logo

రామోజీరావు యువతకు స్ఫూర్తి ప్రదాత

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావు యువతకు స్ఫూర్తి ప్రదాత అని మున్నూరు కాపు విద్యార్థి వసతిగృహం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ ప్రొ.ఎంఆర్‌ వెంకట్రావు కొనియాడారు.

Updated : 05 Jul 2024 05:50 IST

నివాళులర్పిస్తున్న ప్రొ.వెంకట్రావు, విష్ణువర్ధన్, శ్రీనివాస్‌రావు, నగేష్, దేవేందర్, చంద్రశేఖర్‌ 

కాచిగూడ, న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావు యువతకు స్ఫూర్తి ప్రదాత అని మున్నూరు కాపు విద్యార్థి వసతిగృహం ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ ప్రొ.ఎంఆర్‌ వెంకట్రావు కొనియాడారు. ఆయన ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నిబద్ధతకు తోడు వివిధరంగాల్లో సాధించిన విజయాలు నేటి యువతరానికి ఆదర్శనీయమన్నారు. గురువారం కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి గృహం ట్రస్ట్‌బోర్డు కార్యాలయంలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో వెంకట్రావు మాట్లాడారు. మహోన్నత వ్యక్తిగా రామోజీరావు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ట్రస్ట్‌బోర్డు సభ్యులు విష్ణువర్ధన్, శ్రీనివాస్‌రావు, నగేష్, దేవేందర్, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని