ఆస్తులను రక్షిస్తాం.. ఆక్రమణల అంతు తేలుస్తాం
‘‘రాజధాని పరిధిలో రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆక్రమణకు గురైన వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు మొదలుపెట్టాం.
చెరువుల్లో, నాలాలపై వెలసిన ఆక్రమణలపై కఠిన చర్యలు
రోడ్లు, కాలనీల్లో ముంపు నివారణకు ప్రత్యేక దృష్టి
‘ఈనాడు’తో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
‘‘రాజధాని పరిధిలో రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆక్రమణకు గురైన వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు మొదలుపెట్టాం.నగరంలో భారీ వర్షం పడితే వరద సాఫీగా వెళ్లడానికి నాలాలు, రోడ్లపై ఆక్రమణలను తొలగిస్తాం’’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇటీవలే ఈ విభాగం కొత్తగా ఏర్పాటైంది. దీనికి తొలి కమిషనర్గా నియమితులైన ఐపీఎస్ అధికారి రంగనాథ్ గురువారం ‘ఈనాడు’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.
ప్రశ్న: మహానగరంలో అనేక జంక్షన్ల దగ్గర చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలిచి ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?
జవాబు: దీనిపై రెండు రోజుల కిందట ట్రాఫిక్ డీసీపీలతో సమావేశాన్ని నిర్వహించాం. ఆక్రమణల వల్ల ఎక్కడైతే ట్రాఫిక్ ఆగిపోతుందో ఆ ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వమని కోరాను. ఆ ప్రాంతాల్లో ముందుగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియను మొదలుపెడతాం. నగర ట్రాఫిక్ బాస్గా నేను పని చేయడం వల్ల అవగాహన ఉంది. నగరంలో 140 జంక్షన్లు ఉన్నాయి. వీటి దగ్గర నాలాల విస్తరణ చేపట్టాలని అనుకుంటున్నాం. దీనివల్ల జంక్షన్ల దగ్గర చేరిన నీరు పది నిమిషాల్లోనే నాలాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం.
ప్ర: ’రాజధానిలో వందల చెరువుల ఎఫ్టీఎల్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. వర్షం నీరు వెళ్లే మార్గం లేక నగరం ముంపునకు గురవుతోంది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు?
జ: ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు వెలిశాయి. చెరువుల గొలుసుకట్టు వ్యవస్థ ధ్వంసమై వరద వెళ్లే మార్గం లేక నగరం ముంపులో చిక్కుకుంటోంది. ఈ నేపథ్యంలో చెరువుల ఆక్రమణలపై దృష్టిసారించాం. వాటి వెనుక ఎవరున్నారో వెలికితీసే ప్రక్రియను మొదలుపెట్టనున్నాం. నివేదిక రూపొందించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వీటిని కూల్చివేసే ప్రణాళిక అమలు చేస్తాం.
ప్ర: కొత్తగా ‘హైడ్రా’ అనే సంస్థను ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి?
జవాబు: బల్దియా పరిధిలో గతంలో ఈవీడీఎం అనే వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థ బల్దియా కమిషనర్ ఆధీనంలో ఉండేది. బల్దియా, హెచ్ఎండీఏ, జలమండలి మాదిరిగా ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తలపెట్టారు. ఈ సంస్థ కమిషనర్ ఆక్రమణలు ఇతరత్రా వ్యవహారాలపై స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వెంటవెంటనే చర్యలకు అవకాశం ఉంటుంది. అందుకే దాదాపు 3వేల మందితో ఈ సంస్థ రూపుదాల్చనుంది.
ప్ర: మహానగరంలో నాలాల ఆక్రమణ చాలా దారుణంగా ఉంది. దీని వల్లే వేలాది కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. దీనికి పరిష్కారమెలా?
జవాబు: కొద్దిరోజుల కిందట మా సిబ్బంది కొన్ని నాలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చాలా నాలాలు పూడికతో నిండిపోయాయి. బల్దియా రికార్డుల్లో ఈ నాలాల్లో ఏటా పూడిక తీసినట్లుగా ఉంటోంది. అందుకే ముందుగా పూడిక తీసే గుత్తేదారులు, శాఖ ఇంజినీర్లతో కొద్దిరోజుల్లో సమావేశమవ్వాలని నిర్ణయించాం. ఇకముందు పూడికతీత సక్రమంగా చేయకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించనున్నాం. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. నాలాలపై నిర్మించిన భవనాలకు సంబంధించి విచారణ మొదలుపెడతాం. త్వరలో హైడ్రాకు పూర్తి విధివిధానాలు జీవో రూపంలో వస్తాయి. అప్పుడు ఈ ఆక్రమణల అంతు తేలుస్తాం.
ప్ర: నగరంలో ఎక్కడపడితే అక్కడ అక్రమ నిర్మాణాలున్నాయి. బల్దియా ప్రణాళికా విభాగం పట్టించుకోవడం లేదు?
- దీని కోసమే బల్దియా, హెచ్ఎండీఏ పరిధిలోని నగర ప్రణాళిక విభాగం ప్లానర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నగరంలో ఆక్రమణలకు సంబంధించి వారితో సమగ్రంగా చర్చించనున్నాం. వీరిలో జవాబుదారీతనం పెంపొందించడంతోపాటు వీరితోనే అక్రమ నిర్మాణాలు గుర్తించే కార్యక్రమం త్వరలోనే మొదలుపెడతాం. ముందుగా పెద్దల ఆక్రమణలపై దృష్టిసారిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించి
[ 07-07-2024]
కోటి మంది నగరవాసుల పక్షాన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశం తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రతి మూడు నెలలకోసారి గ్రేటర్ పాలకమండలి సమావేశం జరగాల్సి ఉండగా.. -
ఆషాఢం.. అమ్మోరికి బోనం
[ 07-07-2024]
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పట్టే బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నగరంలో ఆషాఢమాసంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. -
విద్యార్థులే లక్ష్యంగా ఈ-సిగరెట్ల విక్రయం!
[ 07-07-2024]
నగరంలో పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న తాడ్బన్కు చెందిన మహ్మద్ జాఫర్(25)ను అరెస్ట్ చేసినట్టు టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్శాండిల్య శనివారం తెలిపారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 07-07-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలైన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
జీఐఎస్ సర్వేతో.. రూ.1,500 కోట్ల ఆదాయం
[ 07-07-2024]
జీహెచ్ఎంసీ ముందు అనేక సవాళ్లున్నాయని వాటిలో ఆర్థిక సమస్యలు ప్రధానమైనవని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. -
విద్యుత్తు యాప్.. బహుళ ప్రయోజనకరం
[ 07-07-2024]
కరెంటు బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ఎక్కువ మంది టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్ను వినియోగిస్తున్నారు. ఈ నెలలో శనివారం నాటికి 1.92 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. -
తాగునీటితో మురుగు దోస్తీ
[ 07-07-2024]
‘చాలా రోజులుగా తాగునీటిని పట్టుకునేటప్పుడు పైపుల నుంచి తొలుత మురుగు వస్తోంది. భరించలేని దుర్వాసన వెలువడుతోంది. అధికారుల దృష్టికి పదేపదే తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. -
ఫిలింనగర్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించండి: హైకోర్టు
[ 07-07-2024]
ఫిలింనగర్ సహకార హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు గత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాజకీయాలు, పదవులపైనే కాంగ్రెస్కు శ్రద్ధ: ఈటల
[ 07-07-2024]
కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు, పదవులపైన ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. -
వాళ్లు మా పూర్వ విద్యార్థులు
[ 07-07-2024]
గంజాయి కొంటూ దొరికిన ఇద్దరు వైద్యులు తమ కళాశాల పూర్వ విద్యార్థులని, ప్రస్తుతం వారికి కళాశాలతో సంబంధం లేదని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. -
రాజ్తరుణ్ సహనటుడు మాత్రమే..
[ 07-07-2024]
రాజ్తరుణ్ తనకు దగ్గరయ్యాడనే విషయంలో నిజం లేదని, ఆయనతో తనకెలాంటి సంబంధం లేదని, తన సహ నటుడు మాత్రమేనని సినీనటి మాల్వి మల్హోత్రా పేర్కొన్నారు. -
చెట్టును ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం
[ 07-07-2024]
అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఇన్ఫెక్షన్లు.. రోడ్డు ప్రమాదాలతో మూత్రనాళ సమస్యలు
[ 07-07-2024]
యూరినరీ ఇన్ఫెక్షన్లు, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో మూత్ర నాళాల సమస్యలు అధికమవుతున్నాయని, ఈ క్రమంలో వాటి శస్త్ర చికిత్సలూ పెరుగున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
అత్యంత వైభవంగా ఆషాఢ బోనాలు: మంత్రి
[ 07-07-2024]
తెలంగాణ ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ తెలిపారు. -
ఇద్దరి అవయవదానం.. పలు జీవితాల్లో వెలుగులు
[ 07-07-2024]
రోడ్డు ప్రమాదంలో జీవన్మృతులైన ఇద్దరి అవయవదానం పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. హనుమకొండ నగరం వడ్డేపల్లి, టీచర్స్ కాలనీకి చెందిన సిరికొండ ప్రసాద్ (36) ఎన్ఐటీ వరంగల్లో ఒప్పంద ప్రతిపాదికన ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాడు. -
తాళం వేేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 07-07-2024]
నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు వీరికి సహకరించిన మరొకరిని ఫిల్మ్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
న్యాయవిద్యలో భారత్ది ప్రపంచ నాయకత్వ పాత్ర
[ 07-07-2024]
న్యాయవిద్యలో భారత్ ప్రపంచ నాయకత్వ పాత్రను పోషిస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లా స్కూల్లో ఏర్పాటు చేసి మూట్కోర్టును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!
-
పురుగుల మందు నువ్వు తాగుతావా..?పిల్లలకు పట్టించనా..!
-
గుడ్డిగా నిర్మించారు.. అడ్డుగా వదిలేశారు
-
బంగ్లా ఆధునికీకరణకు రూ.60 లక్షలు!.. వైకాపా హయాంలో ఓ అధికారిణి ఇష్టారాజ్యం