నేలమట్టం చేసినా పుట్టుకొస్తున్నాయి
చెరువులోని నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చడం.. కొంత కాలం తర్వాత మళ్లీ అక్కడ భవనాలు రావడం సర్వసాధారణమైంది.
సున్నం, మైసమ్మ, కాముని చెరువుల్లో ఆక్రమణలు
సున్నం చెరువులో కూల్చిన భవనాన్ని మళ్లీ కడుతున్న వైనం
ఈనాడు, హైదరాబాద్: చెరువులోని నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చడం.. కొంత కాలం తర్వాత మళ్లీ అక్కడ భవనాలు రావడం సర్వసాధారణమైంది. తటాకాల ఎఫ్టీఎల్(పూర్తి స్థాయి నీటి మట్టం) భూముల విషయంలో తరచుగా కనిపిస్తోన్న దృశ్యమిది. హైటెక్సిటీకి సమీపంలో ఉన్న మైసమ్మ చెరువు, కాముని చెరువు, సున్నం చెరువుల దుస్థితే అందుకు నిదర్శనం. 2017లో సున్నం చెరువు ఎఫ్టీఎల్లోని ఐదంతస్తుల భవనాన్ని జిలిటెన్ స్టిక్లతో కూల్చగా.. ఇప్పుడు మళ్లీ అక్కడ నిర్మాణం జరుగుతోంది. చుట్టూ మరిన్ని నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. మైసమ్మ చెరువు అల్లాపూర్ డివిజన్ వైపు 50ఎకరాల మేర ఆక్రమణకు గురవగా, ఇప్పుడు మూసాపేట దోబీఘాట్ వైపు నిర్మాణాలు చేపడుతున్నారు. పక్కనే ఉన్న కాముని చెరువు ఎఫ్టీఎల్లోనూ నిర్మాణాలు జరుగుతుండటం గమనార్హం.
పదేళ్లలో 11 కనుమరుగు.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్(టీజీఆర్ఏసీ) ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సంస్థ పటాలను విశ్లేషించి.. ‘‘2014కు పూర్వం గ్రేటర్లో 417 చెరువులు, కుంటలు ఉండగా, 182 పూర్తిగా, 76 పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. 2014 నుంచి 2023 వరకు 11 పూర్తిగా, 7 పాక్షికంగా కనుమరుగయ్యాయి. మొత్తంగా ఓఆర్ఆర్వరకు 920 జల వనరులుంటే.. 282పూర్తిగా, 209 పాక్షికంగా కబ్జాకు గురయ్యాయి’’అని టీజీఆర్ఏసీ అధికారులు వివరించారు.
జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం..
జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో 185 చెరువులున్నాయి. చెరువుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వాటికి హద్దులను గుర్తించే ప్రక్రియ పదేళ్లుగా పూర్తవట్లేదు. ఈ క్రమంలో పలువురు బల్దియాలోని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, ప్రణాళిక విభాగం అధికారులు కొన్ని చెరువులకు ఉరేశారు. ఎఫ్టీఎల్ పటాలను తారుమారు చేసి.. వందలాది ఎకరాల చెరువు భూముల ఆక్రమణకు ఊతమిచ్చారు. అప్పుడప్పుడు ప్రణాళిక విభాగం ఎఫ్టీఎల్లోని కొన్ని భవనాలను కూల్చినా.. మళ్లీ భవనాలు రాకుండా అడ్డుకోవట్లేదు. మే 7, 2017లో సున్నం చెరువులో బాంబులతో పేల్చిన భవనం స్థానంలో మళ్లీ బహుళ అంతస్తుల నిర్మాణం మొదలవడమే నిదర్శనం. బల్దియా ఇంజినీర్లు ఎఫ్టీఎల్లోనే రోడ్డు నిర్మించగా, పక్కనా కబ్జాలు వచ్చాయి. మైసమ్మ చెరువును నాలుగెకరాల మేర ఆక్రమణదారులు మట్టితో పూడ్చి, నకిలీ శ్మశానవాటిక, కాలనీ ఏర్పాటుకు రంగం సిద్ధంచేయడం గమనార్హం. కాముని చెరువు ఎఫ్టీఎల్లోనూ ఎకరాల కొదీ భూముల్లో భవనాలు, గోదాములు, రేకుల షెడ్లను నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించి
[ 07-07-2024]
కోటి మంది నగరవాసుల పక్షాన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశం తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రతి మూడు నెలలకోసారి గ్రేటర్ పాలకమండలి సమావేశం జరగాల్సి ఉండగా.. -
ఆషాఢం.. అమ్మోరికి బోనం
[ 07-07-2024]
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పట్టే బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. నగరంలో ఆషాఢమాసంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. -
విద్యార్థులే లక్ష్యంగా ఈ-సిగరెట్ల విక్రయం!
[ 07-07-2024]
నగరంలో పాఠశాలలు, ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న తాడ్బన్కు చెందిన మహ్మద్ జాఫర్(25)ను అరెస్ట్ చేసినట్టు టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్శాండిల్య శనివారం తెలిపారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరి దుర్మరణం
[ 07-07-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలైన ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
జీఐఎస్ సర్వేతో.. రూ.1,500 కోట్ల ఆదాయం
[ 07-07-2024]
జీహెచ్ఎంసీ ముందు అనేక సవాళ్లున్నాయని వాటిలో ఆర్థిక సమస్యలు ప్రధానమైనవని కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. -
విద్యుత్తు యాప్.. బహుళ ప్రయోజనకరం
[ 07-07-2024]
కరెంటు బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ఎక్కువ మంది టీఎస్ఎస్పీడీసీఎల్ యాప్ను వినియోగిస్తున్నారు. ఈ నెలలో శనివారం నాటికి 1.92 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. -
తాగునీటితో మురుగు దోస్తీ
[ 07-07-2024]
‘చాలా రోజులుగా తాగునీటిని పట్టుకునేటప్పుడు పైపుల నుంచి తొలుత మురుగు వస్తోంది. భరించలేని దుర్వాసన వెలువడుతోంది. అధికారుల దృష్టికి పదేపదే తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. -
ఫిలింనగర్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించండి: హైకోర్టు
[ 07-07-2024]
ఫిలింనగర్ సహకార హౌసింగ్ సొసైటీ లిమిటెడ్కు గత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రాజకీయాలు, పదవులపైనే కాంగ్రెస్కు శ్రద్ధ: ఈటల
[ 07-07-2024]
కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు, పదవులపైన ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలపై లేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. -
వాళ్లు మా పూర్వ విద్యార్థులు
[ 07-07-2024]
గంజాయి కొంటూ దొరికిన ఇద్దరు వైద్యులు తమ కళాశాల పూర్వ విద్యార్థులని, ప్రస్తుతం వారికి కళాశాలతో సంబంధం లేదని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. -
రాజ్తరుణ్ సహనటుడు మాత్రమే..
[ 07-07-2024]
రాజ్తరుణ్ తనకు దగ్గరయ్యాడనే విషయంలో నిజం లేదని, ఆయనతో తనకెలాంటి సంబంధం లేదని, తన సహ నటుడు మాత్రమేనని సినీనటి మాల్వి మల్హోత్రా పేర్కొన్నారు. -
చెట్టును ఢీ కొట్టిన కారు.. విద్యార్థి దుర్మరణం
[ 07-07-2024]
అతి వేగంగా కారు నడిపి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం కీసర మండలం బోగారం సమీపంలో జరిగింది. -
ఇన్ఫెక్షన్లు.. రోడ్డు ప్రమాదాలతో మూత్రనాళ సమస్యలు
[ 07-07-2024]
యూరినరీ ఇన్ఫెక్షన్లు, రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో మూత్ర నాళాల సమస్యలు అధికమవుతున్నాయని, ఈ క్రమంలో వాటి శస్త్ర చికిత్సలూ పెరుగున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
అత్యంత వైభవంగా ఆషాఢ బోనాలు: మంత్రి
[ 07-07-2024]
తెలంగాణ ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ తెలిపారు. -
ఇద్దరి అవయవదానం.. పలు జీవితాల్లో వెలుగులు
[ 07-07-2024]
రోడ్డు ప్రమాదంలో జీవన్మృతులైన ఇద్దరి అవయవదానం పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. హనుమకొండ నగరం వడ్డేపల్లి, టీచర్స్ కాలనీకి చెందిన సిరికొండ ప్రసాద్ (36) ఎన్ఐటీ వరంగల్లో ఒప్పంద ప్రతిపాదికన ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాడు. -
తాళం వేేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 07-07-2024]
నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు వీరికి సహకరించిన మరొకరిని ఫిల్మ్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. -
న్యాయవిద్యలో భారత్ది ప్రపంచ నాయకత్వ పాత్ర
[ 07-07-2024]
న్యాయవిద్యలో భారత్ ప్రపంచ నాయకత్వ పాత్రను పోషిస్తోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లా స్కూల్లో ఏర్పాటు చేసి మూట్కోర్టును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మీరు భలే ఉంటారు...! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
లక్ష ఇళ్లు అంధకారంలో.. ఉక్రెయిన్పై భీకర దాడులు!