు సక్రమంగానే సాగినప్పటికీ తరవాత మూలకు చేరింది. బోధకులు లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక విద్యపై అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
ఇప్పటికైనా మార్పు వచ్చేనా!
[ 08-07-2024]
రామగుండం కార్పొరేషన్పై జిల్లా పాలనాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంతో నగరపాలిక నిర్వహణ మెరుగు పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా!
[ 08-07-2024]
ఒకవైపు నాలుగు వరుసల రహదారి, మరోవైపు ఆర్వోబీకి వెళ్లే ఎత్తైన రహదారి రెండింటిని ఇరుకైన కూడలి కలిపేయడంతో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు కూడలి విస్తరణ చేపట్టాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. -
భవిష్యత్తు ప్రణాళికలు.. ప్రత్యామ్నాయ పనులు
[ 08-07-2024]
మెట్పల్లి, కోరుట్ల డివిజన్లలో సమస్యలు పరిష్కరించి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేలా ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది. భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ప్రత్యామ్నాయ ఫీడర్ల అనుసంధానం, విద్యుత్తు ఉపకేంద్రాల ఆధునికీకరణ పనులను చేపడుతున్నారు. -
వసతి గృహాలను పట్టించుకోరా?
[ 08-07-2024]
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు సమస్యలు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు. చప్పట్లు కొడుతూ కొందరు.. ఈలలు, కేరింతలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ మరికొందరు.