Government Hospitals: ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే
ప్రభుత్వ దవాఖానాలకు చికిత్సల కోసం వస్తున్న పేద రోగులపై మందుల రూపంలో పెను భారం పడుతోంది. చికిత్సల వరకు ఉచితంగా అందిస్తున్నా ఔషధాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదని రోగులు వాపోతున్నారు.
సర్కారు దవాఖానాల్లో ఔషధాలు ఖాళీ
పేద రోగులపై తప్పని ఆర్థిక భారం
ఈయన పేరు రాములు. ఊరు చౌటుప్పల్. న్యూరో సంబంధిత సమస్యతో గాంధీ ఆసుపత్రిలో ఇటీవల చేరాడు. వైద్యులు చికిత్స అందించారు. అయితే రెండు నెలలు వాడాలంటూ ఆరు రకాల మందులు రాశారు. తీరా ఆసుపత్రి మందుల కౌంటర్ వద్దకు వెళ్లాక.. ఆ ఆరు మందుల్లో ఒక్కటే చేతిలో పెట్టారు. మిగతా ఐదు రకాలు బయట కొనుక్కోవాలని సూచించారు. 2 నెలల మందులకే రూ.2 వేలు చెల్లించాలని దుకాణదారుడు చెప్పడంతో అంత డబ్బులు లేక రూ.600 పెట్టి పది రోజులకు సరిపడా తీసుకున్నారు.
ప్రభుత్వ దవాఖానాలకు చికిత్సల కోసం వస్తున్న పేద రోగులపై మందుల రూపంలో పెను భారం పడుతోంది. చికిత్సల వరకు ఉచితంగా అందిస్తున్నా ఔషధాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదని రోగులు వాపోతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయిదు రకాల మందులు రాస్తే రెండు, మూడు రకాలకు మించి లభించడం లేదు. ప్రధాన ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియాలో ఎక్కువ శాతం రోగులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోగి కనీసం రూ.200 వెచ్చించి బయట ప్రైవేటు షాపుల్లో మందులు కొంటున్నారు. గాంధీలో ఉన్న ప్రైవేటు మెడికల్ దుకాణాలు నిత్యం రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి రోజూ లక్షల్లోనే ఇక్కడ వ్యాపారం జరుగుతోన్న పరిస్థితి. మందుల దుకాణదారులు మాత్రం నామమాత్రపు అద్దె చెల్లించి రెండు చేతులా సంపాదిస్తున్నారు. లీజు గడువు ముగుస్తున్న ప్రతిసారీ న్యాయ స్థానాలను ఆశ్రయించి స్టేలు తెచ్చుకొని మరీ దుకాణాలు కొనసాగిస్తున్నారు.
రోగులకు తగ్గట్లు సరఫరా లేక...
గాంధీ, ఉస్మానియాల్లో అధికారిక పడకలు, వచ్చే రోగులను పరిగణలోకి తీసుకొని టీజీఎంఎస్ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం అక్కడ నుంచే ఔషధాలు పంపిస్తారు. మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. అయితే అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో రోగులందరికి మందులు సరఫరా చేయలేకపోతున్నారు. కొందరికి ఇవ్వాల్సిన వాటిలో కొన్ని కోత వేసి వేరే వారికి సర్దుబాటు చేస్తున్నారు. ఉస్మానియాలో 1,100 వరకు పడకలు ఉండగా...నిత్యం 1,500లకు పైనే రోగులు వస్తున్నారు. గాంధీలో వేయికి పైగా పడకలకు గాను 1,500 పైనే రోగుల తాకిడి ఉంటోంది. సీజన్లో ఈ రెండు ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 2వేలకు పెరుగుతోంది. ఆ స్థాయిలో అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండటం లేదు.
ప్రైవేటుతో లోపాయికారిగా...
కొన్ని విభాగాల్లో వైద్యులు ప్రైవేటు దుకాణదారులతో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని బయటకు మందులు రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై నిఘా పెట్టి గతంలో ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొందరి తీరు మారడం లేదు. ప్రభుత్వం అందించే మందులను పక్కనపెట్టి ప్రైవేటులో దొరికే ఇతర బ్రాండు మందులు రాస్తున్నారనే విమర్శలున్నాయి. ఫలితంగా పేద రోగులు డబ్బులు పెట్టి ప్రైవేటులో కొంటున్నారు. గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రులకు వచ్చే పేదలు బయట మందులు కొనలేక...డాక్టర్ నెల రోజులకు రాస్తే...వారం, పదిరోజులకు మాత్రమే తీసుకుంటున్నారు. తర్వాత వాడటం మానేస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోగులకు అన్ని రకాల మందులు ఉచితంగా అందేలా చొరవ తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
గాంధీలో మందుల కౌంటర్ వద్ద రోగులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
[ 07-07-2024]
కోటి మంది నగరవాసుల పక్షాన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశం తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రతి మూడు నెలలకోసారి గ్రేటర్ పాలకమండలి సమావేశం జరగాల్సి ఉండగా.. -
ఆషాఢం.. అమ్మోరికి బోనం
[ 07-07-2024]
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పట్టే బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నగరంలో ఆషాఢమాసంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. -
విద్యార్థులే లక్ష్యంగా ఈ-సిగరెట్ల విక్రయం!
[ 07-07-2024]
నగరంలో పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న తాడ్బన్కు చెందిన మహ్మద్ జాఫర్(25)ను అరెస్ట్ చేసినట్టు టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్శాండిల్య శనివారం తెలిపారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 07-07-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలైన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
జీఐఎస్ సర్వేతో.. రూ.1,500 కోట్ల ఆదాయం
[ 07-07-2024]
జీహెచ్ఎంసీ ముందు అనేక సవాళ్లున్నాయని వాటిలో ఆర్థిక సమస్యలు ప్రధానమైనవని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. -
విద్యుత్తు యాప్.. బహుళ ప్రయోజనకరం
[ 07-07-2024]
కరెంటు బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ఎక్కువ మంది టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్ను వినియోగిస్తున్నారు. ఈ నెలలో శనివారం నాటికి 1.92 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. -
తాగునీటితో మురుగు దోస్తీ
[ 07-07-2024]
‘చాలా రోజులుగా తాగునీటిని పట్టుకునేటప్పుడు పైపుల నుంచి తొలుత మురుగు వస్తోంది. భరించలేని దుర్వాసన వెలువడుతోంది. అధికారుల దృష్టికి పదేపదే తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. -
ఫిలింనగర్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించండి: హైకోర్టు
[ 07-07-2024]
ఫిలింనగర్ సహకార హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు గత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాజకీయాలు, పదవులపైనే కాంగ్రెస్కు శ్రద్ధ: ఈటల
[ 07-07-2024]
కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు, పదవులపైన ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. -
వాళ్లు మా పూర్వ విద్యార్థులు
[ 07-07-2024]
గంజాయి కొంటూ దొరికిన ఇద్దరు వైద్యులు తమ కళాశాల పూర్వ విద్యార్థులని, ప్రస్తుతం వారికి కళాశాలతో సంబంధం లేదని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. -
రాజ్తరుణ్ సహనటుడు మాత్రమే..
[ 07-07-2024]
రాజ్తరుణ్ తనకు దగ్గరయ్యాడనే విషయంలో నిజం లేదని, ఆయనతో తనకెలాంటి సంబంధం లేదని, తన సహ నటుడు మాత్రమేనని సినీనటి మాల్వి మల్హోత్రా పేర్కొన్నారు. -
చెట్టును ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం
[ 07-07-2024]
అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఇన్ఫెక్షన్లు.. రోడ్డు ప్రమాదాలతో మూత్రనాళ సమస్యలు
[ 07-07-2024]
యూరినరీ ఇన్ఫెక్షన్లు, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో మూత్ర నాళాల సమస్యలు అధికమవుతున్నాయని, ఈ క్రమంలో వాటి శస్త్ర చికిత్సలూ పెరుగున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
అత్యంత వైభవంగా ఆషాఢ బోనాలు: మంత్రి
[ 07-07-2024]
తెలంగాణ ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ తెలిపారు. -
ఇద్దరి అవయవదానం.. పలు జీవితాల్లో వెలుగులు
[ 07-07-2024]
రోడ్డు ప్రమాదంలో జీవన్మృతులైన ఇద్దరి అవయవదానం పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. హనుమకొండ నగరం వడ్డేపల్లి, టీచర్స్ కాలనీకి చెందిన సిరికొండ ప్రసాద్ (36) ఎన్ఐటీ వరంగల్లో ఒప్పంద ప్రతిపాదికన ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాడు. -
తాళం వేేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 07-07-2024]
నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు వీరికి సహకరించిన మరొకరిని ఫిల్మ్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
న్యాయవిద్యలో భారత్ది ప్రపంచ నాయకత్వ పాత్ర
[ 07-07-2024]
న్యాయవిద్యలో భారత్ ప్రపంచ నాయకత్వ పాత్రను పోషిస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లా స్కూల్లో ఏర్పాటు చేసి మూట్కోర్టును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.